వచ్చే వారం ఫిబ్రవరి 7 విడుదల కాబోతున్న తండేల్ మీద క్రమంగా అంచనాలు పెరుగుతున్నాయి. నాగచైతన్య కెరీర్ లో మొదటి ప్యాన్ ఇండియా మూవీ కావడంతో అక్కినేని అభిమానులు భారీ ఆశలు పెట్టుకున్నారు. దానికి తగ్గట్టే మూడు పాటలు ఛార్ట్ బస్టర్స్ కావడం, ట్రైలర్ కు పాజిటివ్ రెస్పాన్స్ రావడం ఇలా అన్ని శుభ శకునాలే కనిపిస్తున్నాయి.
ముఖ్యంగా దేవిశ్రీ ప్రసాద్ తన మీద నమ్మకాన్ని నిలబెట్టుకునే దిశగా మంచి మ్యూజిక్ ఇవ్వడం తండేల్ కి చాలా ప్లస్ కానుంది. పుష్ప 2 ది రూల్ తర్వాత మరో బెస్ట్ ఆల్బమ్ ఇస్తున్నాడన్న భరోసా అయితే దొరికింది. దీని వెనుక ఇంటరెస్టింగ్ కథుంది. అదేంటో చూద్దాం.
షూటింగ్ కు ముందు తండేల్ సంగీత దర్శకుడిగా ఎవరిని పెట్టుకోవాలనే మీమాంస నిర్మాత అల్లు అరవింద్ కు మొదలయ్యింది. ముందు దేవిశ్రీ ప్రసాద్ నే అనుకున్నారు కానీ పుష్ప 2తో తన కమిట్ మెంట్ దృష్ట్యా మొత్తం వాళ్లే పిండేసుకుంటారు కాబట్టి తమకు అంత టైం ఇవ్వకపోవచ్చనే అనుమానంతో నిర్ణయం వాయిదా వేసుకున్నారు.
ఓసారి ఇంట్లో అల్లు అరవింద్ ఇదే విషయాన్ని బన్నీ దగ్గర ప్రస్తావించారు. నిన్ను, సుకుమార్ ని అడిగి ఇబ్బంది పెట్టడం ఇష్టం లేదని అన్నారు. దీనికి బదులుగా అల్లు అర్జున్ ప్రేమకథకు డిఎస్పి కాకుండా ఇంకెవరినో ఆలోచించడం ఏమిటని చెప్పి లాక్ చేయించాడు.
అలా అరవింద్ అనుమాన పడిన దేవి ప్రవేశం బన్నీ బంధంతో బలపడిందన్న మాట. ఇప్పుడదే సినిమా మీద అంచనాలు పెంచడంలో దోహదం చేసింది. జాతర పాట, బుజ్జి తల్లి, హైలెస్సో ఒకటికి మించి మరొకటి హిట్టయిపోయాయి. ఇక బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఎలా ఉండబోతోందో చూడాలి.
కొత్త సంవత్సరంలో జనవరి బోణీని సంక్రాంతికి వస్తున్నాం, డాకు మహారాజ్ విజయవంతంగా పూర్తి చేశాక ఇప్పుడు అందరి దృష్టి తండేల్ మీద ఉంది. తొంభై కోట్ల దాకా బడ్జెట్ పెట్టారని టాక్ ఉంది కానీ విజువల్స్ చూస్తే నిజమే అనిపిస్తోంది. ముందు రోజు ప్రీమియర్లు వేయడం గురించి త్వరలోనే నిర్ణయం తీసుకోవచ్చు.
This post was last modified on February 1, 2025 5:32 pm
మోహన్ లాల్ వయసు ప్రస్తుతం 66 సంవత్సరాలు. ఇంకో నాలుగేళ్లు పోతే ఏడు దశాబ్దాలు పూర్తి చేసుకోబోతున్నారు. ఇంత ఏజ్…
భర్త ఎవరితోనో సంబంధం పెట్టుకుంటాడు. భార్యకు అనుమానం వస్తుంది. విషయం రూఢి చేసుకుంటుంది. భర్తను జాగ్రత్తగా గమనిస్తూ.. పరాయి మహిళతో…
ఎట్టకేలకు మాజీ రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి రాజకీయ పార్టీ పెట్టనున్నట్లు ప్రకటించారు. గత కొన్ని రోజులుగా జరుగుతున్న ప్రచారానికి…
మిగతా దక్షిణాది రాష్ట్రాలతో పోలిస్తే ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో టికెట్ల ధరలు ఎక్కువ. పైగా పెద్ద సినిమాలు రిలీజైనపుడు అదనపు…
ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబుకు మైకు పట్టడం బాగా తెలుసు. ఆయన మైకు అందుకుంటే.. వినేవారికైనా బోర్ కొడు…
మన తెలుగు ప్రేక్షకులు నిండు మనసుతో భాష భేదం లేకుండా కంటెంట్ బాగుంటే చాలు వసూళ్లు ఇచ్చి మరీ బ్లాక్…