తలపతి విజయ్ రాజకీయ ప్రవేశానికి ముందు చివరి సినిమాగా విపరీతమైన ప్రచారానికి నోచుకున్న జన నాయగన్ (జన నాయకుడు) షూటింగ్ అయితే వేగంగా జరుపుకుంటోంది కానీ విడుదల విషయంలో నిర్మాతలు తొందరపాటు ప్రదర్శించడం లేదు. కోలీవుడ్ లోనే కాదు ఇతర భాషల్లోనూ అంత సులభంగా చెరిగిపోని రికార్డులు దక్కేలా సరైన డేట్ కోసం ప్లాన్ చేస్తున్నారు. ఆ స్థాయిలో వసూళ్లు రావాలంటే తమిళంలో పొంగల్ సీజన్ చాలా కీలకం. యావరేజ్ మూవీస్ సైతం మతిపోగోట్టే కలెక్షన్లు రాబట్టిన దాఖలాలు ఎన్నో ఉన్నాయి. సో 2026 సంక్రాంతికి జన నాయకుడు వచ్చే సూచనలు ఎక్కువ.
అయితే మనకేం ఇబ్బందనే పాయింట్ కు వద్దాం. వచ్చే ఏడాది పండక్కు తెలుగులో అఫీషియల్ గా ఆ సీజన్ లాక్ చేసుకునే దిశగా చూస్తున్న సినిమాల్లో మొదటిది జూనియర్ ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ కాంబో. మైత్రి మూవీ మేకర్స్ అనౌన్స్ మెంట్ కూడా ఎప్పుడో ఇచ్చింది. దీన్ని ప్యాన్ ఇండియా రేంజ్ లో పెద్ద ఎత్తున మార్కెట్ చేస్తారు. కానీ విజయ్ వల్ల తమిళనాడు, కేరళలో కొంత ప్రతికూల ప్రభావం ఎదురు చూడాల్సి ఉంటుంది. ఇంకా షూటింగే మొదలుకాని చిరంజీవి – అనిల్ రావిపూడి వచ్చేది కూడా అప్పుడే. ఇది రీజనల్ క్యాటగిరీ కాబట్టి టెన్షన్ లేకపోయినా పక్కరాష్ట్రాల్లో తారక్ కు వచ్చే సమస్య చిరుకి మొదలవుతుంది.
ఒకవేళ వీటిలో ఏదైనా వాయిదా పడే పరిస్థితి వస్తే ప్రభాస్ ఫౌజీ లేదా రామ్ చరణ్ 16 వచ్చే అవకాశాలను కొట్టి పారేయలేం. జన నాయకుడుని నిర్మిస్తున్న కెవిఎన్ ప్రొడక్షన్స్ చేతిలో యష్ టాక్సిక్ ఉంది. భవిష్యత్తులో బాలకృష్ణతో ఒక సినిమా ప్లాన్ చేస్తోంది. సో డిస్ట్రిబ్యూషన్ నెట్ వర్క్ మద్దతు ఖచ్చితంగా ఉంటుంది. జన నాయకుడికి థియేటర్లు వచ్చేలా చూసుకోవడంలో సహకరిస్తారు. భగవంత్ కేసరి రీమేక్ గా ప్రచారంలో ఉన్న జన నాయగన్ లో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుండగా, ప్రేమలు మమిత బైజు కీలక పాత్ర చేస్తోంది. బాబీ డియోల్ విలన్. హెచ్ వినోత్ దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో రూపొందుతోంది.
This post was last modified on February 18, 2025 9:37 am
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…