మనిషికి మంచి తిండి, సుఖమైన నిద్ర అత్యంత ముఖ్యమైన విషయాలు. నిద్ర విషయానికి వస్తే.. ఏ వయసులో అయినా సరే కనీసం ఆరు గంటలు పడుకోవాలని వైద్యులు చెబుతారు. ఆ మాత్రం నిద్ర లేకపోతే ఏ పనీ సరిగా చేయలేమని అంటారు. కానీ కొంతమంది మాత్రం తక్కువ నిద్రతోనే యాక్టివ్గా ఉంటారు. అన్ని పనులూ సవ్యంగా చేసేస్తారు. ఐతే మరీ రెండు గంటల నిద్రతో సరిపెట్టుకోవడం అంటే ఎలాంటి వ్యక్తికైనా కష్టమే. కానీ సల్మాన్ మాత్రం తాను రోజూ రెండు గంటలు మాత్రమే నిద్రపోతానని ఓ పాడ్ కాస్ట్ ఇంటర్వ్యూలో చెప్పి ఆశ్చర్యానికి గురి చేశారు.
‘‘నేను సాధారణంగా రోజుకు రెండు గంటలు మాత్రమే నిద్ర పోతాను. నెలలో ఒక్క రోజు మాత్రమే ఎనిమిది గంటలు పడుకుంటాను. కొన్నిసార్లు సినిమా చిత్రీకరణ సమయంలో సన్నివేశాల మధ్య విరామం వచ్చినప్పుడు కాసేపు కునుకు తీస్తాను’’ అని సల్మాన్ చెప్పాడు. సల్మాన్ ఎంత బిజీ నటుడైనప్పటికీ నిద్ర అన్నది మనిషికి అత్యంత ముఖ్యమైన విషయాల్లో ఒకటి కాబట్టి.. మరీ రెండు గంటలు నిద్ర పోవడం ఏంటి అని అభిమానులు ఆశ్చర్యపోతున్నారు.
ఐతే తాను వరుసగా రోజూ ఎనిమిది గంటలు పడుకున్న రోజులు కూడా ఉన్నాయంటూ సల్మాన్.. జైల్లో గడిపిన రోజులను గుర్తు చేసుకోవడం విశేషం. ‘‘నేను షూటింగ్లు లేనప్పుడు, ఖాళీగా ఉన్నప్పుడు కావాల్సినంత నిద్ర పోతాను. అందుకే జైల్లో ఉన్నప్పుడు హాయిగా 8 గంటలు నిద్రపోయాను. విమాన ప్రయాణాల్లో ఉన్నపుడు, ముఖ్యంగా ఏదైనా సాంకేతిక సమస్య వచ్చి ఆలస్యం అయితే ఆ సమయంలో కూడా నేను ఎక్కువగా నిద్రపోతాను.
ఎందుకంటే అప్పుడు నేనేం చేయలేను కదా’’ అని సల్మాన్ అన్నాడు. కృష్ణ జింకల్ని వేటాడిన కేసులో, ఒక కారు ప్రమాదానికి సంబంధించిన కేసులో సల్మాన్ వేర్వేరుగా జైలు జీవితం గడిపిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం సల్మాన్ నటిస్తున్న ‘సికందర్’ రంజాన్ కానుకగా వచ్చే నెలలో విడుదల కానుంది.
This post was last modified on February 10, 2025 3:47 pm
కెరీర్లో ఎదిగే క్రమంలో తమకు మంచి విజయాలు అందించిన దర్శకులను గుర్తు పెట్టుకుని వారి మీద కృతజ్ఞత చూపించే లక్షణం అందరు హీరోల్లోనూ చూడలేం. రేంజ్ పెరిగే…
యువ కథానాయకుడు రామ్ ఓ నిఖార్సయిన హిట్టు కొట్టి చాలా ఏళ్లయింది. ఇస్మార్ట్ శంకర్ తర్వాత తన చిత్రాలన్నీ బోల్తా…
వరస ఫ్లాపులతో సతమతమవుతున్న విశ్వక్ సేన్ తిరిగి దర్శకత్వంలోకి వచ్చేశాడు. ఫలక్ నుమా దాస్, దాస్ కా ధమ్కీ తర్వాత…
కమల్ హాసన్, రజనీకాంత్ కాంబోలో అనౌన్స్ మెంట్ వీడియో చూశాక మూవీ లవర్స్ లో మాములు ఎగ్జైట్ మెంట్ కలగడం…
కామారెడ్డిలో కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. ఈ క్రమంలోనే కాంగ్రెస్ మాజీ సర్పంచ్ కారును బీజేపీ కార్యకర్తలు…
అయేషా మీరా. ఉమ్మడి ఏపీలో 2007లో ఓ వ్యక్తి కామ దాహానికి బలి అయిపోయిన బీఫార్మసీ విద్యార్థిని. ఈ కేసులో…