కెరీర్ ఆరంభంలో సెన్సేషనల్ హిట్లతో దూసుకెళ్లిన విజయ్ దేవరకొండ.. కొన్నేళ్ల నుంచి సరైన విజయం లేక ఇబ్బంది పడుతున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా లైగర్, ఫ్యామిలీ స్టార్ దారుణమైన డిజాస్టర్లయి అతడి కెరీర్ను గట్టి దెబ్బే తీశాయి. దీంతో అతడి ఆశలన్నీ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న కొత్త చిత్రం మీదే ఉన్నాయి. ఈ సినిమా గురించి యూనిట్ వర్గాలు చాలా గొప్పగాచెబుతున్నాయి.
విజయ్ కెరీర్ను మళ్లీ మంచి మలుపు తిప్పే సినిమా ఇదవుతుందని భావిస్తున్నారు. ఈ మూవీ టైటిల్, ఫస్ట్ లుక్ కోసం విజయ్ ఫ్యాన్స్ చాన్నాళ్లుగా ఎదురు చూస్తున్నారు. ఎట్టకేలకు వారి నిరీక్షణ ఫలించబోతోంది. ఈ బుధవారమే వీడీ 12 టైటిల్ టీజర్ రిలీజ్ చేయబోతున్నారు. ఈ టీజర్కు జూనియర్ ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ ఇస్తున్నట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అది జస్ట్ ప్రచారం కాదని, వాస్తవమే అని ఇప్పుడు తేలిపోయింది.
విజయ్-గౌతమ్ సినిమాను ప్రొడ్యూస్ చేస్తున్న సితార ఎంటర్టైన్మెంట్స్ అధినేత సూర్యదేవర నాగవంశీ.. ఎక్స్లో పులి బొమ్మతో ఒక ట్వీట్ వేశాడు. అంతకుమించి ఆ పోస్టులో ఏమీ లేదు. తారక్ను అందరూ యంగ్ టైగర్ అంటారన్న సంగతి తెలిసిందే. వీడీ12కు తారక్ వాయిస్ ఓవర్ ఇచ్చాడనే విషయాన్ని ఈ బొమ్మ ద్వారా నాగవంశీ చెప్పకనే చెప్పేశాడని అర్థం చేసుకోవచ్చు.
తారక్తో వంశీకి మంచి అనుబంధం ఉంది. వంశీ నిర్మాతగా జూనియర్.. అరవింద సమేత లాంటి మెమొరబుల్ మూవీ చేశాడు. తారక్ లేటెస్ట్ హిట్ దేవరను వంశీనే డిస్ట్రిబ్యూట్ చేశాడు. ఇక తారక్ బావమరిది నార్నె నితిన్ను హీరోగా లాంచ్ చేసింది వంశీనే. కాబట్టి అతను అడిగితే వాయిస్ ఓవర్ ఇవ్వడానికి తారక్ వెనుకాడే అవకాశం లేదు.
మరోవైపు ఈ సినిమా హిందీ టీజర్కు రణబీర్ కపూర్, తమిళ టీజర్కు సూర్య గాత్రదానం చేసినట్టు తేలిపోయింది. టీజర్లో ఈ వాయిస్ ఓవర్ల ద్వారా వచ్చే ఎలివేషన్ ఒక రేంజిలో ఉంటుందంటున్నారు. టీజర్ చివర్లో విజయ్ పరిచయం ఉంటుందట.
This post was last modified on February 11, 2025 8:52 am
ఒకప్పుడు టాలీవుడ్లో తిరుగులేని ఆధిపత్యం చలాయించిన కథానాయికల్లో తమన్నా ఒకరు. టీనేజీలోనే కథానాయిక అవతారం ఎత్తిన ఆమె పదేళ్లకు పైగానే టాప్…
థియేటర్, ఓటిటి మధ్య ఖచ్చితంగా ఎనిమిది వారాల గ్యాప్ ఉండాలనే నిబంధన మీద దక్షిణాది ఇండస్ట్రీ పెద్దలు చాలా సీరియస్…
అధికారంలోకి రావడానికి ముందు వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా ఫెరోషియస్గా కనిపించేవారు. అవినీతి కేసుల వ్యవహారం పక్కన పెడితే…
‘బాహుబలి’ సినిమాకు బాలీవుడ్ నుంచి అప్పట్లో ఎంత గొప్ప సహకారం అందిందో తెలిసిందే. కరణ్ జోహార్ లాంటి అగ్ర నిర్మాత ఆ…
మోనాలిసా.. గత ఏడాది సోషల్ మీడియాను ఒక ఊపు ఊపేసిన పేరిది. ఉత్తర్ప్రదేశ్లో జరిగిన మహా కుంభమేళాతో వెలుగులోకి వచ్చిన…
తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, మాజీ మంత్రి పార్టీ కీలక…