Movie News

మనసంతా నువ్వే.. తెర వెనుక కథ

తెలుగులో వచ్చిన ఉత్తమ ప్రేమకథా చిత్రాల్లో ‘మనసంతా నువ్వే’ ఒకటి. అప్పటి యువతకు ఇది ఒక మధుర జ్ఞాపకం. ఆ సినిమాను ఇప్పుడు తలుచుకున్నా వాళ్లందరికీ మనసు పులకరిస్తుంది. ఈ చిత్రంతో ఉదయ్ కిరణ్ స్టార్ అయిపోయాడు. యువ ప్రేక్షకుల్లో తిరుగులేని ఫాలోయింగ్ సంపాదించాడు. దర్శకుడు వి.ఎన్.ఆదిత్య ఈ చిత్రంతోనే టాలీవుడ్లోకి ఘనంగా అరంగేట్రం చేశాడు. నిర్మాత ఎం.ఎస్.రాజుకు లైఫ్ ఇచ్చిన సినిమా ఇది. ‘మనసంతా నువ్వే’ విడుదలై 19 ఏళ్లు పూర్తయిన నేపథ్యంలో ఈ సినిమా మొదలవడానికి ముందు జరిగిన కథను ఆయన సోషల్ మీడియాలో పంచుకున్నారు.

90ల్లో శత్రువు, దేవి లాంటి బ్లాక్‌బస్టర్లు అందించిన ఎం.ఎస్.రాజు.. భారీ బడ్జెట్లో చేసిన సాహసోపేత సినిమా ‘దేవి పుత్రుడు’ 2001 సంక్రాంతికి విడుదలై డిజాస్టర్ అయింది. ఆ సినిమా మీద పెట్టిన రూ.14 కోట్లు బూడిదలో పోసిన పన్నీరే అయ్యాయి. అప్పటిదాకా సినీ పరిశ్రమలో రాజు సాధించిందంతా ఈ సినిమాతో కొట్టుకుపోయింది. దీని దెబ్బకు కుంగిపోయిన రాజు.. అంత సులువుగా కోలుకోలేకపోయారు. తర్వాత ఏదైనా అద్భుతం చేయాలని ఆరాటపడ్డారు. అప్పుడే ఓ చిన్న సినిమాతో పుంజుకోవాలనుకున్నారు. అలాంటి సమయంలో రాజు ఒక పాత కాలం నాటి బ్లాక్ అండ్ వైట్ సినిమా చూశారు. అందులో హీరో హీరోయిన్లు ఒకరినొకరు కలుసుకోవడానికి ఎంతో తపన పడతారు. అది చూడగానే ఈ ఐడియాతో సినిమా తీయాలనిపించింది రాజుకు.

వెంటనే పరుచూరి సోదరులకు, కెమెరామ్యాన్ గోపాల్ రెడ్డికి ఆ ఐడియా చెబితే బాగా నచ్చేసింది. అప్పటిదాకా తన బేనర్లో అన్ని సినిమాలూ డైరెక్ట్ చేసిన కోడి రామకృష్ణనే ఈ సినిమాకూ పెట్టుకుందామనుకుంటే ఆయనకు ఖాళీ లేదు. తర్వాత గోపాల్ రెడ్డి సూచన మేరకు వి.ఎన్.ఆదిత్యను దర్శకుడిగా తీసుకున్నారు రాజు. దర్శకుడు తేజకు ఫోన్ చేస్తే హీరోగా ఉదయ్ కిరణ్‌ను సజెస్ట్ చేశాడు. సంగీత దర్శకుడిగా తన ‘దేవి’ సినిమాకు పని చేసిన దేవిశ్రీ ప్రసాద్‌నే తీసుకుందామనుకుంటే కుదరక ఆర్పీ పట్నాయక్‌కు ఎంచుకున్నారు రాజు. ఒక్క రోజులోనే ట్యూన్లనే ఓకే అయిపోయాయి.

మే 1న రాజుకు ‘మనసంతా నువ్వే’కు సంబంధించి ఐడియా రాగా.. 10న సినిమాకు పూజ జరిగింది. జూన్ 1న షూటింగ్ మొదలుపెట్టాలి. అరకుకు వెళ్లి అక్కడ స్టోరీ సిట్టింగ్స్ వేయగా.. 20 రోజుల్లో స్క్రిప్టు రెడీ అయిపోయింది. జూన్ 1న షూటింగ్ మొదలైంది. నాలుగు నెలల్లో సినిమా అయిపోయింది. ఎన్నో బిజినెస్ ఆఫర్లు వచ్చినా.. రాజు సొంతంగా రిలీజ్ చేశారు. అక్టోబరు 19న విడుదలైన ‘మనసంతా నువ్వే’ సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. రూ.1.3 కోట్లతో తీసిన సినిమా అప్పట్లోనే రూ.16 కోట్లు వసూలు చేయడం విశేషం. ఈ దెబ్బతో రాజు ఆర్థిక సమస్యలన్నీ తీరిపోయాయి.

This post was last modified on October 20, 2020 11:49 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

కర్ణాటకలో తెలుగు కనపడకూడదా?

కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…

1 hour ago

రష్యా అధ్యక్షుడికి గోంగూర, ఆవకాయ తినిపించిన మోదీ

వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…

3 hours ago

చిరుకి మమ్ముట్టితో పోలిక ముమ్మాటికీ రాంగే

ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…

4 hours ago

మూడున్నర గంటల దురంధర్ మెప్పించాడా

ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…

4 hours ago

అఖండ 2 నెక్స్ట్ ఏం చేయబోతున్నారు

బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…

5 hours ago

`ఏఐ`లో ఏపీ దూకుడు.. పార్ల‌మెంటు సాక్షిగా కేంద్రం!

ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్‌(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉంద‌ని కేంద్ర ప్ర‌భుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్ప‌త్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…

7 hours ago