పిల్ల జమీందార్ లాంటి హిట్ సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయ్యాడు యువ దర్శకుడు అశోక్. ఐతే ఓ కొరియన్ మూవీని కాపీ కొట్టి తీసిన ఆ సినిమా తర్వాత అతను అంచనాలను అందుకోలేకపోయాడు. సాయికుమార్ తనయుడు ఆది హీరోగా అతను తీసిన రెండో సినిమా సుకుమారుడు డిజాస్టర్ అయింది. ఆ తర్వాత అంజలి ప్రధాన పాత్రలో తెరకెక్కించిన చిత్రాంగద ప్రేక్షకులను చిత్రవధకు గురి చేసింది.
ఐతే ఈ సినిమా చేస్తుండగానే యువి క్రియేషన్స్ లాంటి పెద్ద బేనర్లో అనుష్క ప్రధాన పాత్రలో ఓ హార్రర్ థ్రిల్లర్ చేసే అవకాశం దక్కింది అశోక్. ఆ సినిమానే.. భాగమతి. అశోక్ ఫామ్ చూసి ఈ సినిమా ఏమాత్రం వర్కవుటవుతుందో అని అంతా సందేహించారు.
కానీ భాగమతి ప్రేక్షకులను ఆకట్టుకుంది. పెద్ద హిట్టయింది. ఈ సినిమాను హిందీలో రీమేక్ చేసే అవకాశం కూడా అశోక్నే వరించింది. భూమి పడ్నేకర్ ప్రధాన పాత్రలో దుర్గావతి పేరుతో అక్కడీ సినిమాను తెరకెక్కిస్తున్నాడు అశోక్. హీరో అక్షయ్ కుమార్, అగ్ర నిర్మాత భూషణ్ కుమార్ కలిసి ఈ చిత్రాన్ని నిర్మించడం విశేషం. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా డిసెంబరు 11న అమేజాన్ ప్రైమ్లో విడుదల కాబోతోంది.
ఈ సినిమా చేస్తుండగానే అశోక్ బాలీవుడ్లో మరో అవకాశం దక్కించుకోవడం విశేషం. ఉఫ్ పేరుతో అతను అక్కడ ప్రయోగాత్మకంగా సైలెంట్ మూవీ చేయబోతున్నాడు. నుష్రత్ బరూచా, నోరా ఫతేహి, సోహమ్ షా ఇందులో ప్రధాన పాత్రలు పోషించనున్నారు. ప్రముఖ దర్శకుడు లవ్ రంజన్ ఈ చిత్రాన్ని నిర్మించనుండటం విశేషం.
This post was last modified on October 22, 2020 4:25 pm
నిర్మాత దిల్ రాజు అన్నట్టు వందల సినిమాలు తీయకపోయినా కెవిఎన్ ప్రొడక్షన్స్ అనేది ఇప్పుడు అన్ని బాషల ఇండస్ట్రీలో హాట్…
మెగాస్టార్ చిరంజీవి కొత్త సినిమా ‘కాాకా’ నుంచి ఇటీవల రిలీజ్ చేసిన టైటిల్ గ్లింప్స్ మెగా అభిమానులనే కాక సామాన్య…
కింగ్ సైజ్ ఫిలిం మేకర్ అని ఎవరికైనా బిరుదు ఇవ్వాల్సి వస్తే అందరి మదిలో మెదిలే ఒకే ఒక్క పేరు…
మాస్ రాజా రవితేజ నిఖార్సయిన హిట్టు కొట్టి నాలుగేళ్లయింది. ఈ నాలుగేళ్లలో ఆయన ఆరు చిత్రాలతో పలకరించాడు. వీటిలో కొన్ని…
ఏదైనా మితంగా తింటేనే అందం. మితిమీరిందా పొట్ట ఉబ్బిపోయి డాక్టర్ చుట్టూ తిరగాల్సి వస్తుంది. తిండి సామెత సినిమాలకు కూడా…
కరోనా తర్వాత థియేటర్స్ కి జనం మళ్ళీ వచ్చేలా చేసిన సినిమాల్లో జాంబీ రెడ్డి ఉంది. దర్శకుడు ప్రశాంత్ వర్మ…