టాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో కాజల్ అగర్వాల్ కొంచెం భిన్నంగా ఉంటుంది. ఆమె దశాబ్దంన్నరగా ఇక్కడ సినిమాలు చేస్తోంది కానీ.. టాలీవుడ్ జనాలతో వ్యక్తిగతంగా దగ్గరై స్నేహం చేయడం చాలా తక్కువ. సినిమా చేశామా.. ముంబయి వెళ్లిపోయామా అన్నట్లుండేది ఆమె వ్యవహారం. సమంత, తమన్నా, అనుష్క లాంటి సమకాలీన స్టార్ హీరోయిన్ల లాగా ఆమె ఇండస్ట్రీ జనాలతో సన్నిహితంగా ఉన్నట్లు ఎప్పుడూ సంకేతాలు కనిపించలేదు.
ఈ నేపథ్యంలో ఈ నెల చివర్లో జరగబోతున్న కాజల్ పెళ్లికి టాలీవుడ్ స్టార్ హీరోలెవరైనా వెళ్తారా అన్నది సందేహంగానే ఉంది. మామూలు రోజుల్లో అయితే ఓకే, అది కూడా హైదరాబాద్లో పెళ్లి అంటే అది వేరు. కానీ ఇప్పుడు కరోనా టైం నడుస్తోంది. పెళ్లిళ్లకు పరిమిత సంఖ్యలో మాత్రమే అతిథులు హాజరవుతున్నారు. పైగా కాజల్ పెళ్లి జరగబోయేది ముంబయిలో.
ఐతే స్టార్ హీరోల సంగతేమో కానీ.. యంగ్, అప్ కమింగ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ మాత్రం కాజల్ పెళ్లికి హాజరు కాబోతున్నాడు. ఈ విషయాన్ని అతనే వెల్లడించాడు. ఎక్కువగా స్టార్ హీరోలతోనే సినిమాలు చేసిన కాజల్.. కెరీర్ చివర్లో బెల్లంకొండ శ్రీనివాస్తో ఒకటికి రెండు సినిమాలు (కవచం, సీత) చేసి ఆశ్చర్యానికి గురి చేసింది. ఆ సమయంలో వీళ్లిద్దరూ బాగా క్లోజ్ ఫ్రెండ్స్ అయిన విషయం కొన్ని ఫొటోలను బట్టి తెలిసింది.
కరోనా టైంలో కాజల్ను మిస్సవుతున్నట్లు కూడా శ్రీనివాస్ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టడం చర్చనీయాంశమైంది. ఇప్పుడు కాజల్ పెళ్లి గురించి శ్రీనివాస్ స్పందిస్తూ.. ‘‘కాజల్ నా బెస్ట్ ఫ్రెండ్. ఆమె నా కుటుంబంలోని వ్యక్తితో సమానం. కాజల్కు మంచి జీవిత భాగస్వామి దొరకడం సంతోషంగా ఉంది. గౌతమ్ గొప్ప వ్యక్తి. వారిద్దరికీ నా శుభాకాంక్షలు. నేనిప్పుడు షూటింగ్లో ఉన్నాను. కానీ విరామం తీసుకుని కాజల్ పెళ్లికి హాజరు కావాలి. మిగిలిన పనుల కోసం తన పెళ్లికి దూరం కాలేను’’ అని చెప్పాడు. ఈ మాటల్ని బట్టి శ్రీనివాస్, కాజల్లది క్లోజ్ ఫ్రెండ్షిప్పే అని అర్థమవుతోంది.
ప్రపంచమంతా ఒక సినిమా కోసం ఎదురు చూడటం చాలా అరుదు. క్రిస్టోఫర్ నోలన్ దర్శకత్వం వహించిన ది ఒడిస్సీ ఈ…
ఊరు వాడ పేరుతో ఎన్టీఆర్ అభిమానులు చేపడుతున్న సేవా కార్యక్రమాల వ్యవహారం ఇటీవల ఆంధ్రప్రదేశ్లో హాట్ టాపిక్గా మారిన సంగతి…
న్యాయస్థానంలో సాక్ష్యాధారాలే కీలకం. మూఢనమ్మకాలతో చట్టాన్ని ప్రభావితం చేయలేరు... అయితే అమాయకత్వమో.. మరి ఏమో కానీ తీర్పు తనకు అనుకూలంగా…
సినీ రంగంలో గొప్ప స్థాయికి చేరుకున్న చాలామంది దర్శకులు ఒకప్పుడు అనామకులే. ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి అవకాశాల కోసం కాళ్లరిగేలా…
ఒకే రోజు ఏపీలో రెండు ఘటనలు.. ఒకటి ప్రకాశం జిల్లా సింగరాయకొండ. మరొకటి పల్నాడు జిల్లా వినుకొండ. రెండు ప్రాంతాలు…
రాయలసీమను కూటమి ప్రభుత్వం పెట్టుబడుల సీమగా మారుస్తోంది. పెద్ద ఎత్తున పెట్టుబడులు తరలి వస్తున్నాయి. తాజాగా దాల్మియా సిమెంట్ భారీ…