‘బాహుబలి’తో తిరుగులేని ఇమేజ్ సంపాదించిన ప్రభాస్ నుంచి వస్తున్న కొత్త సినిమా ‘రాధేశ్యామ్’. ‘సాహో’ డిజాస్టరైనా సరే.. ఈ చిత్రంపై అంచనాలు తక్కువగా ఏమీ లేవు. ప్రభాస్ గత సినిమాల్లాగే ఇది కూడా పాన్ ఇండియా స్థాయిలో భారీ బడ్జెట్లో తెరకెక్కింది. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటిదాకా బయటికొచ్చిన విశేషాల్ని బట్టి చూస్తే ఇదొక పీరియడ్ టచ్ ఉన్న సినిమా అని స్పష్టమవుతోంది.
30-40 ఏళ్ల వెనుకటి నేపథ్యంలో ఈ కథ నడుస్తుందన్న సంకేతాలే కనిపిస్తున్నాయి. ఈ సినిమా పోస్టర్లన్నింట్లోనూ వింటేజ్ టచ్ కనిపించింది. ఇదిలా ఉంటే.. సినిమాకు ‘రాధేశ్యామ్’ అని టైటిల్ పెట్టి, హీరో హీరోయిన్లను మాత్రం వేరే పేర్లతో పరిచయం చేయడం ప్రేక్షకులకు ఆశ్చర్యం కలిగిస్తోంది. ఈ సినిమా టైటిల్ రిలీజ్ చేసినప్పటి నుంచి హీరో హీరోయిన్ల పేర్లు శ్యామ్, రాధ అనే భావిస్తున్నారంతా.
కానీ కొన్ని రోజుల కిందట పూజా హెగ్డే పుట్టిన రోజు సందర్భంగా ఆమె పాత్ర పేరును ప్రేరణగా పరిచయం చేశారు. ఇక త్వరలో ప్రభాస్ పుట్టిన రోజు రానున్న నేపథ్యంలో రిలీజ్ చేసిన అతడి కొత్త పోస్టర్లో తన పేరును విక్రమాదిత్యగా పేర్కొన్నారు. దీంతో టైటిల్ అలా పెట్టి హీరో హీరోయిన్ల పేర్లు ఇలా ఫిక్స్ చేశారేంటి అన్న సందేహం కలుగుతోంది. ఐతే విక్రమాదిత్య, ప్రేరణ అనే పేర్లు కొంచెం పాతగా అనిపిస్తున్న నేపథ్యంలో ఇవి ఫ్లాష్ బ్యాక్ క్యారెక్టర్లు అయి ఉండొచ్చని.. ఆ పాత్రలు చనిపోయి పునర్జన్మ ఎత్తాక వాటి పేర్లు శ్యామ్, రాధ కావొచ్చని భావిస్తున్నారు.
ఇది పునర్జన్మల నేపథ్యంలో సాగే ప్రేమకథ అన్న ఊహాగానాలు ఇంతకుముందే వినిపించిన నేపథ్యంలో ఈ అంచనానే నిజం కావచ్చేమో. ఇలా కాకుండా ‘రాధేశ్యామ్’ టీమ్ వేరే ట్విస్టు ఏమైనా ఇస్తుందేమో చూడాలి. చిత్రీకరణ చివరి దశలో ఉన్న ఈ సినిమాను వచ్చే ఏడాది వేసవికి విడుదల చేయాలని భావిస్తున్నారు. శుక్రవారం ప్రభాస్ పుట్టిన రోజు సందర్భంగా ‘రాధేశ్యామ్’ మోషన్ పోస్టర్ రాబోతున్న సంగతి తెలిసిందే.
This post was last modified on October 22, 2020 2:41 pm
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ మంగళవారం ఉదయం అగ్ని ప్రమాదంలో…
వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డికి బుధవారం ఏపీ హైకోర్టు షాకిచ్చింది. అక్రమ మైనింగ్ కేసులో…
ఏప్రిల్ 25 నుంచి వాయిదా పడ్డాక కన్నప్ప ఎప్పుడు వస్తుందనే దాని గురించి మంచు ఫ్యాన్స్ కన్నా ప్రభాస్ అభిమానులు…
ఈ ఏడాది అతి పెద్ద బాక్సాఫీస్ క్లాష్ గా చెప్పుబడుతున్న వార్ 2, కూలి ఒకే రోజు ఆగస్ట్ 14…
2014లో ఉమ్మడి ఏపీ విడిపోయి.. రెండు రాష్ట్రాలుగా విడిపోయిన విషయం తెలిసిందే. అయితే.. ఆ తర్వాత.. కేంద్రంలో ప్రభుత్వం మారడంతో..…
స్టార్ హీరోలకు కోట్లలో అభిమానులు ఉంటారు. నిర్మాణంలో ఉన్న క్రేజీ సినిమాలకు సంబంధించిన అప్డేట్ అంటే చాలు వాళ్లకు ప్రాణం…