‘ఆర్.ఆర్.ఆర్.’ తర్వాత ఇమ్మీడియట్గా చేయబోయే చిత్రం ఏమిటనేది చరణ్ ఇంకా డిసైడ్ చేసుకోలేదు. అయితే ఆ ప్రాజెక్ట్ తర్వాత వచ్చే రెండు సినిమాలకు మాత్రం టాప్ డైరెక్టర్లను లాక్ చేసుకున్నాడు. త్రివిక్రమ్తో చరణ్ సినిమా ఒకటి ఖాయం చేసుకున్నాడు. అయితే దాని కంటే ముందుగా త్రివిక్రమ్ తారక్, మహేష్ సినిమాలు చేయాల్సి వుంటుంది.
ఇక కొరటాల శివతో ఎప్పట్నుంచో అనుకుంటూ కుదరని ప్రాజెక్ట్ కూడా చరణ్ లైన్లో పెట్టేసినట్టు తెలిసింది. ఆచార్య తర్వాత అల్లు అర్జున్ సినిమా చేయనున్న కొరటాల తన తదుపరి చిత్రాన్ని చరణ్తోనే చేస్తాడట. అయితే ఈ రెండు సినిమాల కంటే ముందు చరణ్ ఓ సినిమా చేయాలి.
అదెవరితో చేయాలనేది ఇంకా ఫిక్స్ అవలేదు. కెజిఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ తెలుగులో అగ్ర హీరోతో ఒక సినిమా చేయాలని ఉవ్విళ్లూరుతున్నాడు. ఎన్టీఆర్, ప్రభాస్, మహేష్తో అతని ప్రయత్నాలు ఫలించలేదు. అతను కెజిఎఫ్ 2 రిలీజ్ అయిన తర్వాత చరణ్ని కాంటాక్ట్ చేసే అవకాశముందని అంటున్నారు.
మరి చరణ్తో అయినా అతని సినిమా ఖాయం అవుతుందా లేదా అనేది వేచి చూడాల్సిందే. ఆర్.ఆర్.ఆర్. తర్వాత పాన్ ఇండియా ప్రాజెక్ట్ కోరుకుంటే మాత్రం ప్రశాంత్ నీల్ మంచి ఆప్షనే.
This post was last modified on October 21, 2020 11:08 pm
ఒకప్పుడు టాలీవుడ్లో తిరుగులేని ఆధిపత్యం చలాయించిన కథానాయికల్లో తమన్నా ఒకరు. టీనేజీలోనే కథానాయిక అవతారం ఎత్తిన ఆమె పదేళ్లకు పైగానే టాప్…
థియేటర్, ఓటిటి మధ్య ఖచ్చితంగా ఎనిమిది వారాల గ్యాప్ ఉండాలనే నిబంధన మీద దక్షిణాది ఇండస్ట్రీ పెద్దలు చాలా సీరియస్…
అధికారంలోకి రావడానికి ముందు వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా ఫెరోషియస్గా కనిపించేవారు. అవినీతి కేసుల వ్యవహారం పక్కన పెడితే…
‘బాహుబలి’ సినిమాకు బాలీవుడ్ నుంచి అప్పట్లో ఎంత గొప్ప సహకారం అందిందో తెలిసిందే. కరణ్ జోహార్ లాంటి అగ్ర నిర్మాత ఆ…
మోనాలిసా.. గత ఏడాది సోషల్ మీడియాను ఒక ఊపు ఊపేసిన పేరిది. ఉత్తర్ప్రదేశ్లో జరిగిన మహా కుంభమేళాతో వెలుగులోకి వచ్చిన…
తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, మాజీ మంత్రి పార్టీ కీలక…