నిన్న షాహిద్ కపూర్ దేవా చెప్పుకోదగ్గ అంచనాల మధ్య రిలీజయ్యింది. పూజ హెగ్డే హీరోయిన్ కావడంతో అంతోఇంతో మనోళ్ల దృష్టి కూడా దీని మీదే ఉంది. పోలీస్ బ్యాక్ డ్రాప్ చూసి ఎప్పుడో 2013లో వచ్చిన మలయాళం బ్లాక్ బస్టర్ ముంబై పోలీస్ కి ఇది రీమేకనే అనుమానం ముందు నుంచి వ్యక్తమవుతూ వచ్చింది.
రెండింటికి రోషన్ ఆండ్రూస్ దర్శకుడు కావడంతో ఇది మరింత బలపడింది. అయితే టీమ్ మాత్రం ఎప్పటికప్పుడు ఈ ప్రచారాన్ని కొట్టివేస్తూ దేవ్ కొత్త స్టోరీ అని, ఇంతకు ముందు చూడని ట్రీట్ మెంట్ తో ఉంటుందని ఊరించింది. తీరా చూస్తే అదంతా అబద్దమే. ఈ దేవా మూల కథ ముంబై పోలీస్ దే.
దీన్నే సుధీర్ బాబు హంట్ గా తెలుగులో చేశాడు. మన ఆడియన్స్ ఏ మాత్రం జీర్ణించుకోలేని క్లైమాక్స్ ట్విస్ట్ ని యధాతథంగా ఉంచేయడంతో ఇక్కడ డిజాస్టర్ అయ్యింది. అందుకే దేవాలో తెలివిగా దీన్ని మార్చేసి సెకండాఫ్ ట్రీట్ మెంట్ పూర్తి కమర్షియల్ ఫార్మట్ లో తీసుకెళ్లారు.
అయితే షాహిద్ కపూర్ ఎంత వన్ మ్యాన్ షో చేసినా బలమైన కంటెంట్ గా దీన్ని మలచడంలో రోషన్ ఆండ్రూస్ అంతగా సక్సెస్ కాలేదు. ఎప్పుడో దశాబ్దం క్రితం రిలీజైన సినిమా మీద ప్రేమతో ఇప్పుడు కూడా దాన్నే తీయాలనుకోవడం సాహసం. దీని బదులు ఏదైనా కొత్త బ్యాక్ డ్రాప్ తీసుకోవాల్సిందని షో అయ్యాక అనిపిస్తుంది.
కేవలం షాహిద్ కోసమే అయితే దేవాని ట్రై చేయొచ్చు కానీ ముంబై పోలీస్, హంట్ చూసిన వాళ్ళు మాత్రం దీన్ని ఎంజాయ్ చేయలేరు. పూజా హెగ్డే రొమాంటిక్ సన్నివేశాలు, జేక్స్ బిజోయ్ నేపధ్య సంగీతం, యాక్షన్ ఎపిసోడ్స్ కొంత వరకు పైసా వసూల్ అనిపించినా ఓవరాల్ గా బాగుందని అనిపించుకోవడంలో దేవా తడబడ్డాడు.
బాలీవుడ్ లో ఏమైనా అద్భుతాలు చేయడం అనుమానమే. అయినా ఓటిటి ట్రెండ్ లో ఆడియన్స్ కొత్త కంటెంట్ ని డిమాండ్ చేస్తున్న పరిస్థితుల్లో ఇంకా పాత రీమేకులని పట్టుకుని వేలాడటం ఏమిటో ఎంత బుర్ర చించుకున్నా అర్థం కాదు. క్రియేటివిటీ అడగంటిపోతే ఇంతేనేమో.
శాకుంతలం విడుదలై డిజాస్టరైనప్పుడు దాని ఫలితానికి బాధ్యుడు దర్శకుడు గుణశేఖర్ అయినప్పటికీ టైటిల్ రోల్ పోషించిన సమంత కూడా విమర్శలను…
మెగాస్టార్ చిరంజీవి సినిమా రహస్యాలను లీక్ చేయడంలో ఫేమస్ అన్న సంగతి తెలిసిందే. ‘ఆచార్య’ సినిమా టైటిల్ను అనుకోకుండా రివీల్…
వైసీపీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి… టీడీపీ ఎమ్మెల్యే, టాలీవుడ్ అగ్ర నటుడు నందమూరి…
"ఏనుగు పోతుంటే చూడరు.. చీమ కుడితే గగ్గోలు పెడతారు" అనే సామెత రాజకీయాలకు కూడా సరిగ్గా సరిపోతుందనే విమర్శలు వినిపిస్తున్నాయి.…
ఇటీవలే విడుదలైన వంద దేవుళ్ళులో కథ మొత్తం ఆర్టిస్ట్ స్వసిక చుట్టూ నడుస్తుంది. భర్తను కోల్పోయి పెళ్లీడుకొచ్చిన ఇద్దరు పిల్లల…
కంబ్యాక్ అవ్వాలనే సంకల్పంతో నిర్మాతగా మారి మరీ హీరోగా నటించిన వడ్డే నవీన్ కు ఆశించిన స్వాగతం దక్కలేదు. ట్రాన్స్…