బాలకృష్ణకు వరసగా నాలుగో బ్లాక్ బస్టర్ అందించిన డాకు మహారాజ్ ఫలితం పట్ల అభిమానులు ఒకపక్క సంతోషంగానే ఉన్నారు కానీ ఒక అసంతృప్తిని మాత్రం దాచుకోలేకపోతున్నారు. కనీసం రెండు వందల నుంచి రెండు వందల యాభై కోట్ల మధ్యలో గ్రాస్ వస్తుందనే అంచనాలకు భిన్నంగా డబుల్ సెంచరీ అయినా అందుకుందో తెలియకుండానే ఫైనల్ రన్ కు దగ్గర పడటం దీనికి ప్రధాన కారణం.
అన్ని ఏరియాలు బ్రేక్ ఈవెన్ అయ్యాయని నిన్న నిర్మాణ సంస్థ ప్రకటించింది కానీ అందులో ఎలాంటి నెంబర్లు లేవు. సంక్రాంతికి వస్తున్నాం తరహాలో అంకెలను చెప్పకపోవడం చర్చకు దారి తీసింది.
ఏది ఏమైనా డాకు మహారాజ్ సినిమా అఖండ, వీరసింహారెడ్డి రేంజ్ లో ర్యాంపేజ్ చేయలేదన్నది వాస్తవం. భగవంత్ కేసరిని దాటేసింది కానీ ఇంకా మెరుగ్గా పెర్ఫార్మ్ చేయాల్సిందని ఫ్యాన్స్ అభిప్రాయం. ఈ రికార్డుల సంగతి పక్కనపెడితే కంటెంట్ లో ఉన్న ఎలివేషన్లు, హై వోల్టేజ్ యాక్షన్ వాళ్ళను శాటిస్ఫై చేసినప్పటికీ…
సగటు ప్రేక్షకులకు కావాల్సిన ఎమోషన్లు, కథలో కీలక మలుపులు పూర్తి స్థాయిలో పండలేదనేది ఓపెన్ సీక్రెట్. రిలీజ్ కు ముందు నిర్మాత నాగవంశీ అన్నట్టు వాల్తేరు వీరయ్యని మించి తీయడం నిజమే అయితే దాన్ని మించిపోయేలా కలెక్షన్లు రాబట్టుకోవాలి. కానీ అలా జరగలేదు.
మొత్తంగా చూసుకుంటే సంక్రాంతికి వస్తున్నాం డామినేషన్ దానికి ప్రధాన కారణమని చెప్పొచ్చు. డాకు మహారాజ్ సంగతి పక్కనపెడితే డబుల్ సెంచరీ సాధించే సత్తా అఖండ 2 తాండవంకి నూరు శాతం ఉంది. ఈసారి పక్కా ప్లానింగ్ తో ఒకేసారి ప్యాన్ ఇండియా రిలీజ్ చేస్తున్నారు.
ఇలా చేయకపోవడమే డాకుకి దెబ్బయ్యింది. హిందీ వెర్షన్ ఆలస్యంగా రిలీజ్ చేయడం వల్ల ఓపెనింగ్స్ సమస్యతో పాటు పైరసీ లీక్ లాంటి అడ్డంకులు దీనికీ తప్పలేదు. ప్రమోషన్ల పరంగా ఏ లోటు లేకుండా ఇంటర్వ్యూలు, ఈవెంట్లు అన్ని చేశారు కానీ ల్యాండ్ మార్క్ అవ్వాల్సిన మూవీ సూపర్ హిట్ దగ్గరే ఆగిపోవాల్సి వచ్చింది.
This post was last modified on January 31, 2025 10:01 am
వైసీపీ పార్లమెంట్ సభ్యుడు, సీనియర్ నేత మిథున్ రెడ్డి ఆస్తులు భారీగా పెరిగాయని పేర్కొంటూ ఏడిఆర్ సర్వే తాజాగా వెల్లడించింది.…
టాక్సిక్ టీజర్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ముఖ్యంగా కారులో రొమాన్స్ పెట్టి దాని ద్వారా స్మశానంలో…
ఇంకొద్ది గంటల్లో రాజా సాబ్ ప్రీమియర్లు ప్రారంభం కాబోతున్నాయి. జీవో త్వరగా రావడంతో ఆంధ్రప్రదేశ్ బుకింగ్స్ వేగంగా ఉండగా తెలంగాణది…
ఈ సంక్రాంతికి ‘మాస్ రాజా’ ట్యాగ్ తీసేసి.. ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ అనే పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్తో ప్రేక్షకుల ముందుకు…
అంతా అనుకున్న ప్రకారం జరిగితే తమిళనాడు థియేటర్ల దగ్గర ఈపాటికి పండుగ వాతావరణం ఉండేది. రేపటి ఉదయం ‘జననాయగన్’ రిలీజ్…
తిరుమల శ్రీవారి ఆలయం అంటే దేవుడు లేడని భావించే నాస్తికులు కూడా పన్నెత్తు మాట అనని కలియుగ వైకుంఠం. ఎంతో…