ఓటీటీ సినిమాలంటే భయపడిపోయే పరిస్థితులు కనిపిస్తున్నాయి ఈ మధ్య. వరుసగా వివిధ భాషల్లో రిలీజైన ఓటీటీ సినిమాలన్నీ తుస్సుమనిపించేయడమే అందుక్కారణం. ముఖ్యంగా తెలుగులో లేక లేక పెద్ద సినిమాలు ఓటీటీ రిలీజ్కు రెడీ అయ్యాయని అమితాసక్తి ప్రదర్శించారు ప్రేక్షకులు.
గత నెలలో నాని సినిమా ‘వి’, ఈ నెలలో అనుష్క చిత్రం ‘నిశ్శబ్దం’ భారీ అంచనాల మధ్య విడుదలైన సంగతి తెలిసిందే. కానీ ఆ సినిమాలు ఆ అంచనాల్ని అందుకోవడంలో విఫలమయ్యాయి. ప్రేక్షకుల్ని నిరాశకు గురి చేశాయి.
వీటితో పాటు ‘ఒరేయ్ బుజ్జిగా’ సైతం అంతగా ఆకట్టుకోలేదు. మరోవైపు తమిళంలోనూ ఓటీటీ సినిమాలకు స్పందన అంతంతమాత్రమే. ‘పెంగ్విన్’, ‘పొన్ మగల్ వందాల్’ లాంటి సినిమాలు ఆకట్టుకోలేదు. దీంతో ఓటీటీ సినిమాలంటేనే ఒక రకమైన వ్యతిరేకత పడిపోయింది ప్రేక్షకుల్లో.
ఐతే ఇలాంటి టైంలో దసరా టైంలో రిలీజవుతున్న రెండు సినిమాలు ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. అందులో ఒకటి చిన్న సినిమా కాగా.. మరొకటి పెద్దది. అక్టోబరు 23న రిలీజ్ కానున్న చిన్న సినిమా.. కలర్ ఫోటో. కమెడియన్ సుహాస్ హీరోగా పరిచయమవుతున్న సినిమా ఇది. చాందిని చౌదరి, సునీల్ ముఖ్య పాత్రలు పోషించారు. సందీప్ రాజ్ దర్శకత్వంలో సాయిరాజేష్ ఈ సినిమాను నిర్మించాడు. ఈ సినిమా టీజర్, పాటలు ఆకట్టుకున్నాయి. ఇందులో విషయం ఉందన్న ఆశలు రేకెత్తించాయి. ఆహాలో ఈ సినిమా విడుదల కాబోతోంది.
మరోవైపు అక్టోబరు 30న రాబోతున్న ‘ఆకాశమే నీ హద్దురా’ కూడా మంచి అంచనాలతో విడుదలవుతున్నదే. దక్షిణాదిన ఇప్పటిదాకా వచ్చిన ఓటీటీ సినిమాలన్నింట్లోకి ఇది బిగ్గెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. దీని ప్రోమోలన్నీ ఆసక్తి రేకెత్తించేవే. చాలా ప్రామిసింగ్గా అనిపిస్తున్న ఈ చిత్రం ఓటీటీ సినిమాల్లో కొత్త ఒరవడిని సృష్టిస్తుందని భావిస్తున్నారు. మరి ఈ రెండు సినిమాలు అంచనాలకు తగ్గట్లు ఉండి రాబోయే ఓటీటీ సినిమాలకు ఊపునిస్తాయేమో చూడాలి.
This post was last modified on October 19, 2020 12:25 pm
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…