తెలుగులో వచ్చిన ఉత్తమ ప్రేమకథా చిత్రాల్లో ‘మనసంతా నువ్వే’ ఒకటి. అప్పటి యువతకు ఇది ఒక మధుర జ్ఞాపకం. ఆ సినిమాను ఇప్పుడు తలుచుకున్నా వాళ్లందరికీ మనసు పులకరిస్తుంది. ఈ చిత్రంతో ఉదయ్ కిరణ్ స్టార్ అయిపోయాడు. యువ ప్రేక్షకుల్లో తిరుగులేని ఫాలోయింగ్ సంపాదించాడు. దర్శకుడు వి.ఎన్.ఆదిత్య ఈ చిత్రంతోనే టాలీవుడ్లోకి ఘనంగా అరంగేట్రం చేశాడు. నిర్మాత ఎం.ఎస్.రాజుకు లైఫ్ ఇచ్చిన సినిమా ఇది. ‘మనసంతా నువ్వే’ విడుదలై 19 ఏళ్లు పూర్తయిన నేపథ్యంలో ఈ సినిమా మొదలవడానికి ముందు జరిగిన కథను ఆయన సోషల్ మీడియాలో పంచుకున్నారు.
90ల్లో శత్రువు, దేవి లాంటి బ్లాక్బస్టర్లు అందించిన ఎం.ఎస్.రాజు.. భారీ బడ్జెట్లో చేసిన సాహసోపేత సినిమా ‘దేవి పుత్రుడు’ 2001 సంక్రాంతికి విడుదలై డిజాస్టర్ అయింది. ఆ సినిమా మీద పెట్టిన రూ.14 కోట్లు బూడిదలో పోసిన పన్నీరే అయ్యాయి. అప్పటిదాకా సినీ పరిశ్రమలో రాజు సాధించిందంతా ఈ సినిమాతో కొట్టుకుపోయింది. దీని దెబ్బకు కుంగిపోయిన రాజు.. అంత సులువుగా కోలుకోలేకపోయారు. తర్వాత ఏదైనా అద్భుతం చేయాలని ఆరాటపడ్డారు. అప్పుడే ఓ చిన్న సినిమాతో పుంజుకోవాలనుకున్నారు. అలాంటి సమయంలో రాజు ఒక పాత కాలం నాటి బ్లాక్ అండ్ వైట్ సినిమా చూశారు. అందులో హీరో హీరోయిన్లు ఒకరినొకరు కలుసుకోవడానికి ఎంతో తపన పడతారు. అది చూడగానే ఈ ఐడియాతో సినిమా తీయాలనిపించింది రాజుకు.
వెంటనే పరుచూరి సోదరులకు, కెమెరామ్యాన్ గోపాల్ రెడ్డికి ఆ ఐడియా చెబితే బాగా నచ్చేసింది. అప్పటిదాకా తన బేనర్లో అన్ని సినిమాలూ డైరెక్ట్ చేసిన కోడి రామకృష్ణనే ఈ సినిమాకూ పెట్టుకుందామనుకుంటే ఆయనకు ఖాళీ లేదు. తర్వాత గోపాల్ రెడ్డి సూచన మేరకు వి.ఎన్.ఆదిత్యను దర్శకుడిగా తీసుకున్నారు రాజు. దర్శకుడు తేజకు ఫోన్ చేస్తే హీరోగా ఉదయ్ కిరణ్ను సజెస్ట్ చేశాడు. సంగీత దర్శకుడిగా తన ‘దేవి’ సినిమాకు పని చేసిన దేవిశ్రీ ప్రసాద్నే తీసుకుందామనుకుంటే కుదరక ఆర్పీ పట్నాయక్కు ఎంచుకున్నారు రాజు. ఒక్క రోజులోనే ట్యూన్లనే ఓకే అయిపోయాయి.
మే 1న రాజుకు ‘మనసంతా నువ్వే’కు సంబంధించి ఐడియా రాగా.. 10న సినిమాకు పూజ జరిగింది. జూన్ 1న షూటింగ్ మొదలుపెట్టాలి. అరకుకు వెళ్లి అక్కడ స్టోరీ సిట్టింగ్స్ వేయగా.. 20 రోజుల్లో స్క్రిప్టు రెడీ అయిపోయింది. జూన్ 1న షూటింగ్ మొదలైంది. నాలుగు నెలల్లో సినిమా అయిపోయింది. ఎన్నో బిజినెస్ ఆఫర్లు వచ్చినా.. రాజు సొంతంగా రిలీజ్ చేశారు. అక్టోబరు 19న విడుదలైన ‘మనసంతా నువ్వే’ సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. రూ.1.3 కోట్లతో తీసిన సినిమా అప్పట్లోనే రూ.16 కోట్లు వసూలు చేయడం విశేషం. ఈ దెబ్బతో రాజు ఆర్థిక సమస్యలన్నీ తీరిపోయాయి.
This post was last modified on October 20, 2020 11:49 am
అభిమానులందు పవన్ అభిమానులు వేరయా అంటే అందులో అతిశయోక్తి ఏమీ లేదు. ఆయనకున్న లాయల్ ఫ్యాన్ బేస్ ఇండియా మొత్తంలో…
బాలీవుడ్ ఖిలాడీ అక్షయ్ కుమార్ ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద సరైన సక్సెస్ కోసం ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో తనకి ఎన్నో…
వందల కోట్లతో ప్యాన్ ఇండియా మూవీస్ తీస్తున్నప్పుడు పెద్ద ఎత్తున ప్రమోషన్లు అవసరం. ఎవరికైనా ఇది తప్పదు. ఎప్పుడో 2027…
కొన్నేళ్ల ముందు నందమూరి తారకరత్న ఒక రాజకీయ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా గుండెపోటుకు గురి కావడం, కొన్ని రోజుల పాటు…
ప్రియాంకా చోప్రా మన ప్రేక్షకులకు కొత్త కాదు. హిందీ సినిమాలు రెగ్యులర్ గా ఫాలో అయ్యేవాళ్ళు, రామ్ చరణ్ జంజీర్…
నాగచైతన్యను ఇప్పటివరకు క్లాస్ లుక్లో, లవర్ బాయ్గా చూసి అలవాటు పడ్డ కళ్లకు ఈ ఫొటో ఒక్కసారిగా షాక్ ఇస్తోంది.…