కెరీర్ ఎప్పుడో మొదలైనా, ఎన్నో హిట్లు చూసినా వంద కోట్ల క్లబ్ అందని ద్రాక్షగా నిలిచిన నాగచైతన్యకు అది తండేల్ రూపంలో దక్కడం నాగార్జునకి ఎక్కడలేని పుత్రోత్సాహాన్ని ఇస్తోంది. ఇంతకు ముందు చైతు ఎన్నో విజయాలు చూశాడు కానీ ఇప్పుడున్న స్టేజి వేరు. వరస ఫ్లాపులు మార్కెట్ ని దెబ్బ కొట్టాయి.
గుడ్డి నమ్మకంతో తమిళ హిందీ దర్శకులను నమ్మితే కస్టడీ, లాల్ సింగ్ చద్దా రూపంలో డిజాస్టర్లు ఇచ్చారు. అందుకే తండేల్ కోసం ఒళ్ళు హూనం చేసుకున్నాడు. ఏడాదిన్నర వేరే ఏ కథ వినకుండా, ఏ సినిమా ఒప్పుకోకుండా దీని మీదే మనసు లగ్నం చేశాడు. ఫలితంగానే అదిరిపోయే సక్సెస్ దక్కింది.
కొడుకుని ఎక్కువ పొగుడుకోకూడదనే ఉద్దేశంతో నాన్నగారు గుర్తొచ్చారని చెప్పిన నాగార్జున టీమ్ ని ప్రశంసలతో ముంచెత్తారు. చందూ మొండేటికి తమ ఇద్దరిలో ఎవరంటే ఇష్టమైనా తనకు మాత్రం వ్యక్తిగతంగా నువ్వే ఇష్టమని సభాముఖంగా చెప్పడం దర్శకుడి సంతోషాన్ని రెట్టింపు చేసింది.
హిందీ గజిని రూపంలో తొలి వంద కోట్ల మూవీ ఇచ్చిన ఘనత అల్లు అరవింద్ కు దక్కుతుందని కితాబు ఇచ్చారు. బన్నీ వాస్ గురించి ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ తమ కుటుంబానికి 100 పెర్సెంట్ లవ్, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్, తండేల్ ఇలా ఒకదాన్ని మించి మరొకటి సూపర్ హిట్స్ ఇవ్వడం గురించి అభినందనలు తెలిపారు.
ఇక దేవిశ్రీ ప్రసాద్ గురించి మాట్లాడుతూ తమ కాంబోలో ఎన్నో మర్చిపోయేల్ని ఆల్బమ్స్ వచ్చాయని, తనకో లవ్ స్టోరీ చెప్పమని వేరొకరితో అన్న సందర్భాన్ని గుర్తు చేస్తూ ఈ వయసులో ఇక సాధ్యం కాదని చెప్పడం నవ్వులను పూయించింది.
నటీనటులను, సాంకేతిక వర్గాన్ని అభినందించిన నాగ్ చాలా గ్యాప్ తర్వాత కొడుకు అందుకున్న సక్సెస్ ని ఆస్వాదిస్తున్న మాట వాస్తవం. గత ఏడాది నా సామిరంగా బాగానే ఆడినప్పటికీ అదేమీ వంద కోట్ల మైలురాయికి వెళ్ళలేదు. కానీ తండేల్ దాన్ని సాధిస్తోంది. అందుకే అభిమానులతో పాటు చైతు కుటుంబ సభ్యులు ప్రతిఒక్కరిలో సంతోషం తొణికిసలాడుతోంది.
This post was last modified on February 11, 2025 9:44 pm
దేశంలో అత్యధిక సినీ అభిమానం ఉన్న ప్రేక్షకులుగా తెలుగు ఆడియన్సుకి పేరుంది. తెలుగు రాష్ట్రాలు రెంటినీ కలిపి ఒక యూనిట్…
జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.30 కోట్ల నిధులను…
అటు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి ఏపీకి నిధులు మంజూరు అయ్యేలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇటు తన శాఖలను సమర్థవంతంగా…
నిన్న జరిగిన ఛాంపియన్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు రామ్ చరణ్ ముఖ్యఅతిధిగా రావడం హైప్ పరంగా దానికి మంచి…
వైసీపీ హయాంలో విశాఖపట్నంలోని ప్రఖ్యాత పర్యాటక ప్రాంతం రుషికొండను తొలిచి.. నిర్మించిన భారీ భవనాల వ్యవహారం కొలిక్కి వస్తున్నట్టు ప్రభుత్వ…
భారీ అంచనాలతో గత వారం విడుదలైన అఖండ 2 తాండవం నెమ్మదిగా సాగుతోంది. రికార్డులు బద్దలవుతాయని అభిమానులు ఆశిస్తే ఇప్పుడు…