ముంబయి భామ పూజా హెగ్డే ఊపు ఇప్పుడు మామూలుగా లేదు. ఆమె టాలీవుడ్లో ప్రస్తుతం మకుటం లేని మహారాణి. ఆల్రెడీ అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్, మహేష్ బాబు లాంటి స్టార్లతో ఆడి పాడేసింది. మిగతా బడా స్టార్లు కూడా ఆమెతో సినిమాలు చేయడానికి ఆసక్తితో ఉన్నారు. మరే హీరోయిన్ కూడా పూజాకు దరిదాపుల్లో లేరిప్పుడు.
మరోవైపు తన మాతృభాష హిందీలోనూ పూజాకు మంచి డిమాండే ఉంది. ఆల్రెడీ ఆమె హృతిక్ రోషన్, అక్షయ్ కుమార్ లాంటి బడా హీరోలతో నటించింది. త్వరలోనే ఆమె సల్మాన్ ఖాన్ సరసన నటించబోతోందంటూ వార్తలొస్తున్నాయి. కానీ ఆ విషయమై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. ఈలోపు ఒక క్రేజీ, భారీ చిత్రంలో పూజాకు అవకాశం దక్కింది. ఆ సినిమా పేరు.. సర్కస్.
బాలీవుడ్లో ఎంటర్టైనర్లకు కేరాఫ్ అడ్రస్గా, హిట్ మెషీన్గా పేరు తెచ్చుకున్న రోహిత్ శెట్టి రూపొందించబోయే కొత్త కామెడీ మూవీ సర్కస్. ఇంతకుముందు అతడితో ‘సింబా’ లాంటి బ్లాక్బస్టర్ అందించిన రణ్వీర్ సింగ్ ఇందులో హీరోగా నటించనున్నాడు. అగ్ర నిర్మాత భూషణ్ కుమార్ ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేయబోతున్నాడు. ఇంతకుముందు ‘గోల్ మాల్’ సిరీస్తో ప్రేక్షకులను ఉర్రూతలూగించిన రోహిత్.. ఇప్పుడు ‘సర్కస్’ను కూడా కామెడీ ఫ్రాంఛైజీగా రూపొందించనున్నాడట. అంటే ఈ సిరీస్లో ఆ తర్వాత కూడా సినిమాలు వస్తాయన్నమాట. అదే నిజమైతే పూజా పంట పండినట్లే.
చివరగా పూజా ‘హౌస్ ఫుల్-4’లో నటించింది. దానికి నెగెటివ్ టాక్ వచ్చినా భారీగానే వసూళ్లు రాబట్టింది. ఓవైపు సల్మాన్ సినిమాలో ఛాన్స్ అనుకుంటుండగానే.. రణ్వీర్తో నటించే అవకాశం రావడం పట్ల పూజ ఎంత సంతోషంగా ఉంటుందో చెప్పాల్సిన పని లేదు. ఇక తెలుగు సినిమాల విషయానికి వస్తే పూజా.. ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’తో త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆ తర్వాత ప్రభాస్ సరసన నటిస్తున్న ‘రాధేశ్యామ్’ లాంటి భారీ చిత్రంతో పలకరిస్తుంది.
This post was last modified on October 20, 2020 8:44 am
భోగాపురం విమానాశ్రయం నిర్మాణానికి కొబ్బరికాయ కొట్టింది నేనే, గుమ్మడికాయ కట్టింది నేనే అని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించిన విషయం తెలిసిందే.…
నేచురల్ స్టార్ నాని కేవలం నటుడిగానే కాకుండా 'వాల్ పోస్టర్ సినిమా' బ్యానర్పై నిర్మాతగా కూడా తనకంటూ ఒక ప్రత్యేకమైన…
టాలీవుడ్లో మంచి అభిరుచి ఉన్న దర్శకుల్లో క్రిష్ ఒకడు. దాదాపు రెండు దశాబ్దాల కెరీర్లో క్రిష్ ఎన్నడూ రొటీన్ సినిమా…
మంచి టాలెంట్ ఉన్న యంగ్ జనరేషన్ దర్శకులు కెరీర్ ప్రారంభంలో హిట్లు అందుకున్నప్పటికీ దాన్ని నిలబెట్టుకునే క్రమంలో, కథల ఎంపికలో…
స్నేహమేరా జీవితం, స్నేహమేరా శాశ్వతం అని సినిమాల్లో చూడటమే కానీ నిజ జీవితంలో దాన్ని ఆచరించే వాళ్ళను వేళ్ళ మీద…
ఒక జడ్జి ప్రజల్ని చీమలతో పోల్చితో మరొకరు నిరుద్యోగులను బొద్దింకలతో పోల్చడం దేశ ప్రజలను విస్మయానికి గురి చేసింది. దాని…