Movie News

అక్కినేని విజయాలకు ముహూర్తం కుదిరింది

నిన్న జరిగిన తండేల్ సక్సెస్ మీట్ కు ముఖ్య అతిథిగా విచ్చేసిన నాగార్జున అభిమానులను ఉద్దేశించి మాట్లాడుతూ తమ విజయాలకు 2025 ముహూర్తం అని చెప్పడమే కాకుండా నాగచైతన్యతో వస్తున్నాం, కొడుతున్నామని అనిపించడం ఫ్యాన్స్ చప్పట్లతో హోరెత్తిపోయేలా చేసింది.

నిజానికిది అక్కినేని కుటుంబం గత కొంత కాలంగా ఎదురు చూసిన ఘట్టం. నాగార్జునకేమో బ్లాక్ బస్టర్లు పడటం లేదు. గత కొన్నేళ్లలో సోగ్గాడే చిన్ని నాయనా, బంగార్రాజు, నా సామిరంగా తప్ప చెప్పుకోదగ్గ హిట్లు లేవు. లేనిపోని ప్రయోగాలు చేసి ఇంగ్లీష్ టైటిల్స్ తో డిజాస్టర్లు మూటగట్టుకున్నారు. గత ఏడాది సంక్రాంతి తర్వాత ఏడాది గ్యాప్ వచ్చేసింది.

ఈ సంవత్సరం ఒకటి కాదు ఏకంగా రెండు ప్యాన్ ఇండియా సినిమాల్లో భాగమయ్యారు. కుబేర మెయిన్ హీరో ధనుష్ అయినప్పటికీ నాగార్జున ప్రాధాన్యం, పాత్రకున్న ప్రత్యేకత దీన్ని మల్టీస్టారర్ స్థాయికి తీసుకెళ్తున్నాయని ఇన్ సైడ్ టాక్. దర్శకుడు శేఖర్ కమ్ముల నుంచి ఊహించని సర్ప్రైజ్ ఉంటుందని అంటున్నారు.

రజనీకాంత్ కూలిలో సైతం విక్రమ్ రోలెక్స్ లాగా నాగ్ కు చాలా పవర్ ఫుల్ క్యారెక్టర్ ని లోకేష్ కనగరాజ్ డిజైన్ చేసినట్టుగా చెన్నై వర్గాల కథనం. సో ఈ రెండు కనక వర్కౌట్ అయితే నాగ్ కంబ్యాక్ మాములుగా ఉండబోవడం లేదు. ఆలస్యమవుతున్నా సరే కథల ఎంపికలో జాగ్రత్త వహిస్తున్నారు.

ఇక అఖిల్ విషయానికి వస్తే ఏజెంట్ గాయం నుంచి కోలుకుని కొత్త చిత్రం మొదలుపెట్టేందుకు ఏడాదికి పైగానే పట్టింది. ఇటీవలే లెనిన్ మొదలుపెట్టారు. కంటెంట్ గురించి లీక్స్ ఆసక్తికరంగా ఉంటున్నాయి. రెగ్యులర్ జానర్ కాకుండా దర్శకుడు మురళికిషోర్ అబ్బూరు ఒక సరికొత్త బ్యాక్ డ్రాప్ తీసుకున్నారట.

కుబేర, కూలి, లెనిన్ అన్నీ 2025లోనే రిలీజవుతాయి. చైతుకి తండేల్ బ్లాక్ బస్టర్ పడింది. విరూపాక్ష ఫేమ్ కార్తీక్ దండు దర్శకత్వంలో రూపొందే మిస్టిక్ థ్రిల్లర్ కనక వేగంగా షూట్ జరుపుకుంటే ఈ సంవత్సరం రెండోసారి తన దర్శనం ఉంటుంది. లేదంటే కాస్త లాంగ్ వెయిటింగ్ తప్పదు.

మొత్తానికి నాగ్ చెప్పినట్టు 2025 నిజంగానే ముహూర్తమని చెప్పొచ్చు. నాగార్జున, అఖిల్, నాగ చైతన్య ముగ్గురు ఎంచుకుంటున్న కాంబోలు వైవిధ్యంగా అనిపించడమే కాక ప్రేక్షకుల్లో అంచనాలు రేకెత్తించేలా కనిపిస్తున్నాయి. మొహమాటలకు పోకుండా, తొందరపడకుండా ఎంపికలో తీసుకుంటున్న జాగ్రత్తలు మంచి ఫలితాలు ఇచ్చేలా ఉన్నాయి.

సుమంత్, సుశాంత్ కూడా కంబ్యాక్ కోసం ప్లాన్ చేసుకుంటున్నారు. ఇంకోవైపు అన్నపూర్ణ స్టూడియోస్ డాల్బీ విజన్ టెక్నాలజీని ఇండియాకు తీసుకొచ్చి అటు ప్రొడక్షన్ లోనూ సరికొత్త మైలురాళ్లను నెలకొలుపుతోంది. ఇవన్నీ ఫ్యాన్స్ ని ఆనందంలో ముంచెత్తేవే.

This post was last modified on February 12, 2025 11:42 am

Share
Show comments
Published by
Kumar

Recent Posts

‘ప్యారడైజ్’ బిర్యాని… ‘సంపూ’ర్ణ వాడకం అంటే ఇది

దసరా తర్వాత న్యాచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కలయికలో తెరకెక్కుతున్న ది ప్యారడైజ్ షూటింగ్ నిర్విరామంగా జరుగుతోంది.…

20 minutes ago

జనసేనలోకి కాంగ్రెస్ నేత – షర్మిల ఎఫెక్టేనా?

రాజ‌కీయాల్లో మార్పులు జ‌రుగుతూనే ఉంటాయి. ప్ర‌త్య‌ర్థులు కూడా మిత్రులుగా మారుతారు. ఇలాంటి పరిణామ‌మే ఉమ్మ‌డి కృష్నాజిల్లాలో కూడా చోటు చేసుకుంటోంది.…

2 hours ago

బన్నీ-అట్లీ… అప్పుడే ఎందుకీ కన్ఫ్యూజన్

ప్రస్తుతం ఇండియాలో తెరకెక్కుతున్న చిత్రాల్లో అత్యంత హైప్ ఉన్న వాటిలో అల్లు అర్జున్, అట్లీ సినిమా ఒకటి. ఏకంగా రూ.800…

2 hours ago

అవతార్ 3 టాక్ ఏంటి తేడాగా ఉంది

భారీ అంచనాల మధ్య అవతార్ ఫైర్ అండ్ యాష్ విడుదలయ్యింది. ఇవాళ రిలీజులు ఎన్ని ఉన్నా థియేటర్లలో జనం నిండుగా…

4 hours ago

జననాయకుడుకి ట్విస్ట్ ఇస్తున్న పరాశక్తి ?

మన దగ్గర అయిదు టాలీవుడ్ స్ట్రెయిట్ సినిమాలు సంక్రాంతికి తలపడుతున్నా సరే పెద్దగా టెన్షన్ వాతావరణం లేదు కానీ తమిళంలో…

5 hours ago

ప్రియురాలి మాయలో మాస్ ‘మహాశయుడు’

గత కొన్నేళ్లుగా ప్రయోగాలు, రొటీన్ మాస్ మసాలాలతో అభిమానులే నీరసపడేలా చేసిన రవితేజ ఫైనల్ గా గేరు మార్చేశాడు. సంక్రాంతికి…

5 hours ago