Movie News

పట్టు తప్పింది… కోట్ల నష్టం మిగిలింది

స్టార్ హీరో ఉంటే చాలు కంటెంట్ అటుఇటు ఉన్నా జనం ఎగబడి చూస్తారనే భ్రమలు ఇప్పుడు లేవు. ఏ మాత్రం తేడా ఉన్నా ప్రేక్షకులు నిర్మొహమాటంగా తిరస్కరిస్తున్నారు. పది రోజుల క్రితం విడుదలైన పట్టుదల (విడాముయార్చి) నెగటివ్ టాక్ లోనూ వంద కోట్ల వసూళ్లు దాటాయంటే దానికి కారణం కేవలం అజిత్ ఇమేజే.

అయినా నష్టాలను నుంచి కాపాడేందుకు మాత్రం అది సరిపోలేదు. ఇప్పటిదాకా కేవలం నూటా పాతిక కోట్ల దాకా కలెక్ట్ చేసిన ఈ యాక్షన్ ఎంటర్ టైనర్ ఫైనల్ రన్ అయ్యేలోపు మహా అయితే నూటా యాభై కోట్ల దగ్గర క్లోజ్ చేయొచ్చని ట్రేడ్ టాక్. అంటే దాదాపు సగం వరకు లైకాకు పోయినట్టేనట.

ప్రొడక్షన్ ఖర్చు, నటీనటుల రెమ్యునరేషన్లు, అబర్ బైజాన్ షెడ్యూల్, సాంకేతిక వర్గం పారితోషికాలు, వాయిదాల వడ్డీలు వగైరా అన్నీ కలిపితే పట్టుదల మీద లైకా సంస్థ సుమారు 300 కోట్ల దాకా బడ్జెట్ ఖర్చు పెట్టిందట. తమిళంలో చాలా వరకు నయం కానీ ఇతర భాషల్లో మాత్రం అవుట్ రైట్ డిజాస్టర్ గా మిగిలిపోయింది.

పరిస్థితి ఎలా ఉందంటే వారం తిరక్కుండానే హెచ్డి పైరసీ వస్తే దాన్ని కనీసం పట్టించుకోలేనంత దారుణంగా ఫ్లాప్ అయ్యింది. అజిత్ కాకుండా త్రిష, అర్జున్, రెజీనా, అనిరుద్ రవిచందర్ ఇలా పేర్లు చూస్తేనే చాలు ఎంత సొమ్ములు కరిగిపోయి ఉంటాయో అర్థం చేసుకోవచ్చు. ఇదంతా ఒకరకంగా పాఠమని చెప్పాలి.

రజనీకాంత్ లాల్ సలామ్, కమల్ హాసన్ భారతీయుడు 2, సూర్య కంగువ, రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ ఇవన్నీ పరిశ్రమకు ఖరీదైన పాఠాలుగా మారిపోతున్నాయి. వీటి సరసన పట్టుదల కూడా చేరిపోయింది. అజిత్ తర్వాతి సినిమా గుడ్ బ్యాడ్ అగ్లీని ఎట్టి పరిస్థితుల్లో వాయిదా లేకుండా ఏప్రిల్ 10 విడుదల చేయమని మైత్రి మూవీ మేకర్స్ మీద అభిమానులు ఒత్తిడి చేస్తున్నారు.

తమ హీరో అసలైన స్టామినా అప్పుడు చూస్తారని యాంటీ ఫ్యాన్స్ కు సవాల్ విసురుతున్నారు. మనకు యావరేజ్ గా అనిపించినా మొన్న ఏడాది సంక్రాంతికొచ్చిన తెగింపు అజిత్ కెరీర్ లో హయ్యస్ట్ గ్రాసర్ అంటే ఆశ్చర్యం వేసినా అదే నిజం.

This post was last modified on February 15, 2025 4:55 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

పెద్ది మెడకు పర్సెంటేజ్ గొడవ

తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…

1 hour ago

‘నీట్’ గా పేపర్ అమ్మేశారట!

నీట్ యూజీ పేపర్ లీక్ వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా 22 మంది లక్షల విద్యార్థుల…

1 hour ago

భగీరథ్ కేసు వాదించేది వైసీపీ ఎంపీనే

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ పై పోక్సో కేసు నమోదైన సంగతి తెలిసిందే.…

2 hours ago

కేరళం ‘సీల్డ్ కవర్’ తెరచుకునేదెన్నడో..?

దేశంలో ఇటీవలే ముగిసిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎప్పుడో వెలువడ్డాయి. ఆ ఐదు రాష్ట్రాల్లో నాలుగు రాష్ట్రాల్లో…

3 hours ago

ప్రజలను ఆందోళనకు గురి చేస్తున్న మోదీ వ్యాఖ్యలు

యావత్తు ప్రపంచాన్ని కరోనా చుట్టుముట్టిన తరుణంలో లాక్ డౌన్ అంటే ఏమిటో… ఎలా ఉంటుందో చూశాం. ఇప్పుడు కరోనా లాంటి…

6 hours ago

ఒక్క ఓటుతో గెలిస్తే ఓటేయొద్దా…?

తమిళ రాజకీయాల్లో వరుసబెట్టి ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. తమిళనాడు అసెంబ్లీకి జరిగిన ఎన్నికల ఫలితాలు వెలువడిన దగ్గర నుంచి రోజుకో…

7 hours ago