న్యాచురల్ స్టార్ నాని హీరోగా శైలేష్ కొలను దర్శకత్వంలో రూపొందుతున్న ‘హిట్ 3 ది థర్డ్ కేస్’ మొదటి రెండు భాగాలకు భిన్నంగా చాలా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోంది. విశ్వక్ సేన్, అడివి శేష్ చేసిన వన్ అండ్ టూ పార్ట్స్ లో కథ ఒకే కేసు చుట్టూ అది కూడా హైదరాబాద్, వైజాగ్ లాంటి సింగల్ లొకేషన్ లో జరుగుతుంది.
స్క్రీన్ ప్లే టైట్ గా ఉండటం వల్ల ఆడియన్స్ వాటితో బాగా కనెక్ట్ అయిపోయారు. ఊహించని ట్విస్టులతో సర్ప్రైజ్ చేసిన శైలేష్ ఇప్పుడు ఏకంగా నిర్మాత కం హీరోనే పోలీస్ ఆఫీసర్ గా మారడంతో వయొలెంట్ డోస్ అమాంతం పెంచేశాడట. లీక్స్ ప్రకారం హిట్ 3 కేస్ ఒకే చోట ఉండదు.
హైదరాబాద్, వైజాగ్, రాజస్థాన్, జమ్మూ కాశ్మీర్, అరుణాచల్ ప్రదేశ్ ఇప్పటిదాకా హిట్ 3 షూట్ చేసుకున్న ప్రాంతాలు. వీటిలో రిస్కీ వాతావరణం ఉండే కొండ, మంచు, ఎడారి ప్రాంతాలున్నాయి. కేవలం మర్డర్ మిస్టరీ అయితే ఇన్ని ఏరియాలు అవసరం లేదు. కానీ నాని పోషిస్తున్న అర్జున్ సర్కార్ పాత్ర దేశమంతా తిరిగిందంటే ఏదో పెద్ద సెటప్ ఉంటుంది.
ఇన్ సైడ్ టాక్ ప్రకారం దేశంలో వివిధ ప్రాంతాల్లో జరిగిన హత్యలకు ముడిపడిన కీలకమైన క్లూల కోసం నాని చాలా చోట్ల తిరుగుతాడట. అక్కడ ఎదురయ్యే సవాళ్లు, ప్రమాదాలు ఆడియన్స్ ఊహించని రీతిలో షాక్ ఇచ్చేలా ఉంటాయని వినికిడి.
ఈ లెక్కన నాని ఒక ఇంటర్వ్యూలో అన్నట్టు మొదటిసారి తన సినిమాకు ఏ సర్టిఫికెట్ వచ్చినా ఆశ్చర్యం లేదని చెప్పడం నిజమయ్యేలా లేదు. గత ఏడాది వెంకటేష్ తో చేసిన సైంధవ్ దారుణంగా డిజాస్టర్ అయ్యాక శైలేష్ కొలనుకు దొరికిన సూపర్ ఛాన్స్ ఇది. ఖచ్చితంగా కంబ్యాక్ అవ్వాలనే టార్గెట్ తో కసిమీద పనిచేస్తున్నాడు.
అన్నట్టు హిట్ 1,2 లో చేసిన విశ్వక్, శేష్ ఇందులో కనిపిస్తారనే టాక్ ఉంది కానీ ఇంకా నిర్ధారణ కాలేదు. హిట్ 4కి మాస్ మహారాజా రవితేజ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడనే వార్త కూడా ప్రచారంలో ఉంది. కాకపోతే హిట్ 3 విడుదలయ్యాక తప్ప దీని గురించి స్పష్టత వచ్చే అవకాశం లేదు.
This post was last modified on February 16, 2025 2:01 pm
అంశం ఏదైనా సరే.. కేంద్ర ప్రభుత్వం ఒకసారి డిసైడ్ అయితే.. తన అజెండాకు తగ్గట్లుగా పరిస్థితుల్ని మార్చేయటం కొత్తేం కాదు.…
వేసవి వచ్చిందంటే చాలు.. గల్లీ నుంచి ఢిల్లీ వరకు అంతా మామిడి పండ్ల కోసమే ఎదురుచూస్తారు. ఒకప్పుడు వేసవి సెలవుల్లో…
బీజేపీ, వైసీపీల మధ్య మైత్రి ఇంకెన్నటికీ చెక్కు చెదరదనే చెప్పాలి. ఎందుకంటే...బీజేపీ ఇప్పటిదాకా ప్రతిపాదించిన ప్రతి అంశానికి బేషరతుగా మద్దతు ప్రకటించిన వైసీపీ...తాజాగా నియోజకవర్గాల పునర్విభజనకు కూడా…
బీహార్లో బిజెపి ముఖ్యమంత్రిగా సామ్రాట్ చౌదరి బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. కుష్వాహా సామాజిక వర్గానికి చెందిన సామ్రాట్ చౌదరి…
వైసీపీ హయాంలో రాష్ట్రాన్ని అన్ని విధాలా దోచుకున్న జగన్.. పేదలకు పట్టెడన్నం కూడా పెట్టలేక పోయారని సీఎం చంద్రబాబు విమర్శించారు.…
ఏపీ రాజధాని అమరావతిపై వైసీపీ నాయకులు అదే అక్కసు ప్రదర్శిస్తున్నారు. రాజధానిపై తీవ్ర విమర్శలు గుప్పిస్తూనే ఉన్నారు. జగన్ ప్రతిపాదించిన…