జనవరిలో సంక్రాంతికి వస్తున్నాంతో వెంకటేష్ 300 కోట్ల ఇండస్ట్రీ హిట్ సాధించడం అభిమానుల్లో ఎక్కడలేని ఉత్సహాన్ని ఇచ్చింది. సీనియర్ స్టార్లలో వెనుకబడిపోతున్నాడన్న భయాన్ని పూర్తిగా పోగొడుతూ ఇంత ఘనవిజయం సాధించడం ఎవరూ ఊహించలేదు. ఇట్స్ బ్లాక్ బస్టర్ పొంగల్ అనే పాటకు తగ్గట్టు వెంకీ మామ వసూళ్ల వర్షం ఇరవై రోజుల తర్వాత కూడా కొనసాగుతోంది. వీకెండ్స్ ఫ్యామిలీ ఛాయస్ ఇదే సినిమా అవుతోంది. మామా ఆనందాన్ని ఇలా ఆస్వాదిస్తుండానే మేనల్లుడు నాగచైతన్య తాజాగా తండేల్ తో వచ్చాడు. కొంత మిక్స్డ్ టాక్ నడుస్తున్న ఓవరాల్ గా వసూళ్లు బాగుండటం హిట్ దిశగా తీసుకెళ్తోంది.
మొదటి రోజు పాతిక కోట్లకు దగ్గరగా వెళ్లిన చైతు వంద కోట్ల గ్రాసర్ అందుకోవడం ఖాయమనే మాట ట్రేడ్ సర్కిల్స్ లో వినిపిస్తోంది. కంటెంట్ పరంగా హెచ్చుతగ్గులు ఉన్నప్పటికీ జనాలు రాజు, సత్యల ప్రేమకథకు కనెక్ట్ అయిపోతున్నారు. ముఖ్యంగా నాగచైతన్య, సాయిపల్లవిల కెమిస్ట్రీ లవ్ స్టోరీ తర్వాత మరింత బాగా తండేల్ లో పండింది. దానికి తోడు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం ఆడియన్స్ ని మెప్పిస్తోంది. దీనికి పోటీగా వచ్చిన తమిళ డబ్బింగ్ పట్టుదల మొదటి ఆటకే చేతులు ఎత్తేయగా బాలీవుడ్ రిలీజులు బ్యాడ్ ఆస్ రవికుమార్, లవ్ యాపా కనీస ప్రభావాన్ని చూపించలేకపోయాయి. సో తండేల్ దే రాజ్యం.
వచ్చే వారం విశ్వక్ సేన్ లైలా మినహా ఇంకో పదిహేను రోజుల దాకా చెప్పుకోదగ్గ రిలీజ్ లేకపోవడాన్ని తండేల్ ఎలా వాడుకుంటుందో చూడాలి. ఇదే మూమెంట్ ని కొనసాగిస్తే చైతు కెరీర్ బెస్ట్ నమోదవ్వడం ఖాయం. రేపటి నుంచి వీక్ డేస్ లో డ్రాప్ ఎంత శాతంలో ఉంటుందనేది కీలకంగా మారింది. ఏపిలో టికెట్ రేట్ల పెంపుకి వెళ్లడం కొంత ప్రభావం చూపిస్తున్నప్పటికీ దాన్ని వారం రోజులకు పరిమితం చేయడంతో మరీ ఆందోళన అవసరం లేదని బయ్యర్స్ టాక్. మొత్తానికి మామ పొంగల్ నాదే అనిపిస్తోంది తాజాగా మేనల్లుడు ఫిబ్రవరి నాదే అంటూ తండేల్ తో వర్కౌట్ చేసుకునేలా ఉన్నాడు. సో ఇద్దరి ఫ్యాన్స్ హ్యాపీ.
This post was last modified on February 9, 2025 11:42 am
రెండు రాష్ట్రాల మధ్య జల వివాదాలపై ఏపీ సీఎం చంద్రబాబు మరోసారి స్పందించారు. నీళ్లు వద్దు, గొడవలే కావాలని కొందరు…
సాధారణంగా ఏదైనా ఆర్డర్ ఇస్తే డెలివరీ బాయ్స్ వెంటనే ఇచ్చేసి వెళ్ళిపోతుంటారు. కానీ తమిళనాడులో జరిగిన ఒక ఘటన మాత్రం…
ఏపీ రాజధాని అమరావతిలో కీలక ప్రాజెక్టును తిరిగి పట్టాలెక్కించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో సుమారు రూ. 2…
సెన్సార్ చిక్కుల్లో పడి నానా యాతన పడ్డ సినిమాల్లో జన నాయకుడుకి మోక్షం దక్కలేదు కానీ పరాశక్తి సంకెళ్లు తెంచుకుంది.…
వైసీపీ అధినేత జగన్ మారుతాడేమో, ప్రజల్లో ఆయనపై సానుభూతి పెరుగుతుందేమో అని కూటమి నాయకులు పలుసార్లు భావిస్తూ వచ్చారు. అందుకే…
వైసీపీ అధినేత జగన్పై సీఎం చంద్రబాబు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. వైసీపీ పాలనతో రాష్ట్రం పూర్తిగా విధ్వంసమైందని అన్నారు.…