బిగ్బాస్ పేరుకి ఆడియన్స్ అభిప్రాయాలను బట్టి నడిచే రియాలిటీ షోనే కానీ దాని ఓటింగ్ ప్రాసెస్లో బోలెడు లుకలుకలున్నాయి. ఆడియన్స్ ఓటింగ్ ద్వారా విజేత డిసైడ్ అవుతాడు కాబట్టి ఈ షోకి వెళ్లే ముందు పలువురు కంటెస్టెంట్లు కొన్ని ఏజెన్సీలతో టై అప్ అయి తమకు ఓట్లు పోలయ్యేలా చూసుకుంటూ వుంటారు. హిందీలో బిగ్బాస్ ఎప్పట్నుంచో నడుస్తున్నా కానీ అది నేషనల్ వైడ్ రీచ్ వుంది కనుక ఇలాంటివి అక్కడ చెల్లలేదు. తెలుగు షో రీజనల్ కనుక ఓట్ల మ్యానిప్యులేషన్ ఈజీ అయిపోయింది.
షో గెలిచినా, లేకపోయినా కానీ ఎక్కువ వారాల పాటు షోలో వుండేట్టు పలువురు జాగ్రత్త పడుతున్నారు. అయితే ఎంత కాదన్నా షో ఒక లెవల్కి చేరే సరికి ఆడియన్స్ ఓట్లు కీలకమవుతాయి. కానీ ఈ సీజన్లో ఇంతవరకు క్రౌడ్ ఫేవరెట్ అంటూ ఎవరూ ఏర్పడలేదు. దీంతో మొదట్నుంచీ పీ.ఆర్. మేనేజ్మెంట్తో ఓట్ల పరంగా లీడింగ్లో వున్నాడనే అభియోగాలు ఎదుర్కొంటోన్న అభిజీత్ ఇప్పటికీ తన ఆధిక్యం కొనసాగిస్తున్నాడు.
షోలో అతను ఫేవరెట్ అని చెప్పుకోడానికి ఇంతవరకు ఒక్క మొమెంట్ కూడా లేదు. ప్రతి టాస్కులోను దొడ్డి దారులు వెతికి గెలవాలని చూస్తాడే తప్ప ఎఫర్టస్ పెట్టడు. డాన్సులు చేయడు, ఎంటర్టైన్మెంట్ ఇవ్వడు, మిగతా వాళ్లను తక్కువగా చూస్తుంటాడు. అయితే బిగ్బాస్ ట్రెండ్స్ చూస్తే మాత్రం అతను తుమ్మినా, దగ్గినా ఎలివేషన్ ఇస్తూ పలు అకౌంట్లు రాత్రీ పగలూ అదే పని మీదుంటారు.
ఆల్రెడీ సగానికి చేరుకున్న సీజన్లో ఇకమీదట అయినా ఎవరైనా పబ్లిక్తో కనక్షన్ సాధించకపోతే ఇప్పుడు జరిగే ఓటింగ్ పరంగా అభిజీత్ విన్నర్ అవుతాడు. అదే జరిగితే ఇకపై షోకి వచ్చే కంటెస్టెంట్లు ఏజెన్సీలను సెట్ చేసుకుని వచ్చి రియాలిటీ షోని కంగాళీ చేసి పారేస్తారని బిగ్బాస్ ట్రెండ్స్ ని నిశితంగా పరిశీలించే వారు అభిప్రాయపడుతున్నారు.
This post was last modified on October 21, 2020 10:56 pm
పార్టీ పటిష్టంగా ఉండాలన్నా, ప్రజలకు పారదర్శకంగా సంక్షేమ పథకాలు అందాలన్నా ఆ పార్టీ ప్రజా ప్రతినిధులే కీలకం. రాజకీయాల్లో ఈ…
దేశంలో అత్యధిక సినీ అభిమానం ఉన్న ప్రేక్షకులుగా తెలుగు ఆడియన్సుకి పేరుంది. తెలుగు రాష్ట్రాలు రెంటినీ కలిపి ఒక యూనిట్…
జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.30 కోట్ల నిధులను…
అటు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి ఏపీకి నిధులు మంజూరు అయ్యేలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇటు తన శాఖలను సమర్థవంతంగా…
నిన్న జరిగిన ఛాంపియన్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు రామ్ చరణ్ ముఖ్యఅతిధిగా రావడం హైప్ పరంగా దానికి మంచి…
వైసీపీ హయాంలో విశాఖపట్నంలోని ప్రఖ్యాత పర్యాటక ప్రాంతం రుషికొండను తొలిచి.. నిర్మించిన భారీ భవనాల వ్యవహారం కొలిక్కి వస్తున్నట్టు ప్రభుత్వ…