పవన్ కళ్యాణ్ చేయాల్సిన మూడు సినిమాల్లో ఎక్కువ బజ్ ఉన్నది ఓజి అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అంతకన్నా పెద్ద బడ్జెట్ తో హరిహర వీరమల్లు రూపొందినప్పటికీ ప్రమోషన్లు ఊపందుకోని కారణంగా ఇంకా ఆశించిన స్థాయిలో హైప్ ఏర్పడటం లేదు. వీటితో పాటు ఉస్తాద్ భగత్ సింగ్ లైన్ లో ఉంది.
ప్రాధాన్యం పరంగా ఇది చివరిలో జరిగే షూటింగ్ అయినప్పటికీ దర్శకుడు హరీష్ శంకర్ ఆశలన్నీ దీని మీదే ఉన్నాయి. మిస్టర్ బచ్చన్ ఇచ్చిన షాక్ నుంచి కోలుకుని మళ్ళీ కంబ్యాక్ నిరూపించుకోవడానికి ఇంత కన్నా మంచి అవకాశం ఉండదు. తర్వాతి లిస్టులో పెద్దా హీరోలున్నా ఉస్తాద్ సక్సెస్ చాలా కీలకం.
ఇదిలా ఉండగా నిన్న జరిగిన ప్రదీప్ రంగనాధన్ రిటర్న్ అఫ్ ది డ్రాగన్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో హరీష్ శంకర్ ఒక కీలక లీక్ పంచుకున్నారు. ఎన్నికలకు ముందు వైసిపి అధికారంలో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ ఓపెన్ టాప్ జీపు మీద కూర్చుని ప్రయాణం చేస్తుండగా వెనుకా ముందు వేల అభిమానులు వివిధ వాహనాల్లో ఫాలో అవుతున్న వీడియో విపరీతంగా వైరలయ్యింది.
రూలింగ్ పార్టీ ఎన్ని అడ్డంకులు ఏర్పరిచినా పవన్ దూసుకెళ్లిన వైనం జాతీయ మీడియాలోనూ వచ్చింది. అలాంటి ఎపిసోడ్ ఒకటి ఉస్తాద్ భగత్ సింగ్ లో ఉంటుందని వేదిక సాక్షిగా హరీష్ అఫీషియల్ గా లీక్ ఇచ్చేశారు.
వినడానికి సూపర్ ఎగ్జైటింగ్ గా ఉంది కానీ తేరికి కీలక మార్పులు చేసి తీస్తున్న ఈ రీమేక్ లో అలాంటి ఘట్టానికి ఎక్కడ స్కోప్ ఉంటుందన్నది ఆసక్తికరం. అయినా మార్పులు చేయడంలో హరీష్ స్టైల్ వేరు. బచ్చన్ తేడా కొట్టినా అంతకు ముందు గబ్బర్ సింగ్, గద్దలకొండ గణేష్ లో ఒరిజినల్ వెర్షన్ లో లేని ఎన్నో సీన్లు పెట్టి వాటి స్థాయిని పెంచారు.
పవన్ అంటే విపరీతమైన అభిమానం చూపించే హరీష్ శంకర్ ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్ లోనూ దాన్ని ఓ రేంజ్ లో ప్రదర్శించే ఉంటారు. కాకపోతే ఎప్పుడు పూర్తవుతుంది, వచ్చే ఏడాది ఎప్పుడు రిలీజవుతుందన్నది సమాధానం సులభంగా దొరకని భేతాళ ప్రశ్న.
తమిళ సినిమాల్లో చాలా ఏళ్ల నుంచి తిరుగులేని ఆధిపత్యం చలాయిస్తున్నాడు అనిరుధ్ రవిచందర్. అతడి హవా తమిళానికే పరిమితం కావట్లేదు…
బూత్ స్థాయిలో బలోపేతం అయ్యే దిశగా జనసేన కసరత్తు షురూ చేసింది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ నాయకులు ఉన్నప్పటికీ..…
ఏపీ రాజధాని అమరావతిలో రైతుల భూములను వారి అనుమతి లేకుండానే కూటమి సర్కారు లాక్కుంటోందని శనివారం పెద్ద రచ్చే జరిగింది. రాజధాని నిర్మాణం కోసం తమ భూములను…
లెనిన్ సినిమా ప్రమోషన్లలో హీరో అఖిల్ అక్కినేని గురించి ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశాడు నిర్మాతల్లో ఒకరైన నాగవంశీ. లెనిన్…
పిల్లలు సంపద అని సీఎం చంద్రబాబు మరోసారి స్పష్టం చేశారు. తాను చెప్పిన మాటకే కట్టుబడి ఉన్నానని తెలిపారు. దీనిని…
వియత్నాంలో విహార యాత్రకు వెళ్లిన భారతీయుల కుటుంబాల్లో విషాదం నెలకొంది. ఊహించని ప్రమాదంలో చిక్కుకుని 15 మంది భారతీయులు మృతి…