బాలకృష్ణకు వరసగా నాలుగో బ్లాక్ బస్టర్ అందించిన డాకు మహారాజ్ ఫలితం పట్ల అభిమానులు ఒకపక్క సంతోషంగానే ఉన్నారు కానీ ఒక అసంతృప్తిని మాత్రం దాచుకోలేకపోతున్నారు. కనీసం రెండు వందల నుంచి రెండు వందల యాభై కోట్ల మధ్యలో గ్రాస్ వస్తుందనే అంచనాలకు భిన్నంగా డబుల్ సెంచరీ అయినా అందుకుందో తెలియకుండానే ఫైనల్ రన్ కు దగ్గర పడటం దీనికి ప్రధాన కారణం.
అన్ని ఏరియాలు బ్రేక్ ఈవెన్ అయ్యాయని నిన్న నిర్మాణ సంస్థ ప్రకటించింది కానీ అందులో ఎలాంటి నెంబర్లు లేవు. సంక్రాంతికి వస్తున్నాం తరహాలో అంకెలను చెప్పకపోవడం చర్చకు దారి తీసింది.
ఏది ఏమైనా డాకు మహారాజ్ సినిమా అఖండ, వీరసింహారెడ్డి రేంజ్ లో ర్యాంపేజ్ చేయలేదన్నది వాస్తవం. భగవంత్ కేసరిని దాటేసింది కానీ ఇంకా మెరుగ్గా పెర్ఫార్మ్ చేయాల్సిందని ఫ్యాన్స్ అభిప్రాయం. ఈ రికార్డుల సంగతి పక్కనపెడితే కంటెంట్ లో ఉన్న ఎలివేషన్లు, హై వోల్టేజ్ యాక్షన్ వాళ్ళను శాటిస్ఫై చేసినప్పటికీ…
సగటు ప్రేక్షకులకు కావాల్సిన ఎమోషన్లు, కథలో కీలక మలుపులు పూర్తి స్థాయిలో పండలేదనేది ఓపెన్ సీక్రెట్. రిలీజ్ కు ముందు నిర్మాత నాగవంశీ అన్నట్టు వాల్తేరు వీరయ్యని మించి తీయడం నిజమే అయితే దాన్ని మించిపోయేలా కలెక్షన్లు రాబట్టుకోవాలి. కానీ అలా జరగలేదు.
మొత్తంగా చూసుకుంటే సంక్రాంతికి వస్తున్నాం డామినేషన్ దానికి ప్రధాన కారణమని చెప్పొచ్చు. డాకు మహారాజ్ సంగతి పక్కనపెడితే డబుల్ సెంచరీ సాధించే సత్తా అఖండ 2 తాండవంకి నూరు శాతం ఉంది. ఈసారి పక్కా ప్లానింగ్ తో ఒకేసారి ప్యాన్ ఇండియా రిలీజ్ చేస్తున్నారు.
ఇలా చేయకపోవడమే డాకుకి దెబ్బయ్యింది. హిందీ వెర్షన్ ఆలస్యంగా రిలీజ్ చేయడం వల్ల ఓపెనింగ్స్ సమస్యతో పాటు పైరసీ లీక్ లాంటి అడ్డంకులు దీనికీ తప్పలేదు. ప్రమోషన్ల పరంగా ఏ లోటు లేకుండా ఇంటర్వ్యూలు, ఈవెంట్లు అన్ని చేశారు కానీ ల్యాండ్ మార్క్ అవ్వాల్సిన మూవీ సూపర్ హిట్ దగ్గరే ఆగిపోవాల్సి వచ్చింది.
This post was last modified on January 31, 2025 10:01 am
రవితేజ, శివ నిర్వాణ కాంబినేషన్ లో వచ్చిన ఇరుముడి బాక్సాఫీస్ దగ్గర మంచి కలెక్షన్స్ అందుకుంటోంది. ఈ సినిమాలో హీరో…
స్థానిక ఎన్నికలకు వైసీపీ శ్రేణులను సమాయత్తం చేసే పనిలో ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ నిమగ్నమయ్యారు. ఈ క్రమంలో…
వైసీపీకి చెందిన మాజీ మంత్రి జోగి రమేష్ కుటుంబ వ్యవహారం ఇంకా చల్లారలేదు. అదనపు కట్నం కోసం అత్తా మామలు…
రేపు విడుదల కాబోతున్న టాక్సిక్ తెలుగు రాష్ట్రాల బుకింగ్స్ ఎట్టకేలకు ఓపెనయ్యాయి. విపరీతమైన ఎదురు చూపులకు తెరవేస్తూ ఏపీ తెలంగాణ…
వారణాసి లాంటి ప్యాన్ వరల్డ్ మూవీ చేశాక మహేష్ బాబు నెక్స్ట్ ఏ దర్శకుడికి గ్రీన్ సిగ్నల్ ఇస్తాడనే సస్పెన్స్…
కర్ణాటకలో ఒక ఎమ్మెల్యే కూతురు, మహిళా ఎస్సై మధ్య జరిగిన ఫైటింగ్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఆలయ…