మెగా అభిమానులకు గత కొన్నేళ్ల నుంచి చేదు అనుభవాలే మిగులుతున్నాయి. మెగాస్టార్ చిరంజీవి నుంచి చివరగా వచ్చిన ‘భోళా శంకర్’ ఎంత పెద్ద డిజాస్టర్ అయిందో తెలిసిందే. పవన్ కళ్యాణ్ నుంచి సినిమాలే రావడం లేదు. ఆయన చివరి చిత్రం ‘బ్రో’ నిరాశపరిచింది. వరుణ్ తేజ్ మూవీ ‘మట్కా’తో డిజాస్టర్ స్ట్రీక్ను కొనసాగించాడు. రామ్ చరణ్ లేటెస్ట్ మూవీ ‘గేమ్ చేంజర్’ కూడా బాక్సాఫీస్ దగ్గర షాక్ తింది. ఈ నేపథ్యంలో మెగా హీరోలు చేస్తున్న ఫ్యూచర్ ప్రాజెక్టుల మీదే వారి ఆశలు నిలబడ్డాయి. వాటిలో మోస్ట్ ప్రామిసింగ్గా కనిపిస్తున్న మూవీ రామ్ చరణ్ హీరోగా ‘ఉప్పెన’ దర్శకుడు బుచ్చిబాబు సానా తెరకెక్కిస్తున్నదే అనడంలో సందేహం లేదు.
‘ఉప్పెన’ పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యాక హడావుడి పడకుండా చరణ్ లాంటి పెద్ద స్టార్తో సినిమాను ఓకే చేయించుకున్నాడు బుచ్చిబాబు. ఈ కథ గురించి విజయ్ సేతుపతి, శివరాజ్ కుమార్ లాంటి వేరే ఇండస్ట్రీల స్టార్లు ఒక రేంజిలో చెప్పారు ఇప్పటికే. సుకుమార్ సైతం ఈ కథ సూపర్ అన్నాడు. బుచ్చిబాబు సైతం ఈ సినిమా గురించి ముందు నుంచి గొప్పగా మాట్లాడుతున్నాడు. తాజాగా బ్రహ్మాజీ సినిమా ‘బాపు’ ప్రి రిలీజ్ ఈవెంట్కు అతిథిగా వచ్చిన బుచ్చిబాబు.. చరణ్తో తన సినిమా గురించి రెండు ముక్కలు మాట్లాడాడు.
తన తొలి చిత్రం ‘ఉప్పెన’ థియేటర్లలో ఉండగా.. తన తండ్రి థియేటర్ బయట ఎదురు చూస్తూ సినిమా చూసిన ప్రేక్షకులను ఎలా ఉంది అంటూ అడిగేవాడని.. కానీ చరణ్తో తాను చేస్తున్న సినిమా గురించి మాత్రం అలా అడగాల్సిన పని లేదని బుచ్చిబాబు అన్నాడు. ఎందుకంటే ఈ సినిమా చాలా బాగుంటుందని వ్యాఖ్యానించాడు. ఈ కామెంట్ చరణ్ అభిమానులకు ధీమానిస్తోంది. ఇతర ప్రేక్షకుల్లోనూ సినిమా పట్ల హైప్ పెంచుతోంది. కొన్ని కారణాల వల్ల ఈ సినిమా సెట్స్ మీదికి వెళ్లడంలో ఆలస్యం జరిగింది. ప్రస్తుతం చిత్రీకరణ తొలి దశలో ఉన్న ఈ సినిమాను వచ్చే సంక్రాంతి లేదా వేసవికి రిలీజ్ చేసే అవకాశముంది.
పోలీసు స్టేషన్లకు వెళ్లి ఫిర్యాదు చేయాల్సిన అవసరం లేకుండా.. ఇక నుంచి వాయిస్ మెసేజ్ల ద్వారా కూడా ఫిర్యాదులు చేసే…
ఏపీలో వైసీపీ అదికారంలో ఉన్నప్పుడు రాష్ట్రంలోని పాత జిల్లాలతో పాటుగా వైసీపీ సర్కారే కొత్తగా ఏర్పాటు చేసిన కొత్త జిల్లాల్లోనూ…
పవన్ కళ్యాణ్ భుజాల లోపల కలిగిన గాయం ఊహించిన దానికంటే తీవ్రంగా ఉన్నట్లు వైద్యులు నిర్ధారించారు. ముంబైలోని కోకిలాబెన్ ధీరూభాయ్…
ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజును వేధింపులకు గురిచేసి.. కస్టడీలో టార్చర్ చేశారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐపీఎస్ సునీల్ కుమార్…
రాజకీయాలంటే చాలా మంది చెడిపోయాయని అనుకుంటారు. కానీ, రాజకీయాలు అంతగా ఏమీ చెడిపోలేదు. ఒక పార్టీ కారణంగానే ఈ పేరు…
జూనియర్ ఎన్టీఆర్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో ఫ్యాన్స్ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న అనౌన్స్ మెంట్ ఇవాళ వచ్చేసింది. నిజానికి…