రామరాజు ఫర్ భీమ్ టీజర్ కోసం ప్రేక్షకులు ఎంతగా ఎదురు చూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇంకొక్క రోజులో ఆ టీజర్ రాబోతోంది. ఇప్పటికే భారీగా ఉన్న అంచనాల్ని మరింత పెంచేలా కౌంట్ డౌన్ నడిపిస్తోంది చిత్ర బృందం. తాజాగా ఉత్కంఠను మరింత పెంచే అప్డేట్తో వచ్చాడు రామ్ చరణ్. రేపు రాబోయే టీజర్ ఎలా ఉంటుందో చిన్న గ్లింప్స్ లాంటిది చూపించాడు.
కొమరం భీమ్ బల్లెం తీసుకుని శత్రువుల మీదికి దండెత్తబోతున్నట్లుగా ఉన్న ఒక షార్ట్ టీజర్ చూపించాడు చరణ్. కొన్ని సెకన్లే ఉన్న ఈ వీడియో టీజర్ పట్ల ఎగ్జైట్మెంట్ను ఇంకా పెంచుతోంది. భీమ్ టీజర్లో విజువల్స్, బ్యాగ్రౌండ్ స్కోర్ రోమాలు నిక్కబొడుచుకునేలా చేయడం ఖాయమనిపిస్తోంది. ఐతే ఈ వీడియో రిలీజ్ చేస్తూ తారక్ను ఉడికించేలా చరణ్ ఒక కామెంట్ కూడా చేశాడు.
మార్చి 27న ‘భీమ్ ఫర్ రామరాజు’ టీజర్ రిలీజ్ చేయడంలో కొంత ఆలస్యం జరిగింది. చెప్పిన టైంకి కాకుండా కొన్ని గంటల తర్వాత ఆ టీజర్ రిలీజ్ చేశారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని.. నీలాగే నేను ఆలస్యం చేయను, రేపు చెప్పిన టైంకి వచ్చేస్తా అంటూ తారక్ను ఉద్దేశించి ట్వీట్ వేశాడు చరణ్.
ఐతే దీనికి తారక్ కూడా రివర్స్ పంచ్ గట్టిగానే వేశాడు. తన పుట్టిన రోజైన మే 20న రావాల్సిన టీజర్ను ఇప్పుడు రిలీజ్ చేస్తుండటాన్ని పరోక్షంగా ప్రస్తావిస్తూ ఆల్రెడీ ఐదు నెలలు ఆలస్యమైందని అన్నాడు. అయినా జక్కన్నతో డీల్ చేసేటపుడు జాగ్రత్తగా ఉండాలని, ఏమైనా జరగొచ్చిన అనడం ద్వారా రేపు ఆలస్యమైనా అవ్వొచ్చని పరోక్షంగా సంకేతాలిచ్చాడు తారక్. ముందు అన్న ప్రకారం అయితే గురువారం ఉదయం 11 గంటలకు భీమ్ టీజర్ రావాల్సి ఉంది. రామరాజు టీజర్కు తారక్ వాయిస్ ఓవర్ ఇచ్చినట్లే.. ఈ టీజర్కు చరణ్ వాయిస్ ఇవ్వనున్న సంగతి తెలిసిందే.
This post was last modified on October 21, 2020 2:30 pm
సౌత్ ఇండియన్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్లలో ఒకడైన దేవిశ్రీ ప్రసాద్ వయసు ప్రస్తుతం 46 ఏళ్లు. కానీ ఇంతలోనే అతను 27 ఏళ్ల…
ఎట్టకేలకు ప్రశాంత్ కిషోర్ ఎన్నికల్లో గెలిచాడు. జులై 30 వ తేదీన బీహార్ ఉప ఎన్నికల్లో బంకీపూర్ నుంచి ఎన్నికల…
ఒకపెద్ద సినీ కుటుంబం నుంచి పరిచయం అయ్యే కొత్త హీరో మాస్ ఇమేజ్ కోసమే తపన పడతాడు. కానీ వరుణ్ తేజ్ మాత్రం…
భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఓ సంచలన తీర్పును వెలువరించింది. మారుతున్నకాలానికి అనుగుణంగా మనిషి జీవనయానంలోనూ మార్పులు చోటుచేసుకుంటూ వస్తోంటే... ఆ…
అదేంటో స్పైడర్ మ్యాన్ జ్వరం మనోళ్లకు ఓ రేంజ్ లో పట్టేసింది. భాషతో సంబంధం లేకుండా ముంబై నుంచి మచిలీపట్నం…
వైసీపీ అధినేత జగన్ పలువురు కీలక రాజకీయ వ్యూహకర్తలతో భేటీ అయ్యారా? వచ్చే ఎన్నికలు.. దీనికి ముందు ఆయన చేయనున్న…