Movie News

రమేష్ బాబు కామెంట్ – బండ్ల గణేష్ కౌంటర్

ఇవాళ సీనియర్ నిర్మాత, ఫైనాన్షియర్ శింగనమల రమేష్ బాబు ప్రెస్ మీట్ నిర్వహించడం ఇండస్ట్రీ వర్గాల్లో ఆసక్తి రేపింది. పధ్నాలుగు సంవత్సరాలు పరిశ్రమకు దూరంగా ఉన్న ప్రొడ్యూసర్ ఇంత హఠాత్తుగా మీడియా ముందుకు రావడం పట్ల ఆశ్చర్యం వ్యక్తమయ్యింది.

గతంలో తను పడిన సాధక బాధలు, భవిష్యత్ ప్రణాళికలు వివరించడానికి వచ్చిన రమేష్ బాబు ఖలేజా, కొమరం పులి వల్ల 100 కోట్లు నష్టపోయానని, అలాంటి పరిస్థితిలో హీరోలు కనీసం అయ్యో పాపం అనలేదని వాపోవడం ఫ్యాన్స్ ని ఆశ్చర్యపరిచింది. అంటే నేరుగా పవన్ కళ్యాణ్, మహేష్ బాబునే నిందించిన అర్థం రావడంతో ఇదో హాట్ టాపిక్ అయ్యింది.

దీనికి మరో నిర్మాత బండ్ల గణేష్ ఎక్స్ వేదికగా స్పందించారు. కొమరం పులి టైంలో పవన్ కళ్యాణ్ వేరొకరికి డేట్లు ఇవ్వకుండా కేవలం మీ కోసమే కొన్ని వందల కాల్ షీట్లు వృథా చేసుకున్నారని, దానికి ప్రత్యక్ష సాక్షిని నేనేనంటూ బాంబు పేల్చడంతో ఒక్కసారిగా కథ మలుపు తిరిగినట్టు అయ్యింది.

నిజానికి ఆ రెండు సినిమాలు జాప్యం కావడం వెనుక చాలా కారణాలున్నాయి. ప్రత్యక్షంగా పరోక్షంగా మహేష్, పవన్ బాధ్యులు కాదని అప్పట్లో కథనాలు వచ్చాయి. ఆర్థిక ఇబ్బందుల వల్ల నిర్మాణ సంస్థ వైపు నుంచే ఆలస్యం జరిగిందని చెప్పేవారు. నిజా నిజాలు ఆధారాలతో ఇప్పుడు బయటికి రావడం కష్టం కానీ మొత్తనికో చర్చ మొదలైంది.

ఇన్నేళ్లు మౌనంగా ఉండి ఇప్పుడు హఠాత్తుగా తెరమీదకు రావడం వెనుక ఉద్దేశం కేసుల నుంచి విముక్తి పొందానని చెప్పడమే అయినా సోషల్ మీడియా పుణ్యమాని ప్రతి విషయం సున్నితంగా మారిపోయి శల్యపరీక్షకు గురవుతున్న ట్రెండ్ లో కొత్తవాళ్ళైనా పాతవాళ్ళైనా ఆచితూచి మాట్లాడ్డం అవసరం.

లేదంటే ఇలాంటి కౌంటర్లు వస్తుంటాయి. పవన్ కు అత్యంత సన్నిహితుడిగా ఉన్న బండ్ల గణేష్ అంత బలంగా చెప్పారంటే ఏదో ఆషామాషీగా అయితే అయ్యుండదు. దర్శకుడు ఎస్జె సూర్య స్పందించే ఛాన్స్ లేకపోలేదు. వివాదాలకు దూరంగా ఉండే త్రివిక్రమ్, మహేష్ నుంచి ఏమైనా చెప్పడం డౌటే. ఏదైతేనేం ట్విట్టర్ కో స్టఫ్ అయితే దొరికింది.

This post was last modified on February 5, 2025 3:01 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

తిరస్కరించిన సినిమాకు హడావిడి ఎందుకయ్యా

ఒకప్పటి డిజాస్టర్లు ఇప్పుడు రీ రిలీజ్ ట్రెండ్ లో బాగా ఆడటం గమనిస్తున్నాం. ఆరెంజ్ మూడుసార్లు వచ్చినా కలెక్షన్లు కుమ్మరించింది.…

2 hours ago

అప్పులు కట్టుకుంటున్న మంచు లక్ష్మీ

టాలీవుడ్లో ఘ‌న చ‌రిత్ర ఉన్న బేన‌ర్లో ల‌క్ష్మీప్ర‌స‌న్న పిక్చ‌ర్స్ ఒక‌టి. ఈ బేన‌ర్ మీద ప‌దుల సంఖ్య‌లో సినిమాలు తీశారు…

3 hours ago

రెండో పెళ్లి మీద హీరోయిన్ ఆసక్తి

‘యమదొంగ’ చిత్రంతో టాలీవుడ్లోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది మలయాళ భామ మమతా మోహన్ దాస్. ఆ చిత్రంలో చలాకీ పాత్ర…

6 hours ago

మరోసారి కన్నీరు పెట్టిన ఎర్రబెల్లి

ఇరు తెలుగు రాష్ట్రాలకు చెందిన రాజకీయ నాయకుల్లో చాలామంది పెద్దగా భావోద్వేగాలకు లోను కారు. మిన్ను విరిగి మీద పడ్డా…ఎన్నికల…

7 hours ago

మెరుగైన ఛాయిస్ కోసం రావిపూడి వేట

మన శంకరవరప్రసాద్ గారు రూపంలో చిరంజీవికి బ్లాక్ బస్టర్ కానుక ఇచ్చి రెమ్యునరేషన్ తో పాటు రేంజ్ రోవర్ కారు…

7 hours ago

సుప్రీం కోర్టు తీర్పుపై నటి తల్లి ఏమన్నారు?

24 ఏళ్ల కిందట ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనే కాక దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయిన నటి ప్రత్యూష మృతి వ్యవహారంలో సుప్రీం కోర్టు…

8 hours ago