Movie News

వద్దనుకున్న దర్శకుడితో నాని సినిమా ?

ప్రస్తుతం శైలేష్ కొలను దర్శకత్వంలో హిట్ 3 ది థర్డ్ కేస్ పూర్తి చేసే పనిలో ఉన్న న్యాచురల్ స్టార్ నాని ఆ తర్వాత శ్రీకాంత్ ఓదెలతో ది ప్యారడైజ్ కు రెడీ అవుతున్నాడు. అనిరుధ్ రవిచందర్ ని మ్యూజిక్ డైరెక్టర్ గా ప్రకటించాక ఇప్పటికే పీక్స్ లో ఉన్న అంచనాలు మరింత ఎగబాకాయి.

నిర్మాతగానూ నాని డబుల్ ప్రమోషన్ అందుకోబోతున్న సంగతి తెలిసిందే. చిరంజీవి హీరోగా తన సమర్పణలో శ్రీకాంత్ ఓదెలకు దగ్గరుండి ప్రాజెక్టు చేయించాడు. ఇక నాని హీరో నెక్స్ట్ ఎవరితో చేతులు కలపబోతున్నాడనే దాని మీద రకరకాల ఊహాగానాలు చెలరేగుతున్నాయి. వాటిలో వినిపిస్తున్నపేరు కోలీవుడ్ ఫేమ్ సిబి చక్రవర్తి.

నిజానికీ కలయిక ఏడాదిన్నర క్రితమే నాంది వేసుకుంది. శివ కార్తికేయన్ డాన్ చూసి ఇంప్రెస్ అయిన నాని అతనితో సినిమా చేయాలని ఆసక్తి చూపించాడు. తొలుత చెప్పిన లైన్ నచ్చడంతో హైదరాబాద్ లోనే ఆఫీస్ తీసి పనులు ప్రారంభించారు. కొంత కాలం అయ్యాక ఫైనల్ వర్షన్ అంత సంతృప్తికరంగా రాకపోవడంతో తాత్కాలికంగా పెండింగ్ పెట్టేశారు.

ఈలోగా శిబి చక్రవర్తి మళ్ళీ శివ కార్తికేయన్ తోనే రెండో ప్రాజెక్ట్ ఓకే చేయించుకున్నాడు. కానీ అతను అమరన్, పరాశక్తి, మురగదాస్ సినిమాలతో బిజీగా ఉండటంతో అది కూడా వాయిదా పడింది. తాజాగా ట్విస్టు ఏంటంటే నానిని సిబి మరోసారి కలిసి ఒప్పించాడట.

అఫీషియల్ గా ఇంకా చెప్పలేదు కానీ అంతర్గతంగా అంగీకారం వచ్చిందని ఫిలిం నగర్ టాక్. డాన్ లో కామెడీ, ఎమోషన్స్ ని చక్కగా బాలన్స్ చేసి సూపర్ హిట్ అందుకున్న సిబి చక్రవర్తికి నాని లాంటి టైమింగ్ ఉన్న హీరోలు దొరికితే పండగే. అందుకే పట్టు వదలకుండా ట్రై చేసి ఆఖరికి సక్సెస్ అయ్యాడని సమాచారం.

అయితే అధికారికంగా ప్రకటన వచ్చేదాకా నిర్ధారణగా చెప్పలేం. దసరా, హాయ్ నాన్న, సరిపోదా శనివారం ఇలా బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్స్ తో దూసుకుపోతున్న నాని ఈసారి హిట్ 3, ది ప్యారడైజ్ తో ప్యాన్ ఇండియా మార్కెట్ ని పెంచుకునే పనిలో ఉన్నాడు. ఇన్ సైడ్ టాక్స్ నిజమయ్యేలానే వినిపిస్తున్నాయి.

This post was last modified on February 5, 2025 3:09 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

పెద్ది మెడకు పర్సెంటేజ్ గొడవ

తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…

42 minutes ago

‘నీట్’ గా పేపర్ అమ్మేశారట!

నీట్ యూజీ పేపర్ లీక్ వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా 22 మంది లక్షల విద్యార్థుల…

45 minutes ago

భగీరథ్ కేసు వాదించేది వైసీపీ ఎంపీనే

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ పై పోక్సో కేసు నమోదైన సంగతి తెలిసిందే.…

2 hours ago

కేరళం ‘సీల్డ్ కవర్’ తెరచుకునేదెన్నడో..?

దేశంలో ఇటీవలే ముగిసిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎప్పుడో వెలువడ్డాయి. ఆ ఐదు రాష్ట్రాల్లో నాలుగు రాష్ట్రాల్లో…

2 hours ago

ప్రజలను ఆందోళనకు గురి చేస్తున్న మోదీ వ్యాఖ్యలు

యావత్తు ప్రపంచాన్ని కరోనా చుట్టుముట్టిన తరుణంలో లాక్ డౌన్ అంటే ఏమిటో… ఎలా ఉంటుందో చూశాం. ఇప్పుడు కరోనా లాంటి…

5 hours ago

ఒక్క ఓటుతో గెలిస్తే ఓటేయొద్దా…?

తమిళ రాజకీయాల్లో వరుసబెట్టి ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. తమిళనాడు అసెంబ్లీకి జరిగిన ఎన్నికల ఫలితాలు వెలువడిన దగ్గర నుంచి రోజుకో…

6 hours ago