పిల్ల జమీందార్ లాంటి హిట్ సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయ్యాడు యువ దర్శకుడు అశోక్. ఐతే ఓ కొరియన్ మూవీని కాపీ కొట్టి తీసిన ఆ సినిమా తర్వాత అతను అంచనాలను అందుకోలేకపోయాడు. సాయికుమార్ తనయుడు ఆది హీరోగా అతను తీసిన రెండో సినిమా సుకుమారుడు డిజాస్టర్ అయింది. ఆ తర్వాత అంజలి ప్రధాన పాత్రలో తెరకెక్కించిన చిత్రాంగద ప్రేక్షకులను చిత్రవధకు గురి చేసింది.
ఐతే ఈ సినిమా చేస్తుండగానే యువి క్రియేషన్స్ లాంటి పెద్ద బేనర్లో అనుష్క ప్రధాన పాత్రలో ఓ హార్రర్ థ్రిల్లర్ చేసే అవకాశం దక్కింది అశోక్. ఆ సినిమానే.. భాగమతి. అశోక్ ఫామ్ చూసి ఈ సినిమా ఏమాత్రం వర్కవుటవుతుందో అని అంతా సందేహించారు.
కానీ భాగమతి ప్రేక్షకులను ఆకట్టుకుంది. పెద్ద హిట్టయింది. ఈ సినిమాను హిందీలో రీమేక్ చేసే అవకాశం కూడా అశోక్నే వరించింది. భూమి పడ్నేకర్ ప్రధాన పాత్రలో దుర్గావతి పేరుతో అక్కడీ సినిమాను తెరకెక్కిస్తున్నాడు అశోక్. హీరో అక్షయ్ కుమార్, అగ్ర నిర్మాత భూషణ్ కుమార్ కలిసి ఈ చిత్రాన్ని నిర్మించడం విశేషం. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా డిసెంబరు 11న అమేజాన్ ప్రైమ్లో విడుదల కాబోతోంది.
ఈ సినిమా చేస్తుండగానే అశోక్ బాలీవుడ్లో మరో అవకాశం దక్కించుకోవడం విశేషం. ఉఫ్ పేరుతో అతను అక్కడ ప్రయోగాత్మకంగా సైలెంట్ మూవీ చేయబోతున్నాడు. నుష్రత్ బరూచా, నోరా ఫతేహి, సోహమ్ షా ఇందులో ప్రధాన పాత్రలు పోషించనున్నారు. ప్రముఖ దర్శకుడు లవ్ రంజన్ ఈ చిత్రాన్ని నిర్మించనుండటం విశేషం.
మెగా హీరోల సినిమాలకు సంబంధించి ఏ ఈవెంట్ అయినా.. అందులో ఎక్కడో ఒక చోట పవర్ స్టార్ పవన్ కళ్యాణ్…
హైదరాబాద్ శిల్పకళా వేదికలో జరిగిన పెద్ది సక్సెస్ మీట్ కోసం వేలాది అభిమానులు తరలివచ్చారు. ఈ సినిమాకు సంబంధించి ఇదే…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ను టార్గెట్ చేస్తూ విపక్ష వైసీపీ ఇటీవల డోస్ పెంచిన…
ప్రతి సంవత్సరం విజయ్కి స్పెషల్ పిక్తో పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పే త్రిష.. ఈసారి చెప్పలేదు. ఇన్స్టాగ్రామ్లో కూడా ఆయన్ని…
నిజమే…ఆ ఇద్దరూ కలిశారు. రాష్ట్ర అభివృద్ది కోసం రాజకీయాలను పక్కనపెట్టేశారు. అంతే… ఇద్దరు ముగ్గురయ్యారు. ఆ ముగ్గురూ నలుగురయ్యారు. వెరసి…
కొందరు స్టార్ హీరోయిన్లు కెరీర్ మంచి ఊపులో కొనసాగుతున్న టైంలోనే వ్యక్తిగత జీవితంలో సెటిల్ అవ్వాలని చూస్తుంటారు. ఈ క్రమంలో…