Movie News

అక్కినేని విజయాలకు ముహూర్తం కుదిరింది

నిన్న జరిగిన తండేల్ సక్సెస్ మీట్ కు ముఖ్య అతిథిగా విచ్చేసిన నాగార్జున అభిమానులను ఉద్దేశించి మాట్లాడుతూ తమ విజయాలకు 2025 ముహూర్తం అని చెప్పడమే కాకుండా నాగచైతన్యతో వస్తున్నాం, కొడుతున్నామని అనిపించడం ఫ్యాన్స్ చప్పట్లతో హోరెత్తిపోయేలా చేసింది.

నిజానికిది అక్కినేని కుటుంబం గత కొంత కాలంగా ఎదురు చూసిన ఘట్టం. నాగార్జునకేమో బ్లాక్ బస్టర్లు పడటం లేదు. గత కొన్నేళ్లలో సోగ్గాడే చిన్ని నాయనా, బంగార్రాజు, నా సామిరంగా తప్ప చెప్పుకోదగ్గ హిట్లు లేవు. లేనిపోని ప్రయోగాలు చేసి ఇంగ్లీష్ టైటిల్స్ తో డిజాస్టర్లు మూటగట్టుకున్నారు. గత ఏడాది సంక్రాంతి తర్వాత ఏడాది గ్యాప్ వచ్చేసింది.

ఈ సంవత్సరం ఒకటి కాదు ఏకంగా రెండు ప్యాన్ ఇండియా సినిమాల్లో భాగమయ్యారు. కుబేర మెయిన్ హీరో ధనుష్ అయినప్పటికీ నాగార్జున ప్రాధాన్యం, పాత్రకున్న ప్రత్యేకత దీన్ని మల్టీస్టారర్ స్థాయికి తీసుకెళ్తున్నాయని ఇన్ సైడ్ టాక్. దర్శకుడు శేఖర్ కమ్ముల నుంచి ఊహించని సర్ప్రైజ్ ఉంటుందని అంటున్నారు.

రజనీకాంత్ కూలిలో సైతం విక్రమ్ రోలెక్స్ లాగా నాగ్ కు చాలా పవర్ ఫుల్ క్యారెక్టర్ ని లోకేష్ కనగరాజ్ డిజైన్ చేసినట్టుగా చెన్నై వర్గాల కథనం. సో ఈ రెండు కనక వర్కౌట్ అయితే నాగ్ కంబ్యాక్ మాములుగా ఉండబోవడం లేదు. ఆలస్యమవుతున్నా సరే కథల ఎంపికలో జాగ్రత్త వహిస్తున్నారు.

ఇక అఖిల్ విషయానికి వస్తే ఏజెంట్ గాయం నుంచి కోలుకుని కొత్త చిత్రం మొదలుపెట్టేందుకు ఏడాదికి పైగానే పట్టింది. ఇటీవలే లెనిన్ మొదలుపెట్టారు. కంటెంట్ గురించి లీక్స్ ఆసక్తికరంగా ఉంటున్నాయి. రెగ్యులర్ జానర్ కాకుండా దర్శకుడు మురళికిషోర్ అబ్బూరు ఒక సరికొత్త బ్యాక్ డ్రాప్ తీసుకున్నారట.

కుబేర, కూలి, లెనిన్ అన్నీ 2025లోనే రిలీజవుతాయి. చైతుకి తండేల్ బ్లాక్ బస్టర్ పడింది. విరూపాక్ష ఫేమ్ కార్తీక్ దండు దర్శకత్వంలో రూపొందే మిస్టిక్ థ్రిల్లర్ కనక వేగంగా షూట్ జరుపుకుంటే ఈ సంవత్సరం రెండోసారి తన దర్శనం ఉంటుంది. లేదంటే కాస్త లాంగ్ వెయిటింగ్ తప్పదు.

మొత్తానికి నాగ్ చెప్పినట్టు 2025 నిజంగానే ముహూర్తమని చెప్పొచ్చు. నాగార్జున, అఖిల్, నాగ చైతన్య ముగ్గురు ఎంచుకుంటున్న కాంబోలు వైవిధ్యంగా అనిపించడమే కాక ప్రేక్షకుల్లో అంచనాలు రేకెత్తించేలా కనిపిస్తున్నాయి. మొహమాటలకు పోకుండా, తొందరపడకుండా ఎంపికలో తీసుకుంటున్న జాగ్రత్తలు మంచి ఫలితాలు ఇచ్చేలా ఉన్నాయి.

సుమంత్, సుశాంత్ కూడా కంబ్యాక్ కోసం ప్లాన్ చేసుకుంటున్నారు. ఇంకోవైపు అన్నపూర్ణ స్టూడియోస్ డాల్బీ విజన్ టెక్నాలజీని ఇండియాకు తీసుకొచ్చి అటు ప్రొడక్షన్ లోనూ సరికొత్త మైలురాళ్లను నెలకొలుపుతోంది. ఇవన్నీ ఫ్యాన్స్ ని ఆనందంలో ముంచెత్తేవే.

This post was last modified on February 12, 2025 11:42 am

Share
Show comments
Published by
Kumar

Recent Posts

సాయిపల్లవికి ‘ఒక రోజు’ షాక్ ఇస్తుందా

చాలా సెలెక్టివ్ గా సినిమాలు చేసే సాయిపల్లవి కాంబోల కన్నా ఎక్కువగా కంటెంట్ కి ప్రాధాన్యం ఇవ్వడం అందరికీ తెలిసిన…

2 hours ago

టీడీపీ మహిళా ఎమ్మెల్యే పీఏగా ట్రాన్స్ జెండర్..

గుంటూరు పశ్చిమ నియోజకవర్గం టీడీపీ ఎమ్మెల్యే గళ్లా మాధవి తీసుకున్న వినూత్న నిర్ణయం చర్చనీయాంశంగా మారింది. బీకాం చదువుకున్న ఓ…

4 hours ago

జేడీ వదులుకున్న కల్ట్ బ్లాక్‌బస్టర్

ఒక హీరో చేయాల్సిన సినిమా ఇంకో హీరో చేతికి వెళ్లడం సినీ పరిశ్రమలో కామన్ వ్యవహారం. ఇలా మిస్ అయిన…

4 hours ago

దేవి 2… రాజుగారికి పెద్ద ఛాలెంజ్

ఇరవై ఏడు సంవత్సరాల క్రితం వచ్చిన దేవి సినిమాకు టాలీవుడ్ లో ఒక ప్రత్యేక స్థానం ఉంది. అమ్మోరు లాంటి…

4 hours ago

“అస‌లు సిస‌లు ప్ర‌జా ద్రోహి కేజ్రీవాలే“

ఆమ్ ఆద్మీ పార్టీ క‌న్వీన‌ర్‌, ఢిల్లీ మాజీముఖ్య‌మంత్రి అర‌వింద్ కేజ్రీవాల్‌పై అదే పార్టీ నుంచి ఎంపీగా విజ‌యం ద‌క్కించుకుని.. ప్ర‌స్తుతం…

5 hours ago

దిల్ రాజు భలే తప్పించుకున్నారే…

తాము నిర్మించే సినిమాలు ఎంత నష్టం తెచ్చిపెట్టినా… తమను ఎంతగా కుదేలు చేసినా.. వాటి గురించి ఓపెన్ అవ్వడానికి నిర్మాతలు…

6 hours ago