Movie News

నాటి ప్రజారాజ్యమే నేటి జనసేన: చిరంజీవి!

జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ను సాక్ష్యాత్తూ ప్రధాని మోదీ పవన్ ను ఏ ఆంధీ హై అంటూ ఆకాశానికెత్తేసిన సంగతి తెలిసిందే. ఇక, మెగా స్టార్, మాజీ కేంద్ర మంత్రి చిరంజీవిపై కూడా ప్రధాని మోదీ ప్రత్యేకమైన అభిమానం ఉంది. ‘తమ్ముడు’ పవన్, మెగా బ్రదర్ నాగబాబులకు తోడుగా ‘అన్నయ్య’ చిరంజీవి కలిసి వస్తే జనసేన మరింత బలపడుతుందని, రాష్ట్ర రాజకీయాల్లో ఈ ముగ్గురు మొనగాళ్లు కచ్చితంగా చక్రం తిప్పుతారని మెగా ఫ్యాన్స్ ఆశగా ఎదురు చూస్తున్నారు.

ఈ క్రమంలోనే తాజాగా జనసేనకు చిరంజీవి తొలిసారిగా జై కొట్టారు. అంతేకాదు, ప్రజారాజ్యమే జనసేనగా రూపాంతరం చెందింది అంటూ చిరు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ‘లైలా’ మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్‌ కు ముఖ్య అతిథిగా వచ్చిన చిరంజీవి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. విశ్వక్సేన్ వాళ్ల నాన్న కరాటే రాజు గారు తనకు 18 ఏళ్లుగా తెలుసని, ప్రజారాజ్యం సమయం నుంచి తమ ఇద్దరి మధ్య పరిచయం ఉందని అన్నారు.

అలా ప్రజారాజ్యం గురించి ప్రస్తావించిన తర్వాత చిరు జై జనసేన అన్నారు. చాలా కాలం తర్వాత ప్రజారాజ్యం పార్టీ ప్రస్తావన, జనసేన పేరు బహిరంగ వేదికపైన ప్రస్తావించారు. ఈ ఈవెంట్ కు వచ్చిన మెగా అభిమానులంతా జై జనసేన అంటూ నినాదాలు చేస్తుంటే…వారితోపాటు చిరు కూడా జై జనసేన అన్నారు. మెగాస్టార్ నోట జై జనసేన అని తొలిసారి విన్న మెగా ఫ్యాన్స్ కేరింతలు, కేకలు, ఈలలతో హోరెత్తించారు.

2011 ఆగస్టులో కాంగ్రెస్ లో ప్రజారాజ్యం పార్టీని విలీనం చేశారు. ఆ తర్వాత ప్రజారాజ్యం గురించి చిరు మాట్లాడింది చాలా తక్కువ సందర్భాల్లోనే. ఇక, గత ఐదేళ్ల కాలంలో అయితే ఎప్పుడూ ప్రజారాజ్యం ప్రస్తావన చిరు తేలేదు. సడన్‌గా ఈ రోజు ప్రజారాజ్యమే జనసేనగా రూపాంతరం చెందిందని చిరు మాట్లాడడంతో జనసైనికులు, మెగా ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఇక, ఇటీవల ఓ ఈవెంట్ లో ప్రధాని మోదీతోపాటు చిరంజీవి కూడా పాల్గొన్నారు.

త్వరలోనే పవన్ కు తోడుగా చిరు రాజకీయాల్లో చక్రం తిప్పేలా అక్కడ చర్చలు జరిగాయని, జాతీయ స్థాయిలో చిరుకు రాజ్య సభ ఎంపీ లేదా మరేదైనా పదవి ఇచ్చే చాన్స్ ఉందని ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలోనే తాజాగా చిరు కూడా జనసేన గురించి మాట్లాడడం ప్రాధాన్యతను సంతరించుకుందని అభిమానులు భావిస్తున్నారు.

This post was last modified on February 9, 2025 11:15 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

విమర్శకులను పనితీరుతో కొడుతున్న లోకేష్..!

తనపై విమర్శలు చేసే వారిని సహజంగా ఎవరైనా ప్రతివిమర్శలతో ఎదుర్కొంటారు. మాటకు మాట అంటారు. ఇక రాజకీయాల్లో అయితే ఈ…

1 hour ago

రండి.. కూర్చుని మాట్లాడుకుందాం: ఏపీకి రేవంత్ రెడ్డి పిలుపు

ఇరు తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న జల వివాదాలపై యాగీ చేసుకోకుండా కూర్చుని మాట్లాడుకుంటే సమస్యలు పరిష్కారం అవుతాయని తెలంగాణ…

1 hour ago

షమీ కెరీర్ క్లోజ్ అయినట్టేనా?

టీమ్ ఇండియా సీనియర్ పేసర్ మహమ్మద్ షమీ ఇంటర్నేషనల్ కెరీర్ దాదాపు ముగింపు దశకు చేరుకున్నట్లే కనిపిస్తోంది. గతేడాది జరిగిన…

2 hours ago

‘వైసీపీ చేసిన పాపాలను కడుగుతున్నాం’

రెండు రాష్ట్రాల మధ్య జల వివాదాలపై ఏపీ సీఎం చంద్రబాబు మరోసారి స్పందించారు. నీళ్లు వద్దు, గొడవలే కావాలని కొందరు…

10 hours ago

ఎలుకల మందు ఆర్డర్.. డెలివరీ బాయ్ ఏం చేశాడు?

సాధారణంగా ఏదైనా ఆర్డర్ ఇస్తే డెలివరీ బాయ్స్ వెంటనే ఇచ్చేసి వెళ్ళిపోతుంటారు. కానీ తమిళనాడులో జరిగిన ఒక ఘటన మాత్రం…

11 hours ago

అమరావతిలో జ్ఞాన బుద్ధకు మళ్లీ ప్రాణం

ఏపీ రాజధాని అమరావతిలో కీలక ప్రాజెక్టును తిరిగి పట్టాలెక్కించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో సుమారు రూ. 2…

12 hours ago