పక్క భాష నటుడని కాదు కానీ మన ప్రేక్షకులకూ బాగా పరిచయమున్న ధనుష్ ని కొన్ని విషయాల్లో ప్రత్యేకంగా ప్రశంసించాలి. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒక మీడియం రేంజ్ హీరో అయినా ఒకే టైంలో ఒక సినిమా చేయడమే మహా కష్టంగా ఫీలవుతున్నారు. షూటింగ్ చేయడం దగ్గరి నుంచి ప్రమోషన్ల దాకా ఒకేదాని మీద దృష్టి పెట్టాలనే ఉద్దేశంతో దానికి అనుగుణంగా ప్లాన్ చేసుకుంటున్నారు. అలాంటిది నటిస్తూనే దర్శకత్వం చేయడమనేది కత్తి మీద సాము. ధనుష్ ఈ రెండు పడవల ప్రయాణాన్ని చాలా సాఫీగా నడిపించడమే తన గురించి ప్రస్తావించడానికి కారణమయ్యింది. కాస్త వివరంగా చూస్తే మీకే అర్థమవుతుంది.
గత ఏడాది జూలైలో రాయన్ విడుదలయ్యింది. ధనుష్ హీరోగా నటించడంతో పాటు డైరెక్షన్ కూడా చేశాడు. తెలుగులో జస్ట్ యావరేజ్ అనిపించుకుంది కానీ తమిళంలో బాగానే ఆడింది. తనతో పాటు సందీప్ కిషన్, అపర్ణ బాలమురళిలకు పేరు తెచ్చింది. కట్ చేస్తే సంవత్సరం తిరక్కుండానే ధనుష్ తాను జస్ట్ ఒక చిన్న పాత్ర పోషించి కుర్రకారుతో తీసి దర్శకత్వం వహించిన జాబిలమ్మా నీకు అంత కోపమా ఫిబ్రవరి 21 రిలీజ్ కు రెడీ అయ్యింది. ట్రెండీ లవ్ ఎలిమెంట్స్ తో రూపొందిన కంటెంట్ కావడంతో యూత్ కి బాగానే రీచ్ అయ్యేలా ఉందని ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. ఇది చివరి దశలో ఉన్నప్పుడు ఇడ్లి కడాయ్ మొదలెట్టాడు.
ఇది ఏప్రిల్ 10 థియేటర్లకు వచ్చేందుకు సమాయత్తమవుతోంది. వాయిదా పడొచ్చనే టాక్ ఉంది కానీ ఇంకా నిర్ధారణ కాలేదు. అంటే కేవలం పది నెలల కాలంలో మూడు సినిమాలకు దర్శకత్వం వహించి వాటిలో రెండింటికి హీరోగా చేయడమంటే పెద్ద ఫీటే. ఒకప్పుడు స్వర్గీయ ఎన్టీఆర్, సూపర్ స్టార్ కృష్ణ లాంటి వాళ్ళు ఇలా రెండు బాధ్యతలని గొప్పగా నిర్వర్తించేవాళ్ళు. కానీ ఇప్పుడా ట్రెండ్ లేదు. కానీ ధనుష్ మాత్రం నాకది సాధ్యమని చేసి చూపిస్తున్నాడు. అన్నట్టు యుగానికి ఒక్కడు 2ని తనతోనే తీసేందుకు అన్నయ్య సెల్వ రాఘవన్ ప్లాన్ చేసుకుంటున్నారు. ఎప్పుడనేది చెప్పలేదు కానీ త్వరలోనే సెట్స్ కు వెళ్లనుంది.
This post was last modified on February 11, 2025 12:02 pm
తమిళంలో పెద్ద స్టార్గా ఎదిగిన శివ కార్తికేయన్ లాగే టీవీ రంగం నుంచి ఇండస్ట్రీలోకి వచ్చిన అమ్మాయి ప్రియ భవానీ…
తెలుగులో తెర మీద హీరోలకు ఎలివేషన్లు ఇవ్వడంలో చాలామంది దర్శకులు తమ నైపుణ్యాన్ని చూపిస్తుంటారు కానీ.. వేదికల మీద ఎలివేషన్లు…
ఒకప్పుడు తమిళ ప్రేక్షకుల అభిరుచి గురించి ఇతర భాషల వాళ్లు గొప్పగా చెప్పుకునేవాళ్లు. కొత్త తరహా సినిమాలను, ప్రయోగాత్మక చిత్రాలను…
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు ముహూర్తం రెడీ అవుతోంది. ప్రభుత్వం వైపు నుంచి ఈ ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది.…
వైసీపీ ఓటు బ్యాంకు స్థిరమేనా? ఆ పార్టీ చెబుతున్నట్టు 40 శాతం ఓటు బ్యాంకు వచ్చే ఎన్నికల వరకు అలానే…
జూన్ నుంచి టాలీవుడ్ బాక్సాఫీస్ కళకళలాడుతోంది. ఎలాంటి టికెట్ రేట్ల పెంపు పంచాయితీ లేకుండా ఉన్న ధరలతోనే ప్రతి ఒక్కరు…