Movie News

మాధవన్ చేతికి దొరికిన సూపర్ మిరాకిల్

సఖి, చెలి లాంటి సినిమాల ద్వారా తెలుగు ప్రేక్షకులకు మాధవన్ ఎప్పటి నుంచో సుపరిచితుడే. మధ్యలో కొంత గ్యాప్ వచ్చినట్టు అనిపించినా కొన్నేళ్లుగా తిరిగి ఫామ్ లోకి వచ్చేశాడు. విలన్ గానూ ఆకట్టుకుంటున్నాడు. నాగ చైతన్య సవ్యసాచి ఆడలేదు కానీ లేదంటే అందులో పెర్ఫార్మన్స్ కి మరిన్ని టాలీవుడ్ ఆఫర్లు క్యూ కట్టేవి. అజయ్ దేవగన్ సైతాన్ లో చేతబడి చేసే మాంత్రికుడిగా భయపెట్టిన మాధవన్ అంతకు ముందు రాకెట్రీ ది నంబి ఎఫెక్ట్ ద్వారా హీరోగా, దర్శకుడిగా ఒక నిజ జీవిత సైంటిస్ట్ కథను తెరమీద అద్భుతంగా ఆవిష్కరించాడు. తాజాగా మరో క్రేజీ సబ్జెక్టుని పట్టి ఇంకో బయోపిక్ తో వస్తున్నాడు.

కోయంబత్తూర్ వాస్తవ్యులు గోపాలస్వామి దొరైస్వామి నాయుడు. ఈయన్ని ఎడిసన్ అఫ్ ఇండియా అని పిలిచేవారు. మన దేశంలో మొదటి ఎలెక్ట్రిక్ మోటార్ కనిపెట్టింది నాయుడే. తొలుత పారిశ్రామిక పరికరాలను కనుగొనడంలో తన ప్రతిభను చూపించడం మొదలుపెట్టి క్రమంగా ఆటోమొబైల్ లాంటి ఇతర రంగాలకు విస్తరింపజేశారు. పుట్టి పెరిగిన నగరానికి సంపద సృష్టించిన మేధావిగా జిడిఎన్ కు ఎన్నో పేరు ప్రఖ్యాతులున్నాయి. విచిత్రం ఏంటంటే ఒక రైతు కుటుంబలో పుట్టి చదువంటే ఆసక్తి లేక స్కూల్ కు దూరంగా ఉంటూ హోటల్ లో సర్వర్ గా జీవితాన్ని ప్రారంభించారు. స్కూటర్ కొనడం కోసం డబ్బు దాచుకునేవారు.

మెకానిక్ గా మారాక స్వంతంగా ప్రయోగాలు చేయడం మొదలుపెట్టారు. పదకొండు గంటల్లో ఇల్లు కట్టిన అరుదైన ఘనతలు ఈయన ఖాతాలో ఉన్నాయి. 1974లో జిడిఎన్ కన్నుమూశారు. ఇక్కడ మొత్తం చెప్పడం సాధ్యపడదు కానీ గోపాలస్వామి జీవితంలో బోలెడంత డ్రామా, ఎమోషన్, స్ఫూర్తి ఉన్నాయి. త్వరలో ఇవి మాధవన్ ద్వారా పరిచయం కాబోతున్నాయి. జిడిఎన్ టైటిల్ తో రూపొందుతున్న ఈ బయోపిక్ కి కృష్ణకుమార్ రామ్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రియమణి, యోగిబాబు ఇతర తారాగణం. మిరకిల్ మెన్ అని జనం పిలుచుకునే గోపాలస్వామి దొరైస్వామి నాయుడు వెండితెరపై ఎన్ని అద్భుతాలు చేస్తారో.

This post was last modified on February 19, 2025 4:32 pm

Share
Show comments
Published by
Kumar
Tags: Madhavan

Recent Posts

విదేశీ యూనివ‌ర్సిటీల డాక్టరేట్లు వదులుకున్న చంద్రబాబు

ఏపీ సీఎం చంద్ర‌బాబుకు ప్ర‌ముఖ దిన‌ప‌త్రిక `ఎక‌న‌మిక్ టైమ్స్‌`.. ప్ర‌తిష్టాత్మ‌క వ్యాపార సంస్క‌ర్త‌-2025 పుర‌స్కారానికి ఎంపిక చేసిన విష‌యం తెలిసిందే.…

16 minutes ago

బంగ్లా విషయంలో భారత్ భద్రంగా ఉండాల్సిందేనా?

బంగ్లాదేశ్‌లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు భారత్‌కు పెద్ద తలనొప్పిగా మారాయి. 1971 విముక్తి యుద్ధం తర్వాత మన దేశానికి ఇదే…

56 minutes ago

ఆమెకు ‘ఏఐ’ మొగుడు

ప్రేమ ఎప్పుడు ఎవరి మీద పుడుతుందో చెప్పలేం అంటారు. కానీ జపాన్ లో జరిగిన ఈ పెళ్లి చూస్తే టెక్నాలజీ…

1 hour ago

ఖర్చు పెట్టే ప్రతి రూపాయి లెక్క తెలియాలి

ప్ర‌భుత్వం త‌ర‌ఫున ఖ‌ర్చుచేసేది ప్ర‌జాధ‌న‌మ‌ని సీఎం చంద్ర‌బాబు తెలిపారు. అందుకే ఖ‌ర్చు చేసే ప్ర‌తి రూపాయికీ ఫ‌లితాన్ని ఆశిస్తాన‌ని చెప్పారు.…

3 hours ago

వాళ్ళిద్దరినీ కాదని చంద్రబాబుకే ఎందుకు?

`వ్యాపార సంస్క‌ర్త‌-2025` అవార్డును ఏపీ సీఎం చంద్ర‌బాబు కైవసం చేసుకున్నారు. అయితే.. దేశ‌వ్యాప్తంగా 28 రాష్ట్రాలు, 28 మంది ముఖ్య‌మంత్రులు…

4 hours ago

దమ్ముంటే నన్ను జైలుకు పంపు: జగన్ కు బీజేపీ మంత్రి సవాల్

మెడికల్ కాలేజీలను సొంతం చేసుకున్న వారిని తాను అధికారం లోకి రాగానే రెండు నెలల్లో జైలుకు పంపుతాను అన్న వైఎస్…

5 hours ago