ఈ వేసవిలో టాలీవుడ్ నుంచి రాబోతున్న ఏకైక భారీ చిత్రం.. కన్నప్ప. రాజా సాబ్, విశ్వంభర లాంటి పెద్ద సినిమాలు వేసవి బరి నుంచి తప్పుకున్నట్లు కనిపిస్తుండడంతో ప్రేక్షకుల దృష్టి ‘కన్నప్ప’ మీదికి మళ్లుతోంది. మామూలుగా మంచు విష్ణు సినిమా అంటే అంత హైప్ ఉండేది కాదు కానీ.. ఇందులో ప్రభాస్, మోహన్ లాల్, అక్షయ్ కుమార్ లాంటి బిగ్ స్టార్స్ నటిస్తుండడం.. ఏకంగా వంద కోట్లకు పైగా బడ్జెట్లో సినిమా తెరకెక్కడం.. క్లాసిక్ మూవీ అయిన ‘భక్త కన్నప్ప’కు మోడర్న్ అడాప్షన్ కావడంతో దీనిపై అంచనాలు భారీగానే ఉన్నాయి.
ఈ చిత్రం కోసం విష్ణు ఇంతమంది పెద్ద స్టార్లను ఒప్పించడం విశేషమే. ఐతే మిగతా వాళ్ల సంగతేమో కానీ.. అక్షయ్ కుమార్ను శివుడి పాత్రకు ఒప్పించడానికి మాత్రం విష్ణు చాలానే కష్టపడ్డాడట. ఒక ఇంటర్వ్యూలో విష్ణు మాట్లాడుతూ.. అక్షయ్ ‘కన్నప్ప’లో శివుడి పాత్రను రెండుసార్లు తిరస్కరించినట్లు వెల్లడించాడు. కానీ మూడో ప్రయత్నంలో ఒక పెద్ద డైరెక్టర్ ద్వారా రాయబారం నడిపి.. తన పాత్ర గురించి బలంగా చెప్పి ఒప్పించినట్లు విష్ణు తెలిపాడు.
ఆ డైరెక్టర్ ఎవరన్నది విష్ణు వెల్లడించలేదు. ఈ తరానికి శివుడి పాత్ర గొప్పదనం గురించి చూపించడానికి మీరే సరైన వారని చెప్పి అక్షయ్ని ఒప్పించినట్లు విష్ణు తెలిపాడు. నిజానికి అక్షయ్ ఓకే కావడానికి ముందు ఈ సినిమాలో శివుడి పాత్రను ప్రభాస్ చేస్తాడని ముందు వార్తలు వచ్చాయి. ఐతే ప్రభాస్కు కథ చెప్పినపుడు తనకోసం శివుడి పాత్రనే దృష్టిలో ఉంచుకున్నప్పటికీ అతడికి వేరే పాత్ర నచ్చి తాను ఎంచుకున్నాడని విష్ణు గతంలో చెప్పాడు.
ఆ పాత్ర గురించి సస్పెన్స్ ఇటీవలే వీడింది. రుద్ర అనే శివుడి దూత పాత్రను ప్రభాస్ ఇందులో పోషించిన సంగతి తెలిసిందే. ఏప్రిల్ 25న ‘కన్నప్ప’ ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే.
This post was last modified on February 13, 2025 4:53 pm
కొందరు ఫిలిం మేకర్స్ తమ సినిమా కథేంటో చివరి వరకు దాచి పెట్టాలని ప్రయత్నిస్తారు. నేరుగా థియేటర్లలో ప్రేక్షకులను ఆశ్చర్యపరచాలనుకుంటారు.…
ఏపీ సీఎం చంద్రబాబుకు ప్రముఖ దినపత్రిక `ఎకనమిక్ టైమ్స్`.. ప్రతిష్టాత్మక వ్యాపార సంస్కర్త-2025 పురస్కారానికి ఎంపిక చేసిన విషయం తెలిసిందే.…
బంగ్లాదేశ్లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు భారత్కు పెద్ద తలనొప్పిగా మారాయి. 1971 విముక్తి యుద్ధం తర్వాత మన దేశానికి ఇదే…
ప్రేమ ఎప్పుడు ఎవరి మీద పుడుతుందో చెప్పలేం అంటారు. కానీ జపాన్ లో జరిగిన ఈ పెళ్లి చూస్తే టెక్నాలజీ…
ప్రభుత్వం తరఫున ఖర్చుచేసేది ప్రజాధనమని సీఎం చంద్రబాబు తెలిపారు. అందుకే ఖర్చు చేసే ప్రతి రూపాయికీ ఫలితాన్ని ఆశిస్తానని చెప్పారు.…
`వ్యాపార సంస్కర్త-2025` అవార్డును ఏపీ సీఎం చంద్రబాబు కైవసం చేసుకున్నారు. అయితే.. దేశవ్యాప్తంగా 28 రాష్ట్రాలు, 28 మంది ముఖ్యమంత్రులు…