సరిగ్గా పదేళ్ల క్రితం నాటి మాట. 2014 సంవత్సరం. జూనియర్ ఎన్టీఆర్ వరస ఫ్లాపుల్లో ఉన్నాడు. మార్కెట్ తగ్గలేదు కానీ తమ హీరోకు బ్లాక్ బస్టర్ పడటం లేదనే బాధ అభిమానుల్లో కనిపిస్తోంది. దర్శకుడు పూరి జగన్నాధ్ ది కూడా ఇంచుమించు ఇదే పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో వేరే రచయిత వక్కంతం వంశీ ఇచ్చిన కథ బాగా నచ్చడంతో ఈ కాంబోలో సినిమా తీసేందుకు రెడీ అయ్యారు నిర్మాత బండ్ల గణేష్.
తొలుత ప్రకటన వచ్చినప్పుడు అందరూ ఆశ్చర్యపోయారు. ఇది నిజంగా వర్కౌట్ అవుతుందానే అనుమానాలు లేకపోలేదు. కట్ చేస్తే ఇన్స్ పెక్టర్ దయాగా ఒక దయలేని పోలీస్ గా తారక్ క్యారెక్టర్ ని సరికొత్తగా డిజైన్ చేశారు పూరి.
ముందు అనుకున్న దేవిశ్రీ ప్రసాద్ బదులు మిక్కీ జె మేయర్ లాకయ్యాడు. నేపధ్య సంగీతం ఇవ్వడానికి మణిశర్మ ఒప్పుకున్నారు. హీరోయిన్ గా కాజల్ అగర్వాల్ ఫిక్స్. విలన్ గా ప్రకాష్ రాజ్ తప్ప వేరే ఆప్షన్ ఉండేది కాదు. ఎక్కువ ఆలస్యం చేయకుండా షూటింగ్ వేగంగా పూర్తయిపోయింది.
2015 ఫిబ్రవరి 13 ఒకరకంగా డ్రై సీజన్ లో టెంపర్ రిలీజయ్యింది. నెగటివ్ షేడ్స్ తో మొదలయ్యే తారక్ పాత్రను ఫస్ట్ హాఫ్ లో చూసి ప్రేక్షకులు షాక్ తిన్నారు. ఒక అనూహ్యమైన మలుపుతో దయా క్యారెక్టర్ లో వచ్చే మార్పుని పూరి చూపించిన తీరు శభాష్ అనిపించుకుంది. ముఖ్యంగా కోర్టు సన్నివేశాల్లో జూనియర్ నటన గురించి ఎంత చెప్పినా తక్కువే.
మాస్, యాక్షన్, కమర్షియల్ ఎలిమెంట్స్ ఇలా ఏదీ మిస్ కాకుండా టెంపర్ నడిపించిన తీరు విమర్శకులను మెప్పించింది. పాటలు మాస్ కి ఎక్కేశాయి. బిజిఎం కోసమే మళ్ళీ థియేటర్లకు వెళ్లిన వాళ్ళున్నారు. జూనియర్ నటన చూసి ఫ్యాన్స్ తెగ మురిసిపోయారు. డాన్సులు సైతం అంతే స్థాయిలో పండాయి. 74 కోట్లకు పైగా వసూలు చేసింది.
తర్వాత తారక్ ఎన్నో బ్లాక్ బస్టర్స్ చేసి ఉండొచ్చు కానీ టెంపర్ లాంటి ఆల్ ఇన్ వన్ ప్యాకేజీ లాంటి హై ఎనర్జీ సినిమా మరోసారి పడాలి. రీ రిలీజ్ చేయడం కాదు దయా లాంటి మల్టీషేడ్స్ లో యంగ్ టైగర్ ని మరిన్నిసార్లు చూడాలి. దాన్ని ఆయాన్ ముఖర్జీ, ప్రశాంత్ నీల్ ఎవరు నెరవేరుస్తారో మరి.
This post was last modified on February 13, 2025 12:05 pm
పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…
అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…
తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…