రామరాజు ఫర్ భీమ్ టీజర్ కోసం ప్రేక్షకులు ఎంతగా ఎదురు చూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇంకొక్క రోజులో ఆ టీజర్ రాబోతోంది. ఇప్పటికే భారీగా ఉన్న అంచనాల్ని మరింత పెంచేలా కౌంట్ డౌన్ నడిపిస్తోంది చిత్ర బృందం. తాజాగా ఉత్కంఠను మరింత పెంచే అప్డేట్తో వచ్చాడు రామ్ చరణ్. రేపు రాబోయే టీజర్ ఎలా ఉంటుందో చిన్న గ్లింప్స్ లాంటిది చూపించాడు.
కొమరం భీమ్ బల్లెం తీసుకుని శత్రువుల మీదికి దండెత్తబోతున్నట్లుగా ఉన్న ఒక షార్ట్ టీజర్ చూపించాడు చరణ్. కొన్ని సెకన్లే ఉన్న ఈ వీడియో టీజర్ పట్ల ఎగ్జైట్మెంట్ను ఇంకా పెంచుతోంది. భీమ్ టీజర్లో విజువల్స్, బ్యాగ్రౌండ్ స్కోర్ రోమాలు నిక్కబొడుచుకునేలా చేయడం ఖాయమనిపిస్తోంది. ఐతే ఈ వీడియో రిలీజ్ చేస్తూ తారక్ను ఉడికించేలా చరణ్ ఒక కామెంట్ కూడా చేశాడు.
మార్చి 27న ‘భీమ్ ఫర్ రామరాజు’ టీజర్ రిలీజ్ చేయడంలో కొంత ఆలస్యం జరిగింది. చెప్పిన టైంకి కాకుండా కొన్ని గంటల తర్వాత ఆ టీజర్ రిలీజ్ చేశారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని.. నీలాగే నేను ఆలస్యం చేయను, రేపు చెప్పిన టైంకి వచ్చేస్తా అంటూ తారక్ను ఉద్దేశించి ట్వీట్ వేశాడు చరణ్.
ఐతే దీనికి తారక్ కూడా రివర్స్ పంచ్ గట్టిగానే వేశాడు. తన పుట్టిన రోజైన మే 20న రావాల్సిన టీజర్ను ఇప్పుడు రిలీజ్ చేస్తుండటాన్ని పరోక్షంగా ప్రస్తావిస్తూ ఆల్రెడీ ఐదు నెలలు ఆలస్యమైందని అన్నాడు. అయినా జక్కన్నతో డీల్ చేసేటపుడు జాగ్రత్తగా ఉండాలని, ఏమైనా జరగొచ్చిన అనడం ద్వారా రేపు ఆలస్యమైనా అవ్వొచ్చని పరోక్షంగా సంకేతాలిచ్చాడు తారక్. ముందు అన్న ప్రకారం అయితే గురువారం ఉదయం 11 గంటలకు భీమ్ టీజర్ రావాల్సి ఉంది. రామరాజు టీజర్కు తారక్ వాయిస్ ఓవర్ ఇచ్చినట్లే.. ఈ టీజర్కు చరణ్ వాయిస్ ఇవ్వనున్న సంగతి తెలిసిందే.
This post was last modified on October 21, 2020 2:30 pm
తమిళగ వెట్రి కళగం అధినేత జోసెఫ్ విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయడం ఖరారైంది. ఆరు రోజులుగా ట్విస్టులతో సాగిన రాజకీయ…
రాజకీయాల్లో అవకాశాలు రావడమే అరుదు. వచ్చిన వాటిని వినియోగించుకోవాల్సిన అవసరం.. వాటిని పట్టుకుని ఎదగాల్సిన అవసరం కూడా పార్టీలకు, నాయకులకు…
తమిళనాడు కొత్త ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ కొత్త సినిమా జన నాయకుడు విడుదలకు మార్గం సుగమమయ్యింది. సిఎం పదవిని చేపట్టేందుకు…
పదమూడేళ్ల క్రితం ఇండస్ట్రీకి కొత్త ట్రెండ్ తీసుకొచ్చిన దృశ్యం ఫ్రాంచైజ్ లో మూడో భాగం మే 21 విడుదల కానుంది.…
తమిళనాడు రాజకీయాల్లో చోటు చేసుకున్న అనిశ్చిత పరిస్థితి తొలిగిపోయింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అతి పెద్ద పార్టీగా అవతరించిన…
దేశ ప్రధాని నరేంద్ర మోడీ.. ఆదివారం హైదరాబాద్లో పర్యటించనున్నారు. వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు. అయితే.. ఈ పర్యటనలో మరో…