ఇది భారతీయ సినీ ప్రేక్షకులందరికీ శుభవార్తే. బాలీవుడ్ సీనియర్ హీరో సంజయ్ దత్ క్యాన్సర్తో పోరాటంలో విజయం సాధించారు. ఈ విషయాన్ని ఆయన స్వయంగా ఓ ప్రకటన ద్వారా వెల్లడించారు. రెండు నెలల కిందట సంజయ్ దత్ అస్వస్థతతో ఆసుపత్రిలో చేరడం, ఆయనకు కరోనా ఉందన్న అనుమానాలు రావడం.. కానీ కరోనా నెగెటివ్గా తేలినప్పటికి తదుపరి పరీక్షల్లో ఊపిరి తిత్తుల క్యాన్సర్ ఉన్నట్లు వెల్లడి కావడం కోట్లాది మంది సంజు అభిమానులను తీవ్ర విచారంలోకి నెట్టింది. క్యాన్సర్ మూడో దశ అనగానే సంజుకు ఏమవుతుందో అన్న ఆందోళన పెరిగిపోయింది.
ఐతే క్యాన్సర్ గురించి తెలియగానే ఆలస్యం చేయకుండా ముంబయిలోనే చికిత్స మొదలుపెట్టారు సంజుకి. కొన్ని రోజులు దుబాయ్లో కూడా ఉండి వచ్చాడు సంజు. అమెరికాకు కూడా వెళ్తాడన్న ప్రచారం జరిగింది.
కానీ చికిత్స విషయంలో ఏ అప్డేట్ ఇవ్వని సంజు.. ఇప్పుడు తాను క్యాన్సర్ పోరాటంలో విజేతగా నిలిచినట్లు సమాచారం పంచుకున్నాడు. గొప్ప యోధులకే దేవుడు అతి పెద్ద పోరాటాలని ఇస్తాడని.. తాను అలాగే పోరాడి ఈ యుద్ధంలో కూడా గెలిచానని అన్నాడు సంజు. తన పిల్లల పుట్టిన రోజుకు తాను ఆరోగ్యవంతుడిని కావడమే కానుక అని అతనన్నాడు.
90వ దశకంలో ముంబయి పేలుళ్లకు సంబంధించిన కేసు విచారణ సందర్భంగా సంజుకు మాఫియాతో సంబంధాలున్నట్లు తేలడం, అతడికి జైలు శిక్ష పడటం దాదాపు నాలుగేళ్ల పాటు జైలు శిక్ష కూడా అనుభవించిన కొన్నేళ్ల కిందటే సంజయ్ బయటికి రావడం తెలిసిందే. ఈ కేసు విచారణ మొదలైనప్పటి నుంచి సంజు మానసిక వేదన ఎదుర్కొన్నాడు. చివరికి దీన్నుంచి బయటపడి కొన్నేళ్లుగా హ్యాపీగా సినిమాలు చేసుకుంటున్న అతడిని క్యాన్సర్ ఆందోళనలోకి నెట్టింది.
ఐతే దీన్నుంచి త్వరగానే బయటపడటం అందరినీ సంతోషాన్నిస్తోంది. ఇటీవలే సంజు కేజీఎఫ్-2 చిత్రీకరణకు కూడా హాజరయ్యాడు. ఆయన మరో అరడజను సినిమాలకు కమిట్మెంట్ ఇచ్చాడు. మొత్తం ప్రాజెక్టుల విలువ రూ.700 కోట్లు కావడం విశేషం.
This post was last modified on October 21, 2020 4:39 pm
నైజామ్ సింగల్ స్క్రీన్ పర్సెంటేజ్ వివాదం ముదిరిపోతోంది. నిన్న శిరీష్, సునీల్ నారంగ్ తదితరులు నిర్వహించిన ఎగ్జిబిటర్ల ప్రెస్ మీట్…
కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు.. ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీలకు కేరళలో తీవ్రనిరసన సెగ తగులుతోంది. రాహుల్-ప్రియాంక.. కేరళ మిమ్మల్ని క్షమించదు.…
నిజమేనండోయ్… జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఏదైనా మాట ఇచ్చారంటే దానిని నెరవేర్చి తీరతారు. ఇందుకు…
కేంద్ర హోం శాఖ సహాయం మంత్రి బండి సంజయ్ తనయుడు బండి భగీరథ్ పై పోక్సో కేసు నమోదైన సంగతి…
తెలంగాణలో సింగిల్ స్క్రీన్లను నడిపించే ఎగ్జిబిటర్లకు, నిర్మాతలకు మధ్య పీటముడి గట్టిగానే బిగుసుకునేలా కనిపిస్తోంది. అద్దె విధానం పక్కన పెట్టి…
కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ తనయుడు బండి భగీరథ్ పై పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో…