జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ను సాక్ష్యాత్తూ ప్రధాని మోదీ పవన్ ను ఏ ఆంధీ హై అంటూ ఆకాశానికెత్తేసిన సంగతి తెలిసిందే. ఇక, మెగా స్టార్, మాజీ కేంద్ర మంత్రి చిరంజీవిపై కూడా ప్రధాని మోదీ ప్రత్యేకమైన అభిమానం ఉంది. ‘తమ్ముడు’ పవన్, మెగా బ్రదర్ నాగబాబులకు తోడుగా ‘అన్నయ్య’ చిరంజీవి కలిసి వస్తే జనసేన మరింత బలపడుతుందని, రాష్ట్ర రాజకీయాల్లో ఈ ముగ్గురు మొనగాళ్లు కచ్చితంగా చక్రం తిప్పుతారని మెగా ఫ్యాన్స్ ఆశగా ఎదురు చూస్తున్నారు.
ఈ క్రమంలోనే తాజాగా జనసేనకు చిరంజీవి తొలిసారిగా జై కొట్టారు. అంతేకాదు, ప్రజారాజ్యమే జనసేనగా రూపాంతరం చెందింది అంటూ చిరు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ‘లైలా’ మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్ కు ముఖ్య అతిథిగా వచ్చిన చిరంజీవి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. విశ్వక్సేన్ వాళ్ల నాన్న కరాటే రాజు గారు తనకు 18 ఏళ్లుగా తెలుసని, ప్రజారాజ్యం సమయం నుంచి తమ ఇద్దరి మధ్య పరిచయం ఉందని అన్నారు.
అలా ప్రజారాజ్యం గురించి ప్రస్తావించిన తర్వాత చిరు జై జనసేన అన్నారు. చాలా కాలం తర్వాత ప్రజారాజ్యం పార్టీ ప్రస్తావన, జనసేన పేరు బహిరంగ వేదికపైన ప్రస్తావించారు. ఈ ఈవెంట్ కు వచ్చిన మెగా అభిమానులంతా జై జనసేన అంటూ నినాదాలు చేస్తుంటే…వారితోపాటు చిరు కూడా జై జనసేన అన్నారు. మెగాస్టార్ నోట జై జనసేన అని తొలిసారి విన్న మెగా ఫ్యాన్స్ కేరింతలు, కేకలు, ఈలలతో హోరెత్తించారు.
2011 ఆగస్టులో కాంగ్రెస్ లో ప్రజారాజ్యం పార్టీని విలీనం చేశారు. ఆ తర్వాత ప్రజారాజ్యం గురించి చిరు మాట్లాడింది చాలా తక్కువ సందర్భాల్లోనే. ఇక, గత ఐదేళ్ల కాలంలో అయితే ఎప్పుడూ ప్రజారాజ్యం ప్రస్తావన చిరు తేలేదు. సడన్గా ఈ రోజు ప్రజారాజ్యమే జనసేనగా రూపాంతరం చెందిందని చిరు మాట్లాడడంతో జనసైనికులు, మెగా ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఇక, ఇటీవల ఓ ఈవెంట్ లో ప్రధాని మోదీతోపాటు చిరంజీవి కూడా పాల్గొన్నారు.
త్వరలోనే పవన్ కు తోడుగా చిరు రాజకీయాల్లో చక్రం తిప్పేలా అక్కడ చర్చలు జరిగాయని, జాతీయ స్థాయిలో చిరుకు రాజ్య సభ ఎంపీ లేదా మరేదైనా పదవి ఇచ్చే చాన్స్ ఉందని ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలోనే తాజాగా చిరు కూడా జనసేన గురించి మాట్లాడడం ప్రాధాన్యతను సంతరించుకుందని అభిమానులు భావిస్తున్నారు.
This post was last modified on February 9, 2025 11:15 pm
టాలీవుడ్ ఇస్మార్ట్ బ్యూటీ నభా నటేష్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఫోటోలు ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. సాధారణంగా…
అందరూ ఎదురు చూస్తున్న రామాయణ పార్ట్ 1 టీజర్ వచ్చేసింది. రెండు నిమిషాల ముప్పై ఎనిమిది సెకండ్ల వీడియో మొత్తం…
మొన్న సోమవారం నుంచి దురంధర్ ది రివెంజ్ ఆక్యుపెన్సీలు బాగా తగ్గిపోవడం ట్రేడ్ వర్గాలను ఆందోళనకు గురి చేశాయి. యాభై…
ఏపీకి అమరావతి ఏకైక, శాశ్వత రాజధానిగా కొనసాగేందుకు అవసరమైన చట్ట సవరణలు సవ్యంగా ముగిసిన వేళ... అమరావతిని చిదిమేసేందుకు వైసీపీ చేసిన దాష్టీకం…
సినీ రంగంలో మహిళలు నటనలోకి పెద్ద సంఖ్యలోనే వస్తారు కానీ.. టెక్నికల్ సైడ్ వెళ్లే వాళ్లు తక్కువ. అందులోనూ దర్శకత్వం వైపు అడుగులు…
పెద్ది వాయిదా గురించి కథనాలు వస్తూనే ఉన్నాయి. లేట్ లేదని రాకాస ప్రమోషన్ వీడియోలో రామ్ చరణ్ స్వయంగా చెప్పినా…