వచ్చే వారం ఫిబ్రవరి 7 విడుదల కాబోతున్న తండేల్ మీద క్రమంగా అంచనాలు పెరుగుతున్నాయి. నాగచైతన్య కెరీర్ లో మొదటి ప్యాన్ ఇండియా మూవీ కావడంతో అక్కినేని అభిమానులు భారీ ఆశలు పెట్టుకున్నారు. దానికి తగ్గట్టే మూడు పాటలు ఛార్ట్ బస్టర్స్ కావడం, ట్రైలర్ కు పాజిటివ్ రెస్పాన్స్ రావడం ఇలా అన్ని శుభ శకునాలే కనిపిస్తున్నాయి.
ముఖ్యంగా దేవిశ్రీ ప్రసాద్ తన మీద నమ్మకాన్ని నిలబెట్టుకునే దిశగా మంచి మ్యూజిక్ ఇవ్వడం తండేల్ కి చాలా ప్లస్ కానుంది. పుష్ప 2 ది రూల్ తర్వాత మరో బెస్ట్ ఆల్బమ్ ఇస్తున్నాడన్న భరోసా అయితే దొరికింది. దీని వెనుక ఇంటరెస్టింగ్ కథుంది. అదేంటో చూద్దాం.
షూటింగ్ కు ముందు తండేల్ సంగీత దర్శకుడిగా ఎవరిని పెట్టుకోవాలనే మీమాంస నిర్మాత అల్లు అరవింద్ కు మొదలయ్యింది. ముందు దేవిశ్రీ ప్రసాద్ నే అనుకున్నారు కానీ పుష్ప 2తో తన కమిట్ మెంట్ దృష్ట్యా మొత్తం వాళ్లే పిండేసుకుంటారు కాబట్టి తమకు అంత టైం ఇవ్వకపోవచ్చనే అనుమానంతో నిర్ణయం వాయిదా వేసుకున్నారు.
ఓసారి ఇంట్లో అల్లు అరవింద్ ఇదే విషయాన్ని బన్నీ దగ్గర ప్రస్తావించారు. నిన్ను, సుకుమార్ ని అడిగి ఇబ్బంది పెట్టడం ఇష్టం లేదని అన్నారు. దీనికి బదులుగా అల్లు అర్జున్ ప్రేమకథకు డిఎస్పి కాకుండా ఇంకెవరినో ఆలోచించడం ఏమిటని చెప్పి లాక్ చేయించాడు.
అలా అరవింద్ అనుమాన పడిన దేవి ప్రవేశం బన్నీ బంధంతో బలపడిందన్న మాట. ఇప్పుడదే సినిమా మీద అంచనాలు పెంచడంలో దోహదం చేసింది. జాతర పాట, బుజ్జి తల్లి, హైలెస్సో ఒకటికి మించి మరొకటి హిట్టయిపోయాయి. ఇక బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఎలా ఉండబోతోందో చూడాలి.
కొత్త సంవత్సరంలో జనవరి బోణీని సంక్రాంతికి వస్తున్నాం, డాకు మహారాజ్ విజయవంతంగా పూర్తి చేశాక ఇప్పుడు అందరి దృష్టి తండేల్ మీద ఉంది. తొంభై కోట్ల దాకా బడ్జెట్ పెట్టారని టాక్ ఉంది కానీ విజువల్స్ చూస్తే నిజమే అనిపిస్తోంది. ముందు రోజు ప్రీమియర్లు వేయడం గురించి త్వరలోనే నిర్ణయం తీసుకోవచ్చు.
తెలుగు తమిళ భాషల్లో ఫాలోయింగ్ ఉన్న హీరో ప్రదీప్ రంగనాధన్ వరస విజయాలకు బ్రేక్ వేస్తూ లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ…
ఐపీఎల్ అంటేనే చివరి బంతి వరకు ఉండే ఉత్కంఠ. కానీ ఈసారి ఆ మజా పూర్తిగా తగ్గిపోయింది. పరుగుల వరద…
నిజామాబాద్లో నటరాజ్ అనే ఒక సింగిల్ స్క్రీన్. దాని లీజ్ మార్పు గొడవ టాలీవుడ్లో చర్చనీయాంశంగా మారింది. నిజామాబాద్ ఎస్వీసీ…
ఏపీ అధికార పార్టీ జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్.. సంచలన ప్రకటన చేశారు. పార్టీలో యువతరాన్ని ఆకర్షించేందుకు..…
పాలన విషయంలో మంత్రి లోకేష్ పక్కా ప్లానింగ్తో వ్యవహరిస్తున్నారా? అంటే.. ఔననే సమాధానమే వినిపిస్తోంది. రాజకీయాలను విధానపరమైన అంశాలను కలగాపులగం…
పద్దెనిమిదేళ్ల అవమానాలు, ఎగతాళి మాటలకు బెంగళూరు జట్టు శాశ్వతంగా ముగింపు పలికింది. ఐపీఎల్ చరిత్రలో ట్రోల్స్ కు కేరాఫ్ అడ్రస్…