కెరీర్ ఆరంభం నుంచి కొంచెం హద్దుల్లో ఉండే నటిస్తోంది రాశి ఖన్నా. ‘బెంగాల్ టైగర్’లో బికినీ వేసినా సరే.. అందాల ప్రదర్శనలో మరీ హద్దులు దాటిపోలేదు. క్యారెక్టర్లు చాలా వరకు కొంచెం పద్ధతిగానే ఉన్నాయి. కానీ ఈ మధ్యే రిలీజైన ‘వరల్డ్ ఫేమస్ లవర్’లో మాత్రం రాశి కొంచెం బోల్డ్గా నటించింది.
అందులో వచ్చే ఒక బెడ్ రూం సీన్ చర్చనీయాంశం అయింది. ఈ సినిమా ట్రైలర్లో ఆ షాట్ చూసి రాశి ఫ్యాన్స్ హర్టయ్యారు. అప్పట్లో దీనిపై చాలా ట్రోలింగ్ కూడా జరిగింది. రాశిని ఇలా చూపించారేంటి అంటూ దర్శకుడు క్రాంతి మాధవ్ మీద.. హీరో విజయ్ దేవరకొండ మీద మండిపడ్డారు. ఐతే ఈ విమర్శల్ని అప్పుడు రాశి లైట్ తీసుకుంది. పాత్ర తాలూకు బోల్డ్ నెస్ కాకుండా.. ఎమోషన్ చూడాలని.. సినిమా చూశాక తన అభిమానులు అభిప్రాయం మార్చుకుంటారని అంది.
ఐతే వాళ్ల అభిప్రాయం ఎంత మారిందో ఏమో కానీ.. ఈ సినిమా ఎవరికీ రుచించలేదు. ఎన్నో ఆశలు పెట్టుకున్న రాశికి నిరాశే ఎదురైంది. వెంకీ మామ, ప్రతి రోజూ పండగే లాంటి హిట్ల తర్వాత రాశికి ఈ సినిమా ఫలితం పెద్ద షాకే. ‘వరల్డ్ ఫేమస్ లవర్’ వల్ల ఎలాంటి ప్రయోజనం చేకూరకపోవడంతో ఆమె తన అభిప్రాయం మార్చుకుంది.
ఇకపై బోల్డ్ క్యారెక్టర్లు చేయనని ఓ ఇంటర్వ్యూలో తెగేసి చెప్పింది. ఇందుకు ఆమె తన తల్లిదండ్రుల్ని కారణంగా చూపించింది. వాళ్లను ఇబ్బంది పెట్టే పాత్రలు ఇకపై చేయబోనంది. తాను ఆ సినిమాలోని సన్నివేశాల గురించి చెప్పినపుడే తన తల్లిదండ్రులు బాధ పడ్డారని.. అలాంటి సీన్లు చేయడం అవసరం లేదని తనకూ అనిపిస్తోందని.. తన అభిమానులు కూడా ఇలాంటి సన్నివేశాల్లో తనను చూడటానికి ఇష్టపడట్లేదని.. ఇకపై గ్లామరస్ సీన్లు చేస్తా తప్ప హద్దులు దాటనని రాశి స్పష్టం చేసింది.
This post was last modified on April 29, 2020 4:19 pm
ఏపీ రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లుకు లోక్సభ ఆమోదం తెలిపింది. వాస్తవానికి ఇప్పటికే చాలా బిల్లులు పెండింగులో ఉండగా..…
అమెరికాను నెంబర్ వన్ చేయాలన్న పేరుతో ఇష్టారాజ్యంగా నిర్ణయాలు తీసుకుంటూ.. ప్రపంచాన్ని ఆగమాగం చేసిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇమేజ్…
‘అమరావతి’ని ఆంధ్రప్రదేశ్ శాశ్వత రాజధానిగా నిర్ణయిస్తూ ఏపీ అసెంబ్లీ పెట్టిన తీర్మానం మీద ఇటీవలే ఒక టీవీ ఛానెల్లో చర్చా…
కంటెంట్ మీద ఎంత నమ్మకం ఉన్నా ప్రీమియర్ల విషయంలో నిర్మాతలు ఒకటికి పదిసార్లు ఆలోచించే పరిస్థితులు ఇప్పుడున్నాయి. కొన్నిసార్లు ఈ…
జివి ప్రకాష్ కుమార్ మనకూ బాగా సుపరిచితుడైన సంగీత దర్శకుడు. తమిళంలో అయితే రెగ్యులర్ గా హీరోగా కూడా నటిస్తూ…
ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశంపై వైసీపీ అధినేత వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ‘ప్లాన్-బీ’గా మచిలీపట్నం–విజయవాడ–గుంటూరు ప్రాంతాన్ని…