బాలకృష్ణకు వరసగా నాలుగో బ్లాక్ బస్టర్ అందించిన డాకు మహారాజ్ ఫలితం పట్ల అభిమానులు ఒకపక్క సంతోషంగానే ఉన్నారు కానీ ఒక అసంతృప్తిని మాత్రం దాచుకోలేకపోతున్నారు. కనీసం రెండు వందల నుంచి రెండు వందల యాభై కోట్ల మధ్యలో గ్రాస్ వస్తుందనే అంచనాలకు భిన్నంగా డబుల్ సెంచరీ అయినా అందుకుందో తెలియకుండానే ఫైనల్ రన్ కు దగ్గర పడటం దీనికి ప్రధాన కారణం.
అన్ని ఏరియాలు బ్రేక్ ఈవెన్ అయ్యాయని నిన్న నిర్మాణ సంస్థ ప్రకటించింది కానీ అందులో ఎలాంటి నెంబర్లు లేవు. సంక్రాంతికి వస్తున్నాం తరహాలో అంకెలను చెప్పకపోవడం చర్చకు దారి తీసింది.
ఏది ఏమైనా డాకు మహారాజ్ సినిమా అఖండ, వీరసింహారెడ్డి రేంజ్ లో ర్యాంపేజ్ చేయలేదన్నది వాస్తవం. భగవంత్ కేసరిని దాటేసింది కానీ ఇంకా మెరుగ్గా పెర్ఫార్మ్ చేయాల్సిందని ఫ్యాన్స్ అభిప్రాయం. ఈ రికార్డుల సంగతి పక్కనపెడితే కంటెంట్ లో ఉన్న ఎలివేషన్లు, హై వోల్టేజ్ యాక్షన్ వాళ్ళను శాటిస్ఫై చేసినప్పటికీ…
సగటు ప్రేక్షకులకు కావాల్సిన ఎమోషన్లు, కథలో కీలక మలుపులు పూర్తి స్థాయిలో పండలేదనేది ఓపెన్ సీక్రెట్. రిలీజ్ కు ముందు నిర్మాత నాగవంశీ అన్నట్టు వాల్తేరు వీరయ్యని మించి తీయడం నిజమే అయితే దాన్ని మించిపోయేలా కలెక్షన్లు రాబట్టుకోవాలి. కానీ అలా జరగలేదు.
మొత్తంగా చూసుకుంటే సంక్రాంతికి వస్తున్నాం డామినేషన్ దానికి ప్రధాన కారణమని చెప్పొచ్చు. డాకు మహారాజ్ సంగతి పక్కనపెడితే డబుల్ సెంచరీ సాధించే సత్తా అఖండ 2 తాండవంకి నూరు శాతం ఉంది. ఈసారి పక్కా ప్లానింగ్ తో ఒకేసారి ప్యాన్ ఇండియా రిలీజ్ చేస్తున్నారు.
ఇలా చేయకపోవడమే డాకుకి దెబ్బయ్యింది. హిందీ వెర్షన్ ఆలస్యంగా రిలీజ్ చేయడం వల్ల ఓపెనింగ్స్ సమస్యతో పాటు పైరసీ లీక్ లాంటి అడ్డంకులు దీనికీ తప్పలేదు. ప్రమోషన్ల పరంగా ఏ లోటు లేకుండా ఇంటర్వ్యూలు, ఈవెంట్లు అన్ని చేశారు కానీ ల్యాండ్ మార్క్ అవ్వాల్సిన మూవీ సూపర్ హిట్ దగ్గరే ఆగిపోవాల్సి వచ్చింది.
This post was last modified on January 31, 2025 10:01 am
కలిసి రాజకీయం చేయకపోయినా వైఎస్సార్సీపీ, బీఆర్ఎస్ పార్టీల మధ్య కొన్ని పోలికలు కనిపిస్తున్నాయి. అటు ఏపీలో, ఇటు తెలంగాణలో ఈ…
సోషల్ మీడియాలో చాలా చురుగ్గా ఉంటూ.. తన సినిమాల ఈవెంట్లలో, ఇంటర్వ్యూల్లో హాట్ హాట్ కామెంట్లు చేస్తుంటాడు ప్రముఖ తెలుగు…
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ 'కొరియన్ కనకరాజు'తో ఇప్పుడు తప్పకుండా హిట్ కొట్టాల్సిన పరిస్థితి వచ్చింది. గతంలో 'గద్దలకొండ గణేష్'…
ఆదివారం రోజు అందులోనూ ప్రత్యేకంగా సాయంత్రం షోలకు ఆక్యుపెన్సీలు బాగుండటం సహజమే కానీ ఈవారం మాత్రం బయ్యర్లు ఆనందంతో మునిగిపోయేలా…
తెలంగాణలో ఫీజు రీయింబర్స్మెంట్ పథకం అమలులో కీలక మార్పులు తెచ్చేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించినట్లు ప్రచారం జరుగుతుంది. కళాశాలలకు…
నీట్ ప్రశ్నపత్రం లీకేజీకి వ్యతిరేకంగా విద్యార్థులు చేపట్టిన ఢిల్లీ నిరసనలో ఉగ్రవాదుల కుట్ర కోణం బయట పడిందని ఢిల్లీ టాస్క్ఫోర్స్…