ఈ వేసవిలో టాలీవుడ్ నుంచి రాబోతున్న ఏకైక భారీ చిత్రం.. కన్నప్ప. రాజా సాబ్, విశ్వంభర లాంటి పెద్ద సినిమాలు వేసవి బరి నుంచి తప్పుకున్నట్లు కనిపిస్తుండడంతో ప్రేక్షకుల దృష్టి ‘కన్నప్ప’ మీదికి మళ్లుతోంది. మామూలుగా మంచు విష్ణు సినిమా అంటే అంత హైప్ ఉండేది కాదు కానీ.. ఇందులో ప్రభాస్, మోహన్ లాల్, అక్షయ్ కుమార్ లాంటి బిగ్ స్టార్స్ నటిస్తుండడం.. ఏకంగా వంద కోట్లకు పైగా బడ్జెట్లో సినిమా తెరకెక్కడం.. క్లాసిక్ మూవీ అయిన ‘భక్త కన్నప్ప’కు మోడర్న్ అడాప్షన్ కావడంతో దీనిపై అంచనాలు భారీగానే ఉన్నాయి.
ఈ చిత్రం కోసం విష్ణు ఇంతమంది పెద్ద స్టార్లను ఒప్పించడం విశేషమే. ఐతే మిగతా వాళ్ల సంగతేమో కానీ.. అక్షయ్ కుమార్ను శివుడి పాత్రకు ఒప్పించడానికి మాత్రం విష్ణు చాలానే కష్టపడ్డాడట. ఒక ఇంటర్వ్యూలో విష్ణు మాట్లాడుతూ.. అక్షయ్ ‘కన్నప్ప’లో శివుడి పాత్రను రెండుసార్లు తిరస్కరించినట్లు వెల్లడించాడు. కానీ మూడో ప్రయత్నంలో ఒక పెద్ద డైరెక్టర్ ద్వారా రాయబారం నడిపి.. తన పాత్ర గురించి బలంగా చెప్పి ఒప్పించినట్లు విష్ణు తెలిపాడు.
ఆ డైరెక్టర్ ఎవరన్నది విష్ణు వెల్లడించలేదు. ఈ తరానికి శివుడి పాత్ర గొప్పదనం గురించి చూపించడానికి మీరే సరైన వారని చెప్పి అక్షయ్ని ఒప్పించినట్లు విష్ణు తెలిపాడు. నిజానికి అక్షయ్ ఓకే కావడానికి ముందు ఈ సినిమాలో శివుడి పాత్రను ప్రభాస్ చేస్తాడని ముందు వార్తలు వచ్చాయి. ఐతే ప్రభాస్కు కథ చెప్పినపుడు తనకోసం శివుడి పాత్రనే దృష్టిలో ఉంచుకున్నప్పటికీ అతడికి వేరే పాత్ర నచ్చి తాను ఎంచుకున్నాడని విష్ణు గతంలో చెప్పాడు.
ఆ పాత్ర గురించి సస్పెన్స్ ఇటీవలే వీడింది. రుద్ర అనే శివుడి దూత పాత్రను ప్రభాస్ ఇందులో పోషించిన సంగతి తెలిసిందే. ఏప్రిల్ 25న ‘కన్నప్ప’ ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే.
This post was last modified on February 13, 2025 4:53 pm
ప్రభాస్ అభిమానులకు పీడకలగా మిగిలిపోయిన ఆదిపురుష్ మరోసారి సోషల్ మీడియా టాపిక్ అయ్యింది. కారణం రామాయణ ట్రైలర్. రెండు సినిమాల్లో…
వైసీపీ అధినేత జగన్ ఏలక్ష్యంతో అయితే.. శ్రీకాకుళం పర్యటనకు వెళ్లారో.. ఆ లక్ష్యం నెరవేరకుండానే వెనుదిరిగే పరిస్థితి ఏర్పడింది. దీనికి…
రెండేళ్ల క్రితం వచ్చిన లక్కీ భాస్కర్ ఓ మోస్తరు అంచనాలతో బ్లాక్ బస్టర్ విజయం సాధించడం దుల్కర్ సల్మాన్ టాలీవుడ్…
ఒకప్పుడు బ్లాక్ బస్టర్ సినిమాలు వంద, రెండు వందల రోజులు ఆడటం మాములు విషయం. ప్రేమాభిషేకం, అడవి రాముడు ఏడాది…
ఇంతకూ కేంద్ర విద్యా శాఖలో ఏం జరుగుతుంది. నీట్ పేపర్ లీకేజి తర్వాత కాక్రోచ్ జనతా పార్టీ పేరుతో జరిగిన…
ప్రాంతీయ పార్టీలు అధికారంలో వున్న రాష్ట్రాల్లో సంక్షేమ పథకాల జోరు కొనసాగుతోంది. అందులోనూ దక్షిణాది రాష్ట్రాల్లో ఈ దూకుడు మరింత…