ఈ వేసవిలో టాలీవుడ్ నుంచి రాబోతున్న ఏకైక భారీ చిత్రం.. కన్నప్ప. రాజా సాబ్, విశ్వంభర లాంటి పెద్ద సినిమాలు వేసవి బరి నుంచి తప్పుకున్నట్లు కనిపిస్తుండడంతో ప్రేక్షకుల దృష్టి ‘కన్నప్ప’ మీదికి మళ్లుతోంది. మామూలుగా మంచు విష్ణు సినిమా అంటే అంత హైప్ ఉండేది కాదు కానీ.. ఇందులో ప్రభాస్, మోహన్ లాల్, అక్షయ్ కుమార్ లాంటి బిగ్ స్టార్స్ నటిస్తుండడం.. ఏకంగా వంద కోట్లకు పైగా బడ్జెట్లో సినిమా తెరకెక్కడం.. క్లాసిక్ మూవీ అయిన ‘భక్త కన్నప్ప’కు మోడర్న్ అడాప్షన్ కావడంతో దీనిపై అంచనాలు భారీగానే ఉన్నాయి.
ఈ చిత్రం కోసం విష్ణు ఇంతమంది పెద్ద స్టార్లను ఒప్పించడం విశేషమే. ఐతే మిగతా వాళ్ల సంగతేమో కానీ.. అక్షయ్ కుమార్ను శివుడి పాత్రకు ఒప్పించడానికి మాత్రం విష్ణు చాలానే కష్టపడ్డాడట. ఒక ఇంటర్వ్యూలో విష్ణు మాట్లాడుతూ.. అక్షయ్ ‘కన్నప్ప’లో శివుడి పాత్రను రెండుసార్లు తిరస్కరించినట్లు వెల్లడించాడు. కానీ మూడో ప్రయత్నంలో ఒక పెద్ద డైరెక్టర్ ద్వారా రాయబారం నడిపి.. తన పాత్ర గురించి బలంగా చెప్పి ఒప్పించినట్లు విష్ణు తెలిపాడు.
ఆ డైరెక్టర్ ఎవరన్నది విష్ణు వెల్లడించలేదు. ఈ తరానికి శివుడి పాత్ర గొప్పదనం గురించి చూపించడానికి మీరే సరైన వారని చెప్పి అక్షయ్ని ఒప్పించినట్లు విష్ణు తెలిపాడు. నిజానికి అక్షయ్ ఓకే కావడానికి ముందు ఈ సినిమాలో శివుడి పాత్రను ప్రభాస్ చేస్తాడని ముందు వార్తలు వచ్చాయి. ఐతే ప్రభాస్కు కథ చెప్పినపుడు తనకోసం శివుడి పాత్రనే దృష్టిలో ఉంచుకున్నప్పటికీ అతడికి వేరే పాత్ర నచ్చి తాను ఎంచుకున్నాడని విష్ణు గతంలో చెప్పాడు.
ఆ పాత్ర గురించి సస్పెన్స్ ఇటీవలే వీడింది. రుద్ర అనే శివుడి దూత పాత్రను ప్రభాస్ ఇందులో పోషించిన సంగతి తెలిసిందే. ఏప్రిల్ 25న ‘కన్నప్ప’ ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే.
This post was last modified on February 13, 2025 4:53 pm
వచ్చే వారం ది కేరళ స్టోరీ 2 విడుదల కానుంది. మూడేళ్ళ క్రితం వచ్చిన మొదటి భాగం ఎంత సంచలనం…
రాజకీయ పార్టీలు ఓట్ల కోసం కురిపిస్తున్న ఉచితాల ఆఫర్లపై దేశ సర్వోన్నత న్యాయస్థానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కేవలం…
ఒకప్పుడు శంకర్తో సినిమా చేయడానికి వివిధ ఇండస్ట్రీల టాప్ స్టార్లు, అగ్ర నిర్మాతలు లైన్లో ఉండేవారు. మెగాస్టార్ చిరంజీవి అంతటి…
ఏపీ అసెంబ్లీలో బడ్జెట్ సమావేశాలు ఎగ్గొట్టిన మాజీ సీఎం జగన్…తాపీగా ఈ రోజు మీడియా ముందుకు వచ్చారు. బడ్జెట్ లో…
ఫంకీ ఫలితం త్వరగా తేలిపోవడంతో హీరో విశ్వక్ సేన్, నిర్మాణ సంస్థ సితార హఠాత్తుగా సైలెంటైపోయాయి. ఊరికే లేనిపోని హడావిడి…
వైసీపీ మాజీ ఎంపీ, ఆ పార్టీ మాజీ నేత రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ వ్యవహారం జగన్ హయాంలో దేశవ్యాప్తంగా సంచలనం…