వచ్చే వారం ఫిబ్రవరి 7 విడుదల కాబోతున్న తండేల్ మీద క్రమంగా అంచనాలు పెరుగుతున్నాయి. నాగచైతన్య కెరీర్ లో మొదటి ప్యాన్ ఇండియా మూవీ కావడంతో అక్కినేని అభిమానులు భారీ ఆశలు పెట్టుకున్నారు. దానికి తగ్గట్టే మూడు పాటలు ఛార్ట్ బస్టర్స్ కావడం, ట్రైలర్ కు పాజిటివ్ రెస్పాన్స్ రావడం ఇలా అన్ని శుభ శకునాలే కనిపిస్తున్నాయి.
ముఖ్యంగా దేవిశ్రీ ప్రసాద్ తన మీద నమ్మకాన్ని నిలబెట్టుకునే దిశగా మంచి మ్యూజిక్ ఇవ్వడం తండేల్ కి చాలా ప్లస్ కానుంది. పుష్ప 2 ది రూల్ తర్వాత మరో బెస్ట్ ఆల్బమ్ ఇస్తున్నాడన్న భరోసా అయితే దొరికింది. దీని వెనుక ఇంటరెస్టింగ్ కథుంది. అదేంటో చూద్దాం.
షూటింగ్ కు ముందు తండేల్ సంగీత దర్శకుడిగా ఎవరిని పెట్టుకోవాలనే మీమాంస నిర్మాత అల్లు అరవింద్ కు మొదలయ్యింది. ముందు దేవిశ్రీ ప్రసాద్ నే అనుకున్నారు కానీ పుష్ప 2తో తన కమిట్ మెంట్ దృష్ట్యా మొత్తం వాళ్లే పిండేసుకుంటారు కాబట్టి తమకు అంత టైం ఇవ్వకపోవచ్చనే అనుమానంతో నిర్ణయం వాయిదా వేసుకున్నారు.
ఓసారి ఇంట్లో అల్లు అరవింద్ ఇదే విషయాన్ని బన్నీ దగ్గర ప్రస్తావించారు. నిన్ను, సుకుమార్ ని అడిగి ఇబ్బంది పెట్టడం ఇష్టం లేదని అన్నారు. దీనికి బదులుగా అల్లు అర్జున్ ప్రేమకథకు డిఎస్పి కాకుండా ఇంకెవరినో ఆలోచించడం ఏమిటని చెప్పి లాక్ చేయించాడు.
అలా అరవింద్ అనుమాన పడిన దేవి ప్రవేశం బన్నీ బంధంతో బలపడిందన్న మాట. ఇప్పుడదే సినిమా మీద అంచనాలు పెంచడంలో దోహదం చేసింది. జాతర పాట, బుజ్జి తల్లి, హైలెస్సో ఒకటికి మించి మరొకటి హిట్టయిపోయాయి. ఇక బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఎలా ఉండబోతోందో చూడాలి.
కొత్త సంవత్సరంలో జనవరి బోణీని సంక్రాంతికి వస్తున్నాం, డాకు మహారాజ్ విజయవంతంగా పూర్తి చేశాక ఇప్పుడు అందరి దృష్టి తండేల్ మీద ఉంది. తొంభై కోట్ల దాకా బడ్జెట్ పెట్టారని టాక్ ఉంది కానీ విజువల్స్ చూస్తే నిజమే అనిపిస్తోంది. ముందు రోజు ప్రీమియర్లు వేయడం గురించి త్వరలోనే నిర్ణయం తీసుకోవచ్చు.
This post was last modified on February 1, 2025 5:32 pm
ఒకప్పుడు ఇంగ్లీష్ సినిమాలకు మన దేశంలో తెగ క్రేజ్ ఉండేది. జురాసిక్ పార్క్ నుంచి ఇది విపరీతంగా పెరిగిపోయింది. దానికి…
గత వారం విడుదలైన ‘చెన్నై లవ్ స్టోరీ’ సినిమా ఫుల్ పాజిటివ్ టాకేమీ తెచ్చుకోలేదు. ప్రిమియర్స్ నుంచే డివైడ్ టాక్ మొదలైంది.…
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని విష్ణుమూర్తి అవతారంగా ప్రముఖ బాలివుడ్ నటుడు సుదేష్ బెర్రీ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో…
బలమైన కంబ్యాక్ కోసం ఎదురు చూస్తున్న మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఆశలన్నీ కొరియన్ కనకరాజు మీదే ఉన్నాయి. ఆగస్ట్…
ఏపీ దశ దిశలను మార్చేసే భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం శనివారం ఉదయం లాంఛనంగా ప్రారంబమైంది. దేశ ప్రధాని నరేంద్ర మోదీ అల్లూరి సీతారామరాజు…
జంతర్ మంతర్ ఆందోళనలో ప్రధాని మోదీపై విమర్శలు చేయడం కన్నీళ్లు తెప్పించిందని, పండ్లు కాసే చెట్టుపైకి రాళ్లేస్తారని, దేశం కోసం…