పెద్ద బేనర్లు కేవలం భారీ సినిమాలకే పరిమితం కాకుండా అప్పుడప్పుడూ చిన్న ప్రాజెక్టులను టేకప్ చేస్తుండటం గమనించవచ్చు. ప్రస్తుతం టాలీవుడ్లో అగ్ర నిర్మాణ సంస్థలుగా ఉన్న శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్, గీతా ఆర్ట్స్, యువి క్రియేుషన్స్, మైత్రీ మూవీ మేకర్స్.. ఇవన్నీ కూడా చిన్న సినిమాలను టేకప్ చేస్తున్నవే. ఈ కోవలోకి శ్రీ వేంకటేశ్వర సినీ చిత్ర కూడా చేరింది.
సీనియర్ నిర్మాత బి.వి.ఎస్.ఎన్. ప్రసాద్ ఆధ్వర్యంలో నడిచే ఈ సంస్థ ఛత్రపతి, అత్తారింటికి దారేది లాంటి భారీ చిత్రాలను నిర్మించింది. ఈ మధ్య కొంచెం రేంజ్ తగ్గించుకుని తొలి ప్రేమ, మిస్టర్ మజ్ను, సోలో బ్రతుకే సో బెటర్ లాంటి మీడియం రేంజ్ బడ్జెట్ సినిమాలను నిర్మిస్తూ వచ్చింది. ఇప్పుడా సంస్థ ప్రయోగాత్మకంగా ఒక చిన్న సినిమాను లైన్లో పెట్టింది. ఆ సినిమా పేరు.. నిన్నిలా నిన్నిలా.
ఆసక్తికర కాస్టింగ్తో తెరకెక్కుతున్న సినిమా ‘నిన్నిలా నిన్నిలా’. ఈ చిత్రంతో తమిళ కథానాయకుడు అశోక్ సెల్వన్ తెలుగులోకి అడుగు పెడుతున్నాడు. డబ్బింగ్ మూవీ భద్రమ్, పిజ్జా-2లతో తెలుగు ప్రేక్షకులకు ఓ మోస్తరుగా పరిచయం ఉన్నాడు అశోక్. ఈ మధ్యే అతను తమిళంలో ‘ఓ మై కడవులే’తో భారీ విజయాన్నందుకున్నాడు. ‘నిన్నిలా నిన్నిలా’లో అతడి సరసన సీనియర్ హీరోయిన్ నిత్యా మీనన్తో పాటు తెలుగమ్మాయి రీతూ వర్మ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఒక ఇంట్రెస్టింగ్ ఫస్ట్ లుక్తో ఈ చిత్రం ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది.
కిచెన్లోని ప్లేట్లలో లీడ్ యాక్టర్ల తలలు కనిపిస్తున్నాయి. అలాగే రకరకాల ఆహార పదార్థాలు కూడా ఉన్నాయి. చూస్తుంటే ఇది ఫుడ్, కిచెన్ చుట్టూ తిరిగే సినిమానేమో అనిపిస్తోంది. ‘కుకింగ్ సూన్’ అంటూ పోస్టర్ మీద వేశారు కూడా. అని శశి అనే కొత్త దర్శకుడు ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాడు. దివాకర్ మణి ఛాయాగ్రహణం అందిస్తున్న ఈ చిత్రానికి రాజేష్ మురుగేశన్ సంగీతం సమకూరుస్తున్నాడు.
This post was last modified on October 20, 2020 8:29 am
ఒకప్పుడు టాలీవుడ్లో తిరుగులేని ఆధిపత్యం చలాయించిన కథానాయికల్లో తమన్నా ఒకరు. టీనేజీలోనే కథానాయిక అవతారం ఎత్తిన ఆమె పదేళ్లకు పైగానే టాప్…
థియేటర్, ఓటిటి మధ్య ఖచ్చితంగా ఎనిమిది వారాల గ్యాప్ ఉండాలనే నిబంధన మీద దక్షిణాది ఇండస్ట్రీ పెద్దలు చాలా సీరియస్…
అధికారంలోకి రావడానికి ముందు వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా ఫెరోషియస్గా కనిపించేవారు. అవినీతి కేసుల వ్యవహారం పక్కన పెడితే…
‘బాహుబలి’ సినిమాకు బాలీవుడ్ నుంచి అప్పట్లో ఎంత గొప్ప సహకారం అందిందో తెలిసిందే. కరణ్ జోహార్ లాంటి అగ్ర నిర్మాత ఆ…
మోనాలిసా.. గత ఏడాది సోషల్ మీడియాను ఒక ఊపు ఊపేసిన పేరిది. ఉత్తర్ప్రదేశ్లో జరిగిన మహా కుంభమేళాతో వెలుగులోకి వచ్చిన…
తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, మాజీ మంత్రి పార్టీ కీలక…