ఈ రోజు ఉదయం నుంచి ట్విట్టర్లో దేశవ్యాప్తంగా #baahubali2 పెద్ద ఎత్తున ట్రెండ్ అవుతుండటం విశేషం. ఇప్పుడేమీ బాహుబలి-2కు వార్షికోత్సవం జరగట్లేదు. ఆ సినిమాకు సంబంధించి ఇంకే రకమైన అకేషన్ కూడా లేదు. అయినా సరే.. ఇప్పుడెందుకు ఈ హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అవుతోందని ఆశ్చర్యం కలగక మానదు. కానీ విషయం ఏంటంటే.. ‘బాహుబలి-2’ రీ రిలీజ్కు రెడీ అవుతోంది. కానీ అది మన దేశంలో కాదు. అమెరికాలో. అక్కడ పెద్ద స్థాయిలోనే ఈ చిత్రాన్ని రీ రిలీజ్ చేయబోతున్నారు.
యుఎస్లోని 16 నగరాల్లో వారం పాటు ‘బాహుబలి-2’ను ప్రదర్శించబోతున్నారు. ఇందుక్కారణం ఈ వారంలో ప్రభాస్ పుట్టిన రోజు రాబోతుండటం. ఈ నెల 23న ప్రభాస్ పుట్టిన రోజన్న సంగతి తెలిసిందే. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని వారం పాటు యుఎస్లో ‘బాహుబలి-2’ను ప్రదర్శించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.
అసలే రీ రిలీజ్ కాన్సెప్టే లేని ఈ రోజుల్లో ఇలా ఒక భారతీయ హీరో పుట్టిన రోజును పురస్కరించుకుని యుఎస్లో ఈ స్థాయిలో ఒక సినిమా మళ్లీ ప్రదర్శితం కావడం విశేషమే. దీన్ని బట్టే ప్రభాస్ క్రేజ్ ఎలాంటిదన్నది అర్థం చేసుకోవచ్చు. ఇక యుఎస్లో నాన్-ఇండియన్స్కు సైతం ‘బాహుబలి’ ప్రకంపనల గురించి బాగానే తెలుసు. అక్కడ ఏకంగా 20 మిలియన్ డాలర్లకు పైగా వసూళ్లు కొల్లగొట్టిందా చిత్రం.
భారతీయ కరెన్సీలో రూ.130 కోట్ల దాకా గ్రాస్ వసూళ్లు వచ్చాయి ఆ చిత్రానికి అక్కడ. ‘బాహుబలి: ది బిగింగ్’ సైతం 7-8 మిలియన్ డాలర్ల మధ్య వసూళ్లు రాబట్టింది. ‘బాహుబలి-2’ విడుదలైనపుడు హాలీవుడ్ పెద్ద సినిమాలకు దీటుగా బాక్సాఫీస్ చార్టుట్లో అగ్ర భాగాన నిలిచిందీ చిత్రం. ఇప్పుడు కరోనా వల్ల యుఎస్లో సైతం హాలీవుడ్ సినిమాల సందడి పెద్దగా లేదు. ఇలాంటి సమయంలో విడుదలవుతున్న ‘బాహుబలి-2’ ఎలాంటి ప్రభావం చూపుతుందో చూడాలి.
This post was last modified on October 20, 2020 4:51 pm
వచ్చే వారం ది కేరళ స్టోరీ 2 విడుదల కానుంది. మూడేళ్ళ క్రితం వచ్చిన మొదటి భాగం ఎంత సంచలనం…
రాజకీయ పార్టీలు ఓట్ల కోసం కురిపిస్తున్న ఉచితాల ఆఫర్లపై దేశ సర్వోన్నత న్యాయస్థానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కేవలం…
ఒకప్పుడు శంకర్తో సినిమా చేయడానికి వివిధ ఇండస్ట్రీల టాప్ స్టార్లు, అగ్ర నిర్మాతలు లైన్లో ఉండేవారు. మెగాస్టార్ చిరంజీవి అంతటి…
ఏపీ అసెంబ్లీలో బడ్జెట్ సమావేశాలు ఎగ్గొట్టిన మాజీ సీఎం జగన్…తాపీగా ఈ రోజు మీడియా ముందుకు వచ్చారు. బడ్జెట్ లో…
ఫంకీ ఫలితం త్వరగా తేలిపోవడంతో హీరో విశ్వక్ సేన్, నిర్మాణ సంస్థ సితార హఠాత్తుగా సైలెంటైపోయాయి. ఊరికే లేనిపోని హడావిడి…
వైసీపీ మాజీ ఎంపీ, ఆ పార్టీ మాజీ నేత రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ వ్యవహారం జగన్ హయాంలో దేశవ్యాప్తంగా సంచలనం…