నిన్న చిరంజీవి ముఖ్యఅతిథిగా జరిగిన లైలా ప్రీ రిలీజ్ ఈవెంట్ సవ్యంగా జరిగింది కానీ ఒక్క చిన్న స్పీచ్ పెనుముప్పులా మారిపోయింది. థర్టీ ఇయర్స్ పృథ్వి ఈ సినిమాలో మేకల సత్యం క్యారెక్టర్ గురించి మాట్లాడుతూ షూటింగ్ మొదట్లో నూటా యాభై ఉండేవి చివరికి పదకొండు మేకలే మిగిలాయని చెప్పడం సోషల్ మీడియాలో దుమారం రేపింది.
ఆయన ఉద్దేశపూర్వకంగానే అధికారం కోల్పోయిన వైసిపి పార్టీ సీట్ల సంఖ్యను గుర్తుకుతెచ్చేలా మాట్లాడారంటూ కార్యకర్తలకు కోపం రావడంతో ఏకంగా లైలాను బాయ్ కాట్ చేద్దామని ప్రతిపాదించే దాకా వెళ్ళింది. గంటల్లోనే వైరల్ అయిపోయింది.
దీంతో దిద్దుబాటు చర్యల్లో భాగంగా లైలా టీమ్ దీనికి సంబంధించిన వివరణ ప్రెస్ మీట్ రూపంలో ఇచ్చే అవకాశం ఉందని సమాచారం. సరే ఇదంతా ఓకే కానీ అసలు సందర్భం లేకుండా కావాలని పదకొండు సంఖ్యని నొక్కి వక్కాణించడం ఈ చిక్కును తెచ్చి పెట్టింది. టిడిపి జనసేన కూటమి గెలిచాయి. చక్కగా పాలిస్తున్నాయి.
ప్రజలు కూడా ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటున్నారు. ఈ సమయంలో అదే పనిగా అపోజిషన్ ని గిల్లేలా ఎక్కడ కామెంట్లు చేసినా దాని ప్రభావం నేరుగానో మరో రూపంలోనో సినిమాల మీద పడుతుంది. ఆ మధ్య రెండు మూడు ఈవెంట్లలో ఇలాంటి ఉదంతాలు జరిగి ఓపెనింగ్స్ ఎఫెక్టయ్యాయి.
ఏది ఏమైనా సినిమాలు వేరు రాజకీయాలు వేరు అనడానికి లేదు. కొన్నిసార్లు తెలియకుండానే వీటి మధ్య ముడి పడిపోతుంది. అలాంటప్పుడు ఆచితూచి వ్యవహరించడం అవసరం. చిరంజీవి అంతటి వ్యక్తి వచ్చినప్పుడు వివాదాలు లేకుండా చూసుకోవాలి. ఇప్పుడు మెగాస్టార్ స్పీచ్ పక్కకు వెళ్ళిపోయి పృథ్విది హైలైట్ కావడం లైలాకు ఎంత మాత్రం మింగుడుపడని వ్యవహారం.
ఇంకో నాలుగు రోజుల్లో విడుదల ఉన్న నేపథ్యంలో దీని మీద బోలెడు ఆశలు పెట్టుకున్న విశ్వక్ సేన్ ప్రమోషన్ పరంగా ఏ చిన్న అవకాశాన్ని విడిచి పెట్టడం లేదు. బ్రహ్మ ఆనందం మినహా పోటీ పెద్దగా లేకపోవడం కలిసొచ్చేలా ఉంది.
This post was last modified on February 10, 2025 10:43 am
బాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో ఒకరైన కంగనా రనౌత్.. పరిశ్రమలో ఒక స్థాయి అందుకున్న దగ్గర్నుంచి తాను పని చేసే ఇండస్ట్రీలోనే…
రాష్ట్రంలో హైదరాబాద్ కు చెందిన ఐఐటీయన్ల సర్వే పేరుతో వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలు రెండు మూడు రోజుల నుంచి…
ఇరుముడి వసూళ్లు చూసి చాలా మందికి అసలేం జరుగుతోందో అర్థం కావడం లేదు. ఎక్కడో మారుమూల మూసేయడానికి రెడీగా ఉన్నాయనిపించే…
స్థానిక ఎన్నికలపై జనసేన త్రిముఖ వ్యూహాన్ని అనుసరిస్తోంది. ఈ నేపథ్యంలో జనసేన పార్టీ అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్..…
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో విద్యార్థి మృతి చెందాడు. నిన్న వైజాగ్ ప్రైవేటు స్కూల్లో టీచర్ కొట్టిన దెబ్బలకు యూకేజీ విద్యార్థి…
నిర్మాత దిల్ రాజు అన్నట్టు వందల సినిమాలు తీయకపోయినా కెవిఎన్ ప్రొడక్షన్స్ అనేది ఇప్పుడు అన్ని బాషల ఇండస్ట్రీలో హాట్…