సెన్సార్ బోర్డు ఏదైనా సినిమాకు A సర్టిఫికెట్ ఇచ్చిందంటే అది కేవలం పెద్దలకు ఉద్దేశించినది మాత్రమేనని అందరికీ తెలిసిన విషయమే. అయితే పెద్ద మల్టీప్లెక్సులు తప్ప ఈ నిబంధనను పాటించే వాళ్ళు తక్కువ. అందుకే యానిమల్, సలార్ లాంటి బ్లాక్ బస్టర్లను చిన్న పిల్లలు సైతం థియేటర్లలో చూసి ఎంజాయ్ చేశారు.
అలాని వాటిలో మరీ భయపడే కంటెంట్ లేకపోయినా కొంచెం అడల్ట్స్ ఓన్లీ అనిపించే సన్నివేశాలు, వయొలెన్స్ లేకపోలేదు. తాజాగా లైలా కూడా A తెచ్చుకుంది. ఎల్లుండి రిలీజ్ కాబోతున్న ఈ ఎంటర్ టైనర్ మీద గత మూడు రోజులుగా జరుగుతున్న సోషల్ మీడియా రచ్చ చూస్తూనే ఉన్నాం.
నటుడు పృథ్వి చేసిన పొలిటికల్ కామెంట్స్ కి పెద్ద డ్యామేజే జరిగింది. కాకపోతే నెగటివ్ అయినా సరే లైలాకు పబ్లిసిటీ కూడా జరిగిపోయింది. సినిమా ఎక్కువ శాతం ఆడియన్స్ దృష్టిలో పడేందుకు దోహదం చేసింది. ఇదంతా బాగానే ఉంది కానీ లైలాకు ఏ సర్టిఫికెట్ ఏ మేరకు ప్రతిబంధకంగా మారుతుందో వేచి చూడాలి.
ఎందుకంటే ప్రమోషన్ల కోసం సంక్రాంతికి వస్తున్నాం చైల్డ్ ఆర్టిస్ట్ బుల్లిరాజుని వాడారు. తీరా చూస్తేనేమో చిన్న పిల్లలకు లైలా థియేటర్లలో నో ఎంట్రీ. అంటే బూతు జోకులు, ఎపిసోడ్లు ఎన్నో కొన్ని ఉన్నాయనేగా అర్థం. విశ్వక్ కూడా పలు ఇంటర్వ్యూలలో అదే చెప్పాడు.
సో యునానిమస్ టాక్ రావడమనేది లైలాకు చాలా కీలకం. పోటీ పెద్దగా లేదు. బ్రహ్మ ఆనందం రేసులో ఉంది కానీ క్యాస్టింగ్ దృష్ట్యా అదిరిపోయిందనే మాట వినిపిస్తే తప్ప జనాలు అదే పనిగా టికెట్లు కొనడం డౌటే. ఇంకోవైపు రీ రిలీజుల తాకిడి ఎక్కువగా ఉంది. ఆరంజ్ తో సహా నాలుగైదు ఒకేసారి వదులుతున్నారు.
వీటి ఎఫెక్ట్ మరీ తీవ్రంగా ఉండకపోవచ్చు. ఒకవేళ లైలాలో కనక డబుల్ మీనింగ్ డోస్ ఎక్కువగా ఉందనే టాక్ వస్తే మాత్రం ఫ్యామిలీ సెక్షన్ దూరంగా నిలబడే ప్రమాదముంది . యూత్ కైనా సరే జోక్స్ తో పాటు కంటెంటూ బలంగా ఉండాలి. మరి ఆడవేషంలో లైలా ఇవన్నీ ఎలా నెగ్గుకొస్తాడో చూడాలి.
This post was last modified on February 12, 2025 11:44 am
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…