ఇంకో ఆరు రోజుల్లో పట్టుదల విడుదల కానుంది. అజిత్ హీరోగా మాగిజ్ తిరుమేని దర్శకత్వం వహించిన ఈ యాక్షన్ థ్రిల్లర్ లో త్రిష హీరోయిన్ కాగా యాక్షన్ కింగ్ అర్జున్, రెజీనా కెసెండ్రా కీలక పాత్రలు పోషించారు. మనకు పరిచయమున్న క్యాస్టింగే ఇదంతా. అనిరుధ్ రవిచందర్ సంగీతం అసలైన ఆకర్షణ.
ఇన్ని ఉన్నా పట్టుదల వస్తోందనే సంగతి తెలుగు ఆడియన్స్ కి రిజిస్టర్ చేయడంలో టీమ్ విఫలమవుతోంది. ఇప్పటిదాకా ప్రమోషన్లు మొదలుపెట్టలేదు. తమిళంలో దర్శకుడు వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు కానీ హీరో వైపు నుంచి ఎలాంటి చప్పుడు లేదు. ఇది ఎప్పటి నుంచో ఉన్నదే.
బజ్ సంగతి ఎలా ఉన్నా తెలుగు మార్కెట్ ని అజిత్ ఎప్పుడూ సీరియస్ గా తీసుకోలేదు. పాతికేళ్ల క్రితం ప్రేమలేఖ సూపర్ హిట్ అయినప్పుడు తనకో మార్కెట్ ఏర్పడింది. వరసగా డబ్బింగ్ సినిమాలు రిలీజయ్యాయి. వాటిలో కొన్ని కమర్షియల్ గా వర్కౌట్ అయ్యాయి. గ్యాంబ్లర్ నిర్మాతలకు మంచి లాభాలు తీసుకొచ్చింది.
కానీ ఆ తర్వాత చెప్పుకోదగ్గ హిట్టు లేకపోయింది. కోలీవుడ్ లో భీకరంగా ఆడిన విశ్వాసం, వివేకం, వలిమై లాంటివి ఇక్కడ కనీసం యావరేజ్ అనిపించుకోలేదు. తెగింపు సూపర్ ఫ్లాప్ గా నిలిచింది. ఇప్పుడీ పట్టుదల మీద హైప్ లేకపోవడం చూస్తే ఓపెనింగ్స్ మీద అనుమానం వస్తోంది.
అసలే ఒక రోజు తర్వాత ఫిబ్రవరి 7 తండేల్ వస్తోంది. దానికి జరుగుతున్న పబ్లిసిటీ చూస్తున్నాం. నాగచైతన్య చెన్నై వెళ్లి మరీ ఈవెంట్ లో పాల్గొన్నాడు. అక్కడ మంచి రిలీజ్ దక్కేలా నిర్మాత అల్లు అరవింద్ జాగ్రత్తలు తీసుకున్నారు. కానీ ఆ మాత్రం పట్టుదల అజిత్ మేకర్స్ కి లేకపోయిందని అభిమానులు వాపోతున్నారు.
అజిత్ బయటికి రాకపోయినా సరే సినిమాకు సంబంధించి ఏదో ఒక హడావిడి జరుగుతూ ఉంటేనే అంతో ఇంతో జనం దృష్టిలో పడుతుంది. అసలే ఇది వరస డిజాస్టర్లతో కిందా మీద పడుతున్న లైకా ప్రొడక్షన్స్ నుంచి వస్తోంది. పట్టుదలయినా ఊరట కలిగిస్తుందేమోనని ప్రొడ్యూసర్లు ఎదురు చూస్తున్నారు.
అనుకున్నట్లే ఐపీఎల్ 2026 విజేతగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) మళ్ళీ కొట్టేసింది. ఆ జట్టుకు పోటీగా ఈ సీజన్…
మాములుగా ప్రీ రిలీజ్ ఈవెంట్ల సమయంలో నిర్వాహకులు హీరోలతో పాటు దర్శక నిర్మాతల కటవుట్లు పెట్టడం కొత్త కాదు. అందరూ…
మొన్నటిదాకా టాప్ ప్రొడక్షన్ హౌస్ గా వెలిగిపోయిన యువి క్రియేషన్స్ ఇప్పుడు బయటికి చెప్పుకోలేని ఇబ్బందులతో సతమతమవుతోందట. చిన్న బడ్జెట్…
వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ అధికారంలో ఉన్నప్పుడు.. రాష్ట్రంలో జరిగిన అనేక అక్రమాలపై ప్రస్తుత ప్రభుత్వం విచారణ చేస్తున్న…
వేసవిలో కీలకమైన నెలగా చెప్పుకునే మే అయిపోయింది. స్కూళ్ళు, కాలేజీలకు సెలవులు ఉండే ఈ ముఖ్యమైన సీజన్ టాలీవుడ్ వృథా…
ఉద్యోగ వ్యవస్థకు సంబంధించి పంజాబ్ లోని ఆమ్ ఆద్మీ పార్టీ సర్కారు సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రజా పాలనలో ఇకపై…