‘ఆర్.ఆర్.ఆర్.’ తర్వాత ఇమ్మీడియట్గా చేయబోయే చిత్రం ఏమిటనేది చరణ్ ఇంకా డిసైడ్ చేసుకోలేదు. అయితే ఆ ప్రాజెక్ట్ తర్వాత వచ్చే రెండు సినిమాలకు మాత్రం టాప్ డైరెక్టర్లను లాక్ చేసుకున్నాడు. త్రివిక్రమ్తో చరణ్ సినిమా ఒకటి ఖాయం చేసుకున్నాడు. అయితే దాని కంటే ముందుగా త్రివిక్రమ్ తారక్, మహేష్ సినిమాలు చేయాల్సి వుంటుంది.
ఇక కొరటాల శివతో ఎప్పట్నుంచో అనుకుంటూ కుదరని ప్రాజెక్ట్ కూడా చరణ్ లైన్లో పెట్టేసినట్టు తెలిసింది. ఆచార్య తర్వాత అల్లు అర్జున్ సినిమా చేయనున్న కొరటాల తన తదుపరి చిత్రాన్ని చరణ్తోనే చేస్తాడట. అయితే ఈ రెండు సినిమాల కంటే ముందు చరణ్ ఓ సినిమా చేయాలి.
అదెవరితో చేయాలనేది ఇంకా ఫిక్స్ అవలేదు. కెజిఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ తెలుగులో అగ్ర హీరోతో ఒక సినిమా చేయాలని ఉవ్విళ్లూరుతున్నాడు. ఎన్టీఆర్, ప్రభాస్, మహేష్తో అతని ప్రయత్నాలు ఫలించలేదు. అతను కెజిఎఫ్ 2 రిలీజ్ అయిన తర్వాత చరణ్ని కాంటాక్ట్ చేసే అవకాశముందని అంటున్నారు.
మరి చరణ్తో అయినా అతని సినిమా ఖాయం అవుతుందా లేదా అనేది వేచి చూడాల్సిందే. ఆర్.ఆర్.ఆర్. తర్వాత పాన్ ఇండియా ప్రాజెక్ట్ కోరుకుంటే మాత్రం ప్రశాంత్ నీల్ మంచి ఆప్షనే.
This post was last modified on October 21, 2020 11:08 pm
తమిళగ వెట్రి కళగం అధినేత జోసెఫ్ విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయడం ఖరారైంది. ఆరు రోజులుగా ట్విస్టులతో సాగిన రాజకీయ…
రాజకీయాల్లో అవకాశాలు రావడమే అరుదు. వచ్చిన వాటిని వినియోగించుకోవాల్సిన అవసరం.. వాటిని పట్టుకుని ఎదగాల్సిన అవసరం కూడా పార్టీలకు, నాయకులకు…
తమిళనాడు కొత్త ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ కొత్త సినిమా జన నాయకుడు విడుదలకు మార్గం సుగమమయ్యింది. సిఎం పదవిని చేపట్టేందుకు…
పదమూడేళ్ల క్రితం ఇండస్ట్రీకి కొత్త ట్రెండ్ తీసుకొచ్చిన దృశ్యం ఫ్రాంచైజ్ లో మూడో భాగం మే 21 విడుదల కానుంది.…
తమిళనాడు రాజకీయాల్లో చోటు చేసుకున్న అనిశ్చిత పరిస్థితి తొలిగిపోయింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అతి పెద్ద పార్టీగా అవతరించిన…
దేశ ప్రధాని నరేంద్ర మోడీ.. ఆదివారం హైదరాబాద్లో పర్యటించనున్నారు. వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు. అయితే.. ఈ పర్యటనలో మరో…