తండేల్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో దిల్ రాజు వేదికపైకి వచ్చినప్పుడు ఆయన గురించి అల్లు అరవింద్ చెప్పిన మాటలు సోషల్ మీడియాలో చర్చకు దారి తీస్తున్నాయి. ఒకే వారంలో ఒక సినిమాని కిందికి చూసి మరొక సినిమాను ఎక్కడికో తీసుకెళ్లి చరిత్ర సృష్టించారని చెప్పడం కొందరు మెగా ఫ్యాన్స్ ఆగ్రహానికి కారణమవుతోంది.
గేమ్ ఛేంజర్ గురించి కావాలనే ప్రస్తావించారని వాళ్ళ అభిప్రాయం. అక్కడ పేర్లు ప్రస్తావించకపోయినా అరవింద్ స్పష్టంగా చెప్పిన దాన్ని బట్టి ఒక ఫ్లాప్ ఒక బ్లాక్ బస్టర్ ఏవో అందరికీ తెలిసిన విషయాలే. సరే ఆయన ఉద్దేశంలో అర్థం ఉందా అపార్థముందా అనేది కొంత విశ్లేషించుకుంటే అర్థమవుతుంది.
నిజానికి అరవింద్ చెప్పాలనుకున్నది ఒకదానితో మరొకటి సంబంధం లేని రెండు వ్యతిరేక ఫలితాలను దిల్ రాజు చూశారని. వాటితో పాటు ఇన్కమ్ టాక్స్ దాడులను ఆహ్వానించారని. అంతే తప్ప గేమ్ ఛేంజర్ పోయింది కాబట్టి నాకేదో ఆనందంగా ఉందని కాదు. ఆ మాటకొస్తే మేనల్లుడు రామ్ చరణ్ కు ఇలా జరగాలని ఆయనైనా ఎందుకు కోరుకుంటారనేది బన్నీ ఫ్యాన్స్ లాజిక్.
అన్ స్టాపబుల్ షోలో ఔటింగ్ కు మెగా బ్రదర్స్ లో ఎవరితో వెళ్తావంటే చరణ్ చెప్పిన సమాధానం అరవింద్ మావయ్య. అంటే ఎంత ఘాడమైన బంధం లేనిదే అలా అనడు కదా. ఇవన్నీ కాస్త లోతుగా ఆలోచించాల్సిన విషయాలు.
ఇదేదో అరవింద్ గారిని సమర్ధించడం కాదు. ఆ మాటకొస్తే గేమ్ ఛేంజర్ లాంటి డిజాస్టర్లు నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ గా ఆయన ఎన్నో చూశారు. ఇప్పుడేదో కొత్తగా జరిగింది కాదు. యధాలాపంగా అన్నదానికి విపరీత అర్థాలు తీస్తే ఎవరైనా చేయగలిగింది ఏమీ లేదు కానీ మొత్తానికి ఈ పరిణామం తండేల్ మీద ప్రభావం చూపించకోపోతే చాలు.
దర్శకుడు చందూ మొండేటి కన్నా కంటెంట్ మీద బలమైన నమ్మకం చూపిస్తోంది అరవిందే. అందుకే రిలీజ్ డేట్ గురించి తొందపడకుండా సంక్రాంతి మిస్ అయినా సోలో తేదీ వచ్చేలా ఫిబ్రవరి 7 ఎంచుకున్నారు. మంచి ఓపెనింగ్స్ కి తేవడంలో ఈ నిర్ణయం చాలా దోహదం చేయనుంది.
This post was last modified on February 3, 2025 11:44 am
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…