గత కొన్నేళ్లలో ఏ సినిమాకు లేనంత ప్రమోషన్లలో బ్రహ్మానందం పాల్గొనడం ఒక్క బ్రహ్మ ఆనందంకే జరిగింది. కారణాలు స్పష్టం. కొడుకు రాజా గౌతమ్ చాలా గ్యాప్ తర్వాత హీరోగా పెర్ఫార్మన్స్ స్కోప్ ఉన్న పాత్రలో నటించడం, అతనికి తాతగా చేసే అవకాశం ఇందులో ఉండటం. పైగా టైటిల్ తన మీదే పెట్టి మార్కెటింగ్ చేశారు. దీంతో పూర్తి బాధ్యతను తీసుకున్నారు. చిరంజీవి స్వయంగా ఫోన్ చేసి మరీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు వచ్చారంటే దానికి కారణం కేవలం బ్రహ్మి మీద అంతులేని అభిమానమే. ముందు రోజే ప్రీమియర్లు వేశారు.అవుట్ డోర్ పబ్లిసిటీ విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నారు.
ఇవన్నీ జరిగిన ఆనందం మిగిలింది కానీ బాక్సాఫీస్ వద్ద మాత్రం బ్రహ్మ ఆనందం ఎలాంటి అద్భుతం చేయలేదు. ఇలాంటి సినిమాలకు యునానిమస్ పాజిటివ్ టాక్ వస్తేనే కమర్షియల్ గా పికప్ అవుతాయి. కానీ దర్శకుడు ఆర్విఎస్ నిఖిల్ వెయిట్ ఉన్న కంటెంట్ ని హ్యాండిల్ చేసిన తీరు ప్రేక్షకులను సంతృప్తి పరచలేకపోయింది. కేవలం బ్రహ్మానందం కోసమే చూడాలనుకుంటే ఓకే కానీ కామెడీ, ఎమోషన్స్, ఎంటర్ టైన్మెంట్ అన్నీ కావాలని కోరుకుని థియేటర్ కు వెళ్లిన అధిక శాతం ఆడియన్స్ కి నిరాశే మిగిలింది. వైవిధ్యం కోసం పెట్టిన ఓల్డ్ ఏజ్ ప్రేమకథ కూడా అంతగా క్లిక్ కాలేకపోయింది.
ఫలితం సంగతి అలా ఉంచితే ఈ లెజెండరీ హాస్య నటుడిని ఇంత లెన్త్ ఉన్న రోల్ లో మళ్ళీ చూడటం అంత సులభమైతే కాదు. కొడుకు ఉన్నాడు, స్టోరీ నచ్చింది కాబట్టి ఒప్పుకున్నారు కానీ లేదంటే వచ్చేది కాదేమో. ఇప్పటికే తెరమీద కనిపించడం బాగా తగ్గించేసిన బ్రహ్మానందం కేవలం కొన్ని నిముషాలు మాత్రమే ఉండే క్యామియోలు అది కూడా చాలా ఆచితూచి ఎంచుకుంటున్నారు. ఇప్పుడీ బ్రహ్మ ఆనందం రిజల్ట్ చూశాక మరింత జాగ్రత్త పడతారనడంలో సందేహం లేదు. రాజా గౌతమ్ మాత్రం ఏజెంట్ సాయిశ్రీనివాస ఆత్రేయ ఫేమ్ స్వరూప్ దర్శకత్వంలో ఒక సినిమాలో ఆల్రెడీ నటిస్తుండటం విశేషం.
This post was last modified on February 17, 2025 6:11 pm
మార్చి 19 విడుదల కాబోతున్న ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి 'మెడ ముట్టుకుంటే తొడ కొట్టినట్టే' పాట వచ్చినప్పుడు పాజిటివిటీ…
అమరావతిలో జరిగిన కలెక్టర్ల సదస్సులో అటవీ శాఖ అధికారుల పనితీరుపై సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ…
రాజకీయాలంటే అంతే. అడుగుపెట్టాక చాలా బురదను కడుక్కోవాల్సి ఉంటుంది. కొందరు తట్టుకుంటారు. కొందరు వదిలేస్తారు. చిరంజీవి ప్రజారాజ్యం విషయంలో ఎక్కడైతే…
అభిమానులందు పవన్ అభిమానులు వేరయా అంటే అందులో అతిశయోక్తి ఏమీ లేదు. ఆయనకున్న లాయల్ ఫ్యాన్ బేస్ ఇండియా మొత్తంలో…
బాలీవుడ్ ఖిలాడీ అక్షయ్ కుమార్ ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద సరైన సక్సెస్ కోసం ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో తనకి ఎన్నో…
వందల కోట్లతో ప్యాన్ ఇండియా మూవీస్ తీస్తున్నప్పుడు పెద్ద ఎత్తున ప్రమోషన్లు అవసరం. ఎవరికైనా ఇది తప్పదు. ఎప్పుడో 2027…