గత కొన్నేళ్లలో ఏ సినిమాకు లేనంత ప్రమోషన్లలో బ్రహ్మానందం పాల్గొనడం ఒక్క బ్రహ్మ ఆనందంకే జరిగింది. కారణాలు స్పష్టం. కొడుకు రాజా గౌతమ్ చాలా గ్యాప్ తర్వాత హీరోగా పెర్ఫార్మన్స్ స్కోప్ ఉన్న పాత్రలో నటించడం, అతనికి తాతగా చేసే అవకాశం ఇందులో ఉండటం. పైగా టైటిల్ తన మీదే పెట్టి మార్కెటింగ్ చేశారు. దీంతో పూర్తి బాధ్యతను తీసుకున్నారు. చిరంజీవి స్వయంగా ఫోన్ చేసి మరీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు వచ్చారంటే దానికి కారణం కేవలం బ్రహ్మి మీద అంతులేని అభిమానమే. ముందు రోజే ప్రీమియర్లు వేశారు.అవుట్ డోర్ పబ్లిసిటీ విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నారు.
ఇవన్నీ జరిగిన ఆనందం మిగిలింది కానీ బాక్సాఫీస్ వద్ద మాత్రం బ్రహ్మ ఆనందం ఎలాంటి అద్భుతం చేయలేదు. ఇలాంటి సినిమాలకు యునానిమస్ పాజిటివ్ టాక్ వస్తేనే కమర్షియల్ గా పికప్ అవుతాయి. కానీ దర్శకుడు ఆర్విఎస్ నిఖిల్ వెయిట్ ఉన్న కంటెంట్ ని హ్యాండిల్ చేసిన తీరు ప్రేక్షకులను సంతృప్తి పరచలేకపోయింది. కేవలం బ్రహ్మానందం కోసమే చూడాలనుకుంటే ఓకే కానీ కామెడీ, ఎమోషన్స్, ఎంటర్ టైన్మెంట్ అన్నీ కావాలని కోరుకుని థియేటర్ కు వెళ్లిన అధిక శాతం ఆడియన్స్ కి నిరాశే మిగిలింది. వైవిధ్యం కోసం పెట్టిన ఓల్డ్ ఏజ్ ప్రేమకథ కూడా అంతగా క్లిక్ కాలేకపోయింది.
ఫలితం సంగతి అలా ఉంచితే ఈ లెజెండరీ హాస్య నటుడిని ఇంత లెన్త్ ఉన్న రోల్ లో మళ్ళీ చూడటం అంత సులభమైతే కాదు. కొడుకు ఉన్నాడు, స్టోరీ నచ్చింది కాబట్టి ఒప్పుకున్నారు కానీ లేదంటే వచ్చేది కాదేమో. ఇప్పటికే తెరమీద కనిపించడం బాగా తగ్గించేసిన బ్రహ్మానందం కేవలం కొన్ని నిముషాలు మాత్రమే ఉండే క్యామియోలు అది కూడా చాలా ఆచితూచి ఎంచుకుంటున్నారు. ఇప్పుడీ బ్రహ్మ ఆనందం రిజల్ట్ చూశాక మరింత జాగ్రత్త పడతారనడంలో సందేహం లేదు. రాజా గౌతమ్ మాత్రం ఏజెంట్ సాయిశ్రీనివాస ఆత్రేయ ఫేమ్ స్వరూప్ దర్శకత్వంలో ఒక సినిమాలో ఆల్రెడీ నటిస్తుండటం విశేషం.
This post was last modified on February 17, 2025 6:11 pm
వైసీపీ పాలనా కాలంలో తిరుమల శ్రీవారి పరకామణిలో 900 డాలర్ల చోరీ జరిగిన విషయం తెలిసిందే. ఈ పరిణామం తిరుమల…
నేటి రాజకీయ నాయకులలో చాలామందిలో పారదర్శకత కోసం భూతద్దం వేసి వెతికినా కనిపించదు. జవాబుదారీతనం గురించి మాట్లడుకునే అవసరం లేదు.…
ప్రభాస్ సినిమా అంటే బడ్జెట్లు.. బిజినెస్ లెక్కలు.. వసూళ్లు అన్నీ భారీగానే ఉంటాయి. కొంచెం మీడియం బడ్జెట్లో తీద్దాం అని…
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ట్రైనీ కానిస్టేబుళ్లకు భారీ శుభవార్త అందించారు. మంగళగిరి ఏపీఎస్సీ పరేడ్ గ్రౌండ్లో 5,757…
అడిగిందే తడవు అన్నట్లు.. పాలనలో పవన వేగాన్ని చూపుతున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. మొన్నటికి మొన్న విద్యార్థులు అడిగారని…