ప్రస్తుతం శైలేష్ కొలను దర్శకత్వంలో హిట్ 3 ది థర్డ్ కేస్ పూర్తి చేసే పనిలో ఉన్న న్యాచురల్ స్టార్ నాని ఆ తర్వాత శ్రీకాంత్ ఓదెలతో ది ప్యారడైజ్ కు రెడీ అవుతున్నాడు. అనిరుధ్ రవిచందర్ ని మ్యూజిక్ డైరెక్టర్ గా ప్రకటించాక ఇప్పటికే పీక్స్ లో ఉన్న అంచనాలు మరింత ఎగబాకాయి.
నిర్మాతగానూ నాని డబుల్ ప్రమోషన్ అందుకోబోతున్న సంగతి తెలిసిందే. చిరంజీవి హీరోగా తన సమర్పణలో శ్రీకాంత్ ఓదెలకు దగ్గరుండి ప్రాజెక్టు చేయించాడు. ఇక నాని హీరో నెక్స్ట్ ఎవరితో చేతులు కలపబోతున్నాడనే దాని మీద రకరకాల ఊహాగానాలు చెలరేగుతున్నాయి. వాటిలో వినిపిస్తున్నపేరు కోలీవుడ్ ఫేమ్ సిబి చక్రవర్తి.
నిజానికీ కలయిక ఏడాదిన్నర క్రితమే నాంది వేసుకుంది. శివ కార్తికేయన్ డాన్ చూసి ఇంప్రెస్ అయిన నాని అతనితో సినిమా చేయాలని ఆసక్తి చూపించాడు. తొలుత చెప్పిన లైన్ నచ్చడంతో హైదరాబాద్ లోనే ఆఫీస్ తీసి పనులు ప్రారంభించారు. కొంత కాలం అయ్యాక ఫైనల్ వర్షన్ అంత సంతృప్తికరంగా రాకపోవడంతో తాత్కాలికంగా పెండింగ్ పెట్టేశారు.
ఈలోగా శిబి చక్రవర్తి మళ్ళీ శివ కార్తికేయన్ తోనే రెండో ప్రాజెక్ట్ ఓకే చేయించుకున్నాడు. కానీ అతను అమరన్, పరాశక్తి, మురగదాస్ సినిమాలతో బిజీగా ఉండటంతో అది కూడా వాయిదా పడింది. తాజాగా ట్విస్టు ఏంటంటే నానిని సిబి మరోసారి కలిసి ఒప్పించాడట.
అఫీషియల్ గా ఇంకా చెప్పలేదు కానీ అంతర్గతంగా అంగీకారం వచ్చిందని ఫిలిం నగర్ టాక్. డాన్ లో కామెడీ, ఎమోషన్స్ ని చక్కగా బాలన్స్ చేసి సూపర్ హిట్ అందుకున్న సిబి చక్రవర్తికి నాని లాంటి టైమింగ్ ఉన్న హీరోలు దొరికితే పండగే. అందుకే పట్టు వదలకుండా ట్రై చేసి ఆఖరికి సక్సెస్ అయ్యాడని సమాచారం.
అయితే అధికారికంగా ప్రకటన వచ్చేదాకా నిర్ధారణగా చెప్పలేం. దసరా, హాయ్ నాన్న, సరిపోదా శనివారం ఇలా బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్స్ తో దూసుకుపోతున్న నాని ఈసారి హిట్ 3, ది ప్యారడైజ్ తో ప్యాన్ ఇండియా మార్కెట్ ని పెంచుకునే పనిలో ఉన్నాడు. ఇన్ సైడ్ టాక్స్ నిజమయ్యేలానే వినిపిస్తున్నాయి.
This post was last modified on February 5, 2025 3:09 pm
‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో గ్లోబల్ స్టార్లుగా ఎదిగిపోయారు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్. ఆ చిత్రం అంతర్జాతీయ స్థాయిలో ప్రేక్షకులను ఉర్రూతూలగించింది.…
ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రపంచం పుంజుకుంటోంది. ప్రధానంగా ఐటీ సంస్థల నుంచి ప్రభుత్వ కార్యాలయాల వరకు కూడా ఏఐ ఆధారిత…
వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్కు సొంత బాబాయి.. వైఎస్ వివేకానందరెడ్డి దారుణ హత్య కేసు లో తాజాగా…
గత ఏడాది సంక్రాంతికి ‘హనుమాన్’తో సెన్సేషన్ క్రియేట్ చేసింది ప్రశాంత్ వర్మ-తేజ సజ్జ జోడీ. పాన్ ఇండియా స్థాయిలో పెద్ద…
మాటల మాంత్రికుడు.. సోషల్ మీడియాలో దుమ్మురేపి.. ప్రస్తుతం ప్రజాప్రతినిధిగా శాసన మండలిలో ఉన్న తీన్మార్ మల్లన్న తన వాయిస్ ద్వారా…
‘ఆర్ఎక్స్ 100’ మూవీతో సెన్సేషన్ క్రియేట్ చేసిన యువ దర్శకుడు అజయ్ భూపతి, మళ్లీ తన పవర్ చూపించిన సినిమా..…