సీతారామం తర్వాత దర్శకుడు హను రాఘవపూడి రూపొందిస్తున్న ఫౌజీ (ప్రచారంలో ఉన్న టైటిల్) శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. హైదరాబాద్ అల్యూమినియం ఫ్యాక్టరీలో వేసిన సెట్స్ తో పాటు వివిధ లొకేషన్లలో నాన్ స్టాప్ చిత్రీకరణ చేస్తున్నారు. ది రాజా సాబ్ కు బ్రేక్ ఇచ్చి మరీ స్పీడ్ పెంచారంటే డార్లింగ్ ఈ సబ్జెక్టు మీద ఎంత మనసు పెట్టాడో అర్థం చేసుకోవచ్చు. మైత్రి మూవీ మేకర్స్ బడ్జెట్ విషయంలో రాజీ పడకుండా తెరకెక్కిస్తున్నారు. హీరోయిన్ ఇమాన్వి లుక్స్, నటన చాలా బాగా వచ్చాయని ఇన్ సైడ్ టాక్. స్వాతంత్రం రాక ముందు జరిగే నేపథ్యంలో ఫౌజీ కథ జరుగుతుందన్న విషయం తెలిసిందే.
అయితే కీలకమైన ఒక యువ మహారాణి పాత్ర కోసం క్రేజీ హీరోయిన్ ని సెట్ చేసే పనిలో హను రాఘవపూడి ఉన్నట్టు లేటెస్ట్ అప్డేట్. మొదటి ప్రాధాన్యంగా అలియా భట్ పేరు పరిశీలనలో ఉన్నట్టు వినికిడి. అయితే ఆర్ఆర్ఆర్ భామ ఖాళీగా లేదు. డేట్లు అంత సులభంగా దొరికే పరిస్థితి లేదట. ఫౌజీలో నిడివి పరంగా ఎక్కడ కాల్ షీట్లు అవసరం లేదు కాబట్టి వీలైనంత వేగంగా పూర్తి చేసేలా హామీ ఇస్తే కనక ఒప్పుకునే ఛాన్స్ లేకపోలేదు. అదే కనక జరిగితే క్రేజ్ మరింత పెరుగుతుంది. కానీ ఈ పాత్ర ప్రభాస్ కు జోడి కాకపోవచ్చు. కీలక మలుపుకు దోహదం చేస్తుంది తప్పించి హీరోతో ప్రేమలో పడే టైపు కాదట.
ఇంకొంచెం క్లారిటీగా చెప్పాలంటే సీతారామంలో రష్మిక మందన్న తరహాలో ట్విస్టులను అనుసంధానం చేసే తరహాలో డిజైన్ చేసినట్టు చెబుతున్నారు. మరి ఇమాన్వి క్యారెక్టర్ ఏంటంటే సైనికుడైన ప్రభాస్ ని ప్రేమించే ఒక మధ్యతరగతి యువతిగా స్పెషల్ గా ఉంటుందట. ఇవన్నీ అధికారికంగా తెలియడానికి మరికొంత సమయం పడుతుంది కానీ లీకులు మాత్రం ఫ్యాన్స్ కి మంచి ఎగ్జైట్ మెంట్ ఇచ్చేలా ఉన్నాయి. విడుదల తేదీ విషయంలో ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ది రాజా సాబ్, ఫౌజీల మధ్య ఆరు నెలల గ్యాప్ ఉండేలా చూస్తున్నారట. ఇన్ సైడ్ టాక్ అయితే 2026 వేసవి అని ఉంది. చూడాలి.
ఎంతవరకు నిజమో చెప్పలేం కానీ నిర్మాత నమిత మల్హోత్రా చెబుతున్న దాని ప్రకారం రామాయణకు పెడుతున్న ఖర్చు నాలుగు వేల…
ఈ నెల 24 విడుదల కాబోతున్న చెన్నై లవ్ స్టోరీ టీమ్ ఒక విషయంలో టెన్షన్ పడుతోంది. అదే రోజు…
పెద్ది, మా ఇంటి బంగారం తర్వాత ఈ సీజన్ లో బాక్సాఫీస్ కు మళ్ళీ జోష్ వచ్చింది. థియేటర్లు కళకళలాడుతున్నాయి.…
తమిళ సినిమాల్లో చాలా ఏళ్ల నుంచి తిరుగులేని ఆధిపత్యం చలాయిస్తున్నాడు అనిరుధ్ రవిచందర్. అతడి హవా తమిళానికే పరిమితం కావట్లేదు…
బూత్ స్థాయిలో బలోపేతం అయ్యే దిశగా జనసేన కసరత్తు షురూ చేసింది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ నాయకులు ఉన్నప్పటికీ..…
ఏపీ రాజధాని అమరావతిలో రైతుల భూములను వారి అనుమతి లేకుండానే కూటమి సర్కారు లాక్కుంటోందని శనివారం పెద్ద రచ్చే జరిగింది. రాజధాని నిర్మాణం కోసం తమ భూములను…