సీతారామం తర్వాత దర్శకుడు హను రాఘవపూడి రూపొందిస్తున్న ఫౌజీ (ప్రచారంలో ఉన్న టైటిల్) శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. హైదరాబాద్ అల్యూమినియం ఫ్యాక్టరీలో వేసిన సెట్స్ తో పాటు వివిధ లొకేషన్లలో నాన్ స్టాప్ చిత్రీకరణ చేస్తున్నారు. ది రాజా సాబ్ కు బ్రేక్ ఇచ్చి మరీ స్పీడ్ పెంచారంటే డార్లింగ్ ఈ సబ్జెక్టు మీద ఎంత మనసు పెట్టాడో అర్థం చేసుకోవచ్చు. మైత్రి మూవీ మేకర్స్ బడ్జెట్ విషయంలో రాజీ పడకుండా తెరకెక్కిస్తున్నారు. హీరోయిన్ ఇమాన్వి లుక్స్, నటన చాలా బాగా వచ్చాయని ఇన్ సైడ్ టాక్. స్వాతంత్రం రాక ముందు జరిగే నేపథ్యంలో ఫౌజీ కథ జరుగుతుందన్న విషయం తెలిసిందే.
అయితే కీలకమైన ఒక యువ మహారాణి పాత్ర కోసం క్రేజీ హీరోయిన్ ని సెట్ చేసే పనిలో హను రాఘవపూడి ఉన్నట్టు లేటెస్ట్ అప్డేట్. మొదటి ప్రాధాన్యంగా అలియా భట్ పేరు పరిశీలనలో ఉన్నట్టు వినికిడి. అయితే ఆర్ఆర్ఆర్ భామ ఖాళీగా లేదు. డేట్లు అంత సులభంగా దొరికే పరిస్థితి లేదట. ఫౌజీలో నిడివి పరంగా ఎక్కడ కాల్ షీట్లు అవసరం లేదు కాబట్టి వీలైనంత వేగంగా పూర్తి చేసేలా హామీ ఇస్తే కనక ఒప్పుకునే ఛాన్స్ లేకపోలేదు. అదే కనక జరిగితే క్రేజ్ మరింత పెరుగుతుంది. కానీ ఈ పాత్ర ప్రభాస్ కు జోడి కాకపోవచ్చు. కీలక మలుపుకు దోహదం చేస్తుంది తప్పించి హీరోతో ప్రేమలో పడే టైపు కాదట.
ఇంకొంచెం క్లారిటీగా చెప్పాలంటే సీతారామంలో రష్మిక మందన్న తరహాలో ట్విస్టులను అనుసంధానం చేసే తరహాలో డిజైన్ చేసినట్టు చెబుతున్నారు. మరి ఇమాన్వి క్యారెక్టర్ ఏంటంటే సైనికుడైన ప్రభాస్ ని ప్రేమించే ఒక మధ్యతరగతి యువతిగా స్పెషల్ గా ఉంటుందట. ఇవన్నీ అధికారికంగా తెలియడానికి మరికొంత సమయం పడుతుంది కానీ లీకులు మాత్రం ఫ్యాన్స్ కి మంచి ఎగ్జైట్ మెంట్ ఇచ్చేలా ఉన్నాయి. విడుదల తేదీ విషయంలో ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ది రాజా సాబ్, ఫౌజీల మధ్య ఆరు నెలల గ్యాప్ ఉండేలా చూస్తున్నారట. ఇన్ సైడ్ టాక్ అయితే 2026 వేసవి అని ఉంది. చూడాలి.
This post was last modified on February 17, 2025 7:38 pm
ఒకప్పుడు టాలీవుడ్లో తిరుగులేని ఆధిపత్యం చలాయించిన కథానాయికల్లో తమన్నా ఒకరు. టీనేజీలోనే కథానాయిక అవతారం ఎత్తిన ఆమె పదేళ్లకు పైగానే టాప్…
థియేటర్, ఓటిటి మధ్య ఖచ్చితంగా ఎనిమిది వారాల గ్యాప్ ఉండాలనే నిబంధన మీద దక్షిణాది ఇండస్ట్రీ పెద్దలు చాలా సీరియస్…
అధికారంలోకి రావడానికి ముందు వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా ఫెరోషియస్గా కనిపించేవారు. అవినీతి కేసుల వ్యవహారం పక్కన పెడితే…
‘బాహుబలి’ సినిమాకు బాలీవుడ్ నుంచి అప్పట్లో ఎంత గొప్ప సహకారం అందిందో తెలిసిందే. కరణ్ జోహార్ లాంటి అగ్ర నిర్మాత ఆ…
మోనాలిసా.. గత ఏడాది సోషల్ మీడియాను ఒక ఊపు ఊపేసిన పేరిది. ఉత్తర్ప్రదేశ్లో జరిగిన మహా కుంభమేళాతో వెలుగులోకి వచ్చిన…
తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, మాజీ మంత్రి పార్టీ కీలక…