సీతారామం తర్వాత దర్శకుడు హను రాఘవపూడి రూపొందిస్తున్న ఫౌజీ (ప్రచారంలో ఉన్న టైటిల్) శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. హైదరాబాద్ అల్యూమినియం ఫ్యాక్టరీలో వేసిన సెట్స్ తో పాటు వివిధ లొకేషన్లలో నాన్ స్టాప్ చిత్రీకరణ చేస్తున్నారు. ది రాజా సాబ్ కు బ్రేక్ ఇచ్చి మరీ స్పీడ్ పెంచారంటే డార్లింగ్ ఈ సబ్జెక్టు మీద ఎంత మనసు పెట్టాడో అర్థం చేసుకోవచ్చు. మైత్రి మూవీ మేకర్స్ బడ్జెట్ విషయంలో రాజీ పడకుండా తెరకెక్కిస్తున్నారు. హీరోయిన్ ఇమాన్వి లుక్స్, నటన చాలా బాగా వచ్చాయని ఇన్ సైడ్ టాక్. స్వాతంత్రం రాక ముందు జరిగే నేపథ్యంలో ఫౌజీ కథ జరుగుతుందన్న విషయం తెలిసిందే.
అయితే కీలకమైన ఒక యువ మహారాణి పాత్ర కోసం క్రేజీ హీరోయిన్ ని సెట్ చేసే పనిలో హను రాఘవపూడి ఉన్నట్టు లేటెస్ట్ అప్డేట్. మొదటి ప్రాధాన్యంగా అలియా భట్ పేరు పరిశీలనలో ఉన్నట్టు వినికిడి. అయితే ఆర్ఆర్ఆర్ భామ ఖాళీగా లేదు. డేట్లు అంత సులభంగా దొరికే పరిస్థితి లేదట. ఫౌజీలో నిడివి పరంగా ఎక్కడ కాల్ షీట్లు అవసరం లేదు కాబట్టి వీలైనంత వేగంగా పూర్తి చేసేలా హామీ ఇస్తే కనక ఒప్పుకునే ఛాన్స్ లేకపోలేదు. అదే కనక జరిగితే క్రేజ్ మరింత పెరుగుతుంది. కానీ ఈ పాత్ర ప్రభాస్ కు జోడి కాకపోవచ్చు. కీలక మలుపుకు దోహదం చేస్తుంది తప్పించి హీరోతో ప్రేమలో పడే టైపు కాదట.
ఇంకొంచెం క్లారిటీగా చెప్పాలంటే సీతారామంలో రష్మిక మందన్న తరహాలో ట్విస్టులను అనుసంధానం చేసే తరహాలో డిజైన్ చేసినట్టు చెబుతున్నారు. మరి ఇమాన్వి క్యారెక్టర్ ఏంటంటే సైనికుడైన ప్రభాస్ ని ప్రేమించే ఒక మధ్యతరగతి యువతిగా స్పెషల్ గా ఉంటుందట. ఇవన్నీ అధికారికంగా తెలియడానికి మరికొంత సమయం పడుతుంది కానీ లీకులు మాత్రం ఫ్యాన్స్ కి మంచి ఎగ్జైట్ మెంట్ ఇచ్చేలా ఉన్నాయి. విడుదల తేదీ విషయంలో ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ది రాజా సాబ్, ఫౌజీల మధ్య ఆరు నెలల గ్యాప్ ఉండేలా చూస్తున్నారట. ఇన్ సైడ్ టాక్ అయితే 2026 వేసవి అని ఉంది. చూడాలి.
This post was last modified on February 17, 2025 7:38 pm
కన్నడలో ఒకప్పటి స్టార్ హీరోయిన్, తర్వాత రాజకీయ నాయకురాలిగా మారిన దివ్య స్పందన అలియాస్ రమ్య జర్నీలో వివాదాలకు లోటేమీ…
ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్ షిప్(పీపీపీ) ద్వారా రాష్ట్రంలో మెడికల్ కాలేజీలతో పాటు పర్యాటక ప్రాంతాలను కూడా అభివృద్ధి చేయాలని సీఎం…
వైసీపీ పార్లమెంట్ సభ్యుడు, సీనియర్ నేత మిథున్ రెడ్డి ఆస్తులు భారీగా పెరిగాయని పేర్కొంటూ ఏడిఆర్ సర్వే తాజాగా వెల్లడించింది.…
టాక్సిక్ టీజర్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ముఖ్యంగా కారులో రొమాన్స్ పెట్టి దాని ద్వారా స్మశానంలో…
ఇంకొద్ది గంటల్లో రాజా సాబ్ ప్రీమియర్లు ప్రారంభం కాబోతున్నాయి. జీవో త్వరగా రావడంతో ఆంధ్రప్రదేశ్ బుకింగ్స్ వేగంగా ఉండగా తెలంగాణది…
ఈ సంక్రాంతికి ‘మాస్ రాజా’ ట్యాగ్ తీసేసి.. ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ అనే పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్తో ప్రేక్షకుల ముందుకు…