Movie News

జన నాయకుడు వస్తే మనకు ఇబ్బందే

తలపతి విజయ్ రాజకీయ ప్రవేశానికి ముందు చివరి సినిమాగా విపరీతమైన ప్రచారానికి నోచుకున్న జన నాయగన్ (జన నాయకుడు) షూటింగ్ అయితే వేగంగా జరుపుకుంటోంది కానీ విడుదల విషయంలో నిర్మాతలు తొందరపాటు ప్రదర్శించడం లేదు. కోలీవుడ్ లోనే కాదు ఇతర భాషల్లోనూ అంత సులభంగా చెరిగిపోని రికార్డులు దక్కేలా సరైన డేట్ కోసం ప్లాన్ చేస్తున్నారు. ఆ స్థాయిలో వసూళ్లు రావాలంటే తమిళంలో పొంగల్ సీజన్ చాలా కీలకం. యావరేజ్ మూవీస్ సైతం మతిపోగోట్టే కలెక్షన్లు రాబట్టిన దాఖలాలు ఎన్నో ఉన్నాయి. సో 2026 సంక్రాంతికి జన నాయకుడు వచ్చే సూచనలు ఎక్కువ.

అయితే మనకేం ఇబ్బందనే పాయింట్ కు వద్దాం. వచ్చే ఏడాది పండక్కు తెలుగులో అఫీషియల్ గా ఆ సీజన్ లాక్ చేసుకునే దిశగా చూస్తున్న సినిమాల్లో మొదటిది జూనియర్ ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ కాంబో. మైత్రి మూవీ మేకర్స్ అనౌన్స్ మెంట్ కూడా ఎప్పుడో ఇచ్చింది. దీన్ని ప్యాన్ ఇండియా రేంజ్ లో పెద్ద ఎత్తున మార్కెట్ చేస్తారు. కానీ విజయ్ వల్ల తమిళనాడు, కేరళలో కొంత ప్రతికూల ప్రభావం ఎదురు చూడాల్సి ఉంటుంది. ఇంకా షూటింగే మొదలుకాని చిరంజీవి – అనిల్ రావిపూడి వచ్చేది కూడా అప్పుడే. ఇది రీజనల్ క్యాటగిరీ కాబట్టి టెన్షన్ లేకపోయినా పక్కరాష్ట్రాల్లో తారక్ కు వచ్చే సమస్య చిరుకి మొదలవుతుంది.

ఒకవేళ వీటిలో ఏదైనా వాయిదా పడే పరిస్థితి వస్తే ప్రభాస్ ఫౌజీ లేదా రామ్ చరణ్ 16 వచ్చే అవకాశాలను కొట్టి పారేయలేం. జన నాయకుడుని నిర్మిస్తున్న కెవిఎన్ ప్రొడక్షన్స్ చేతిలో యష్ టాక్సిక్ ఉంది. భవిష్యత్తులో బాలకృష్ణతో ఒక సినిమా ప్లాన్ చేస్తోంది. సో డిస్ట్రిబ్యూషన్ నెట్ వర్క్ మద్దతు ఖచ్చితంగా ఉంటుంది. జన నాయకుడికి థియేటర్లు వచ్చేలా చూసుకోవడంలో సహకరిస్తారు. భగవంత్ కేసరి రీమేక్ గా ప్రచారంలో ఉన్న జన నాయగన్ లో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుండగా, ప్రేమలు మమిత బైజు కీలక పాత్ర చేస్తోంది. బాబీ డియోల్ విలన్. హెచ్ వినోత్ దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో రూపొందుతోంది.

This post was last modified on February 18, 2025 9:37 am

Share
Show comments
Published by
Kumar

Recent Posts

నిన్న బాబు – నేడు పవన్!!

పార్టీ పటిష్టంగా ఉండాలన్నా, ప్రజలకు పారదర్శకంగా సంక్షేమ పథకాలు అందాలన్నా ఆ పార్టీ ప్రజా ప్రతినిధులే కీలకం. రాజకీయాల్లో ఈ…

21 minutes ago

ఐమాక్స్ వస్తే మన పరిస్తితి కూడా ఇంతేనా?

దేశంలో అత్యధిక సినీ అభిమానం ఉన్న ప్రేక్షకులుగా తెలుగు ఆడియన్సుకి పేరుంది. తెలుగు రాష్ట్రాలు రెంటినీ కలిపి ఒక యూనిట్…

2 hours ago

పవన్ చొరవతో తెలంగాణ ఆలయానికి రూ.30 కోట్లు?

జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.30 కోట్ల నిధులను…

4 hours ago

గల్లి సమస్యను సైతం వదలని లోకేష్!

అటు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి ఏపీకి నిధులు మంజూరు అయ్యేలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇటు తన శాఖలను సమర్థవంతంగా…

4 hours ago

చరణ్ రాకతో పెరిగిన ఛాంపియన్ మైలేజ్

నిన్న జరిగిన ఛాంపియన్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు రామ్ చరణ్ ముఖ్యఅతిధిగా రావడం హైప్ పరంగా దానికి మంచి…

4 hours ago

రుషికొండ పంచాయతీ… కొలిక్కి వచ్చినట్టేనా?

వైసీపీ హ‌యాంలో విశాఖ‌ప‌ట్నంలోని ప్ర‌ఖ్యాత ప‌ర్యాట‌క ప్రాంతం రుషికొండ‌ను తొలిచి.. నిర్మించిన భారీ భ‌వ‌నాల వ్య‌వ‌హారం కొలిక్కి వ‌స్తున్న‌ట్టు ప్ర‌భుత్వ…

5 hours ago