విక్టరీ వెంకటేష్ మొట్టమొదటి వెబ్ సిరీస్ గా 2023 మార్చిలో విడుదలైన రానా నాయుడు భారీ స్థాయిలో మిలియన్ల కొద్దీ వ్యూస్ తెచ్చుకుంది కానీ విమర్శలు కూడా అంతే స్థాయిలో వచ్చాయి. బూతులు ఎక్కువయ్యాయని, వెంకీ లాంటి ఫ్యామిలీ హీరో నుంచి ఇలాంటివి ఆశించలేదని సోషల్ మీడియాలో కామెంట్స్ వెల్లువెత్తాయి.
తొలుత ఇవి మాములేనని భావించినా తర్వాత వాటిలో సీరియస్ నెస్ గుర్తించిన వెంకటేష్ రెండో సీజన్ లో డోస్ తగ్గించేలా జాగ్రత్తలు తీసుకున్నామని చెప్పడం ఇటీవలి ప్రెస్ మీట్ లో చూశాం. ఈ నేపథ్యంలో రానా నాయుడు 2 రిలీజ్ కు రంగం సిద్ధమవుతోంది. తాజాగా టీజర్ వచ్చింది.
పైన భలే టైమింగ్ అని చెప్పడంలో లాజిక్ ఉంది. ఇటీవలే సంక్రాంతికి వస్తున్నాంతో రీజనల్ ఫిలింస్ లో ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్ అందుకున్న వెంకటేష్ చాలా ఏళ్ళ తర్వాత ఇంత గొప్ప విజయం సాధించారు. థియేటర్లకు రావడం మానేసిన ఎందరో ప్రేక్షకులు కేవలం టాక్ విని బయటికి కదిలారు.
ఎంతగా అంటే మూడు వారాలు దాటకుండానే మూడు వందల కోట్ల వసూళ్లు దాటించేంత. సో కొన్ని సంవత్సరాలుగా రేసులో వెనుకబడినట్టు అనిపించిన వెంకీ ఒక్కసారిగా చిరంజీవి రికార్డులనే సవాల్ చేసేలా పరుగులు పెడుతున్నాడు. తండేల్ వచ్చేదాకా వెంకీ మామ దూకుడు ఆగేలా కనిపించడం లేదు.
ఇదంతా రానా నాయుడు 2కి చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే సంక్రాంతికి వస్తున్నాం తర్వాత వెంకటేష్ కనిపించబోయే ఫ్రెష్ రిలీజ్ ఇదే కాబట్టి సహజంగానే అధిక శాతం ఆడియన్స్ చూసేందుకు ప్రాధాన్యం ఇస్తారు. ఎలాగూ డబుల్ మీనింగులు తగ్గించామని హామీ ఇచ్చారు కనక వ్యూయర్ షిప్ మతిపోయేలా వచ్చినా ఆశ్చర్యం లేదు.
కాకపోతే టాక్, రివ్యూలు కీలక పాత్ర పోషించనున్నాయి. వెంకీ సైతం దగ్గరుండి టీమ్ కు పలు సూచనలు చేసే అవకాశాలు లేకపోలేదు. రానా సీక్వెల్ లోనూ కొనసాగుతూ ఉండగా అర్జున్ రామ్ పాల్ లాంటి క్రేజీ క్యాస్టింగ్ తోడయ్యింది. స్ట్రీమింగ్ డేట్ ఇంకా లాక్ చేయలేదు. వేసవిలో రావొచ్చు.
టాలీవుడ్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమా మొత్తానికి ముహూర్త వేడుకను ముగించింది. విక్టరీ వెంకటేష్, నందమూరి కళ్యాణ్ రామ్…
టాలీవుడ్ లో క్లాసిక్ లుక్స్ తో ప్రేక్షకుల మనసు గెలుచుకున్న హీరోయిన్లలో మృణాల్ థాకూర్ ఒకరు. సీతారామం సినిమాతో తెలుగు…
పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ కావడం ఇప్పుడు చాలా కామన్ పాయింట్. కానీ ప్రభాస్, సందీప్ రెడ్డి వంగా…
ధనుష్ కొత్త సినిమా పేరు 'ఓం'గా ఫిక్సయ్యింది. అమరన్ ఫేమ్ రాజ్ కుమార్ పెరియస్వామి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ యాక్షన్…
తెలుగులో ఇప్పుడు నిర్మాతల పరిస్థితి ఎంత ఇబ్బందికరంగా మారిందో తెలిసిందే. నిలకడగా విజయాలు అందుకుని, లాభాలు దక్కించుకునే నిర్మాతలు అరుదైపోయారు.…
విజయవాడలో కనిపించకుండా పోయిన గాదె సాయికృష్ణ వ్యవహారం అంతకంతకూ జఠిలంగా మారుతోంది. సాయికృష్ణ బతికి లేడని, అతడిని పోలీసులే అంతమొందించారని…