కెరీర్ ఆరంభం నుంచి కొంచెం హద్దుల్లో ఉండే నటిస్తోంది రాశి ఖన్నా. ‘బెంగాల్ టైగర్’లో బికినీ వేసినా సరే.. అందాల ప్రదర్శనలో మరీ హద్దులు దాటిపోలేదు. క్యారెక్టర్లు చాలా వరకు కొంచెం పద్ధతిగానే ఉన్నాయి. కానీ ఈ మధ్యే రిలీజైన ‘వరల్డ్ ఫేమస్ లవర్’లో మాత్రం రాశి కొంచెం బోల్డ్గా నటించింది.
అందులో వచ్చే ఒక బెడ్ రూం సీన్ చర్చనీయాంశం అయింది. ఈ సినిమా ట్రైలర్లో ఆ షాట్ చూసి రాశి ఫ్యాన్స్ హర్టయ్యారు. అప్పట్లో దీనిపై చాలా ట్రోలింగ్ కూడా జరిగింది. రాశిని ఇలా చూపించారేంటి అంటూ దర్శకుడు క్రాంతి మాధవ్ మీద.. హీరో విజయ్ దేవరకొండ మీద మండిపడ్డారు. ఐతే ఈ విమర్శల్ని అప్పుడు రాశి లైట్ తీసుకుంది. పాత్ర తాలూకు బోల్డ్ నెస్ కాకుండా.. ఎమోషన్ చూడాలని.. సినిమా చూశాక తన అభిమానులు అభిప్రాయం మార్చుకుంటారని అంది.
ఐతే వాళ్ల అభిప్రాయం ఎంత మారిందో ఏమో కానీ.. ఈ సినిమా ఎవరికీ రుచించలేదు. ఎన్నో ఆశలు పెట్టుకున్న రాశికి నిరాశే ఎదురైంది. వెంకీ మామ, ప్రతి రోజూ పండగే లాంటి హిట్ల తర్వాత రాశికి ఈ సినిమా ఫలితం పెద్ద షాకే. ‘వరల్డ్ ఫేమస్ లవర్’ వల్ల ఎలాంటి ప్రయోజనం చేకూరకపోవడంతో ఆమె తన అభిప్రాయం మార్చుకుంది.
ఇకపై బోల్డ్ క్యారెక్టర్లు చేయనని ఓ ఇంటర్వ్యూలో తెగేసి చెప్పింది. ఇందుకు ఆమె తన తల్లిదండ్రుల్ని కారణంగా చూపించింది. వాళ్లను ఇబ్బంది పెట్టే పాత్రలు ఇకపై చేయబోనంది. తాను ఆ సినిమాలోని సన్నివేశాల గురించి చెప్పినపుడే తన తల్లిదండ్రులు బాధ పడ్డారని.. అలాంటి సీన్లు చేయడం అవసరం లేదని తనకూ అనిపిస్తోందని.. తన అభిమానులు కూడా ఇలాంటి సన్నివేశాల్లో తనను చూడటానికి ఇష్టపడట్లేదని.. ఇకపై గ్లామరస్ సీన్లు చేస్తా తప్ప హద్దులు దాటనని రాశి స్పష్టం చేసింది.
This post was last modified on April 29, 2020 4:19 pm
భారత పోరుగు దేశం, దేవభూమి నేపాల్లో ఒక్కసారిగా సంభవించిన జల ప్రళయం.. ప్రజలను అతలాకుతలం చేసింది. ఒక్కసారిగా ఉప్పొంగిన కోశీ…
మూడు సంవత్సరాల క్రితం టాలీవుడ్ లో కొత్త రికార్డులు తిరగరాస్తూ హనుమాన్ ఎంత సంచలన విజయం సాధించిందో మూవీ లవర్స్…
వరస ఫ్లాపులతో ఉక్కిరిబిక్కిరవుతున్న టైంలో రవితేజకు ఇరుముడి పెద్ద రిలీఫ్ ఇచ్చింది. విజయం ఊహించిందే కానీ మరీ రికార్డులు బద్దలు…
తెలుగు దర్శకుల్లో కొందరు మాత్రమే ఒక జనరేషన్ ని ప్రభావితం చేసే స్థాయిలో సినిమాలు తీస్తారు. ముఖ్యంగా కెరీర్ ప్రారంభంలో…
ఏ పార్టీ అయినా.. తీసుకునే నిర్ణయాలు.. చేసే ప్రకటనల విషయంలో ఆచి తూచి వ్యవహరించాలి. సమయం వచ్చిందనో.. సందర్భం చిక్కిందనో…
త్వరలో జరగనున్న స్థానిక ఎన్నికలను పూర్తిస్థాయిలో బ్యాలెట్ విధానంలోనే నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి ఎన్నికల సంఘం కూడా…