పక్క భాష నటుడని కాదు కానీ మన ప్రేక్షకులకూ బాగా పరిచయమున్న ధనుష్ ని కొన్ని విషయాల్లో ప్రత్యేకంగా ప్రశంసించాలి. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒక మీడియం రేంజ్ హీరో అయినా ఒకే టైంలో ఒక సినిమా చేయడమే మహా కష్టంగా ఫీలవుతున్నారు. షూటింగ్ చేయడం దగ్గరి నుంచి ప్రమోషన్ల దాకా ఒకేదాని మీద దృష్టి పెట్టాలనే ఉద్దేశంతో దానికి అనుగుణంగా ప్లాన్ చేసుకుంటున్నారు. అలాంటిది నటిస్తూనే దర్శకత్వం చేయడమనేది కత్తి మీద సాము. ధనుష్ ఈ రెండు పడవల ప్రయాణాన్ని చాలా సాఫీగా నడిపించడమే తన గురించి ప్రస్తావించడానికి కారణమయ్యింది. కాస్త వివరంగా చూస్తే మీకే అర్థమవుతుంది.
గత ఏడాది జూలైలో రాయన్ విడుదలయ్యింది. ధనుష్ హీరోగా నటించడంతో పాటు డైరెక్షన్ కూడా చేశాడు. తెలుగులో జస్ట్ యావరేజ్ అనిపించుకుంది కానీ తమిళంలో బాగానే ఆడింది. తనతో పాటు సందీప్ కిషన్, అపర్ణ బాలమురళిలకు పేరు తెచ్చింది. కట్ చేస్తే సంవత్సరం తిరక్కుండానే ధనుష్ తాను జస్ట్ ఒక చిన్న పాత్ర పోషించి కుర్రకారుతో తీసి దర్శకత్వం వహించిన జాబిలమ్మా నీకు అంత కోపమా ఫిబ్రవరి 21 రిలీజ్ కు రెడీ అయ్యింది. ట్రెండీ లవ్ ఎలిమెంట్స్ తో రూపొందిన కంటెంట్ కావడంతో యూత్ కి బాగానే రీచ్ అయ్యేలా ఉందని ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. ఇది చివరి దశలో ఉన్నప్పుడు ఇడ్లి కడాయ్ మొదలెట్టాడు.
ఇది ఏప్రిల్ 10 థియేటర్లకు వచ్చేందుకు సమాయత్తమవుతోంది. వాయిదా పడొచ్చనే టాక్ ఉంది కానీ ఇంకా నిర్ధారణ కాలేదు. అంటే కేవలం పది నెలల కాలంలో మూడు సినిమాలకు దర్శకత్వం వహించి వాటిలో రెండింటికి హీరోగా చేయడమంటే పెద్ద ఫీటే. ఒకప్పుడు స్వర్గీయ ఎన్టీఆర్, సూపర్ స్టార్ కృష్ణ లాంటి వాళ్ళు ఇలా రెండు బాధ్యతలని గొప్పగా నిర్వర్తించేవాళ్ళు. కానీ ఇప్పుడా ట్రెండ్ లేదు. కానీ ధనుష్ మాత్రం నాకది సాధ్యమని చేసి చూపిస్తున్నాడు. అన్నట్టు యుగానికి ఒక్కడు 2ని తనతోనే తీసేందుకు అన్నయ్య సెల్వ రాఘవన్ ప్లాన్ చేసుకుంటున్నారు. ఎప్పుడనేది చెప్పలేదు కానీ త్వరలోనే సెట్స్ కు వెళ్లనుంది.
This post was last modified on February 11, 2025 12:02 pm
కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ తనయుడు బండి భగీరథ్ పై పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో…
ఇటీవల ముగిసిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలలో టీవీకే అతిపెద్ద పార్టీగా అవతరించింది. 108 సీట్లు గెలుచుకున్న విజయ్ పార్టీ…మ్యాజిక్…
పొట్లూరి వరప్రసాద్.. ఒకప్పుడు తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో గట్టిగా వినిపించిన పేరు. రవితేజ బ్లాక్ బస్టర్ మూవీ ‘బలుపు’తో ఆయన…
టీవీకే అధినేత, తమిళనాడు సీఎం విజయ్ తీసుకుంటున్న నిర్ణయాలపై ప్రశంసలు వస్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా పాఠశాలలు, దేవాలయాల సమీపంలో…
రాత్రి వేళ గస్తీ కాసేందుకు దేశం కాని దేశం వస్తున్న నేపాలీలు ఇప్పుడు నేరాల్లో ఆరితేరిపోయారని చెప్పాలి. గుర్ఖాలుగా ఎంట్రీ…
చట్టం గెలిచిందనుకున్న ప్రతీసారి పైరసీ కొత్త అవతారం ఎత్తుతోంది. ఐబొమ్మ ఆపరేటర్ రవి అరెస్ట్, సైట్ క్లోజ్ అని పోలీసులు…