ఆర్ఆర్ఆర్ సినిమా నుంచి మార్చి సీతారామరాజు టీజర్ రావడానికి ముందు మరీ అంచనాలేమీ లేవు. అందుకు ప్రధాన కారణం ఆ టీజర్ వస్తుందని కొన్ని రోజుల ముందు వరకు తెలియదు. దాని కోసం చాన్నాళ్ల ఎదురు చూపులేమీ లేవు. లాక్ డౌన్ వల్ల పని లేక ఖాళీ అయిపోయిన చిత్ర బృందం ఉన్నట్లుండి టీజర్ గురించి ప్రకటించింది. రామ్ చరణ్ పుట్టిన రోజు నాడు దాన్ని రిలీజ్ చేసింది.
రాజమౌళి స్థాయికి ఏమాత్రం తగ్గని విధంగా ఆ టీజర్ ఉండి ఇటు మెగా అభిమానుల్ని, అటు నందమూరి ఫ్యాన్స్ను అలరించింది. చరణ్ విజువల్స్ పరంగా వావ్ అనిపిస్తే.. తారక్ వాయిస్తో మెస్మరైజ్ చేశాడు. ఇక అప్పట్నుంచి తారక్ పోషిస్తున్న కొమరం భీమ్ పాత్ర టీజర్ కోసం ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు ఫ్యాన్స్.
సీతారామరాజు టీజర్ అదిరిపోవడం, కొమరం భీమ్ టీజర్ కోసం చాన్నాళ్లు ఎదురు చూడటం వల్ల టీజర్పై అంచనాలు పెరుగుతూ వచ్చాయి. ఈ మధ్యనే ఆర్ఆర్ఆర్ టీం మళ్లీ షూటింగ్కు వెళ్లింది. వెంటనే భీమ్ టీజర్ విజువల్స్ మీద దృష్టిపెట్టింది. ఈ నెల 22న టీజర్ రిలీజ్ చేయబోతున్నట్లు కూడా ప్రకటించింది. దీంతో అభిమానులు కౌంట్డౌన్లు మొదలుపెట్టేశారు. వారి ఉత్సాహాన్ని ఇంకా పెంచుతూ.. ఆర్ఆర్ఆర్ టీం సైతం కౌంట్ డౌన్లు నడుపుతూ.. ఇంకో ఐదు రోజుల్లో, ఇంకో నాలుగు రోజుల్లో అంటూ ఊరిస్తూ వస్తోంది.
టీజర్కు రోజులు దగ్గరపడేకొద్దీ అంచనాలు పెరిగిపోతున్నాయి. ఇటు తారక్ స్క్రీన్ ప్రెజెన్స్ విషయంలో అతడి ఫ్యాన్స్, అటు చరణ్ వాయిస్ ఓవర్ విషయంతో తన అభిమానులు భారీ అంచనాలతోనే ఉన్నారు. వాటిని రీచ్ కావడం అంత తేలిక కాదు.ఐతే తనపై ప్రేక్షకులు ఎంత అంచనాలు పెట్టుకున్నా దాన్ని బర్డెన్లాగా ఫీలవకుండా ఇంకా బాగా పని చేసి వారిని మెస్మరైజ్ చేయడం జక్కన్నకు అలవాటు. మరి భీమ్ టీజర్ విషయంలోనూ అలాగే చేస్తాడేమో చూడాలి.
This post was last modified on October 19, 2020 7:54 am
తమిళగ వెట్రి కళగం అధినేత జోసెఫ్ విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయడం ఖరారైంది. ఆరు రోజులుగా ట్విస్టులతో సాగిన రాజకీయ…
రాజకీయాల్లో అవకాశాలు రావడమే అరుదు. వచ్చిన వాటిని వినియోగించుకోవాల్సిన అవసరం.. వాటిని పట్టుకుని ఎదగాల్సిన అవసరం కూడా పార్టీలకు, నాయకులకు…
తమిళనాడు కొత్త ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ కొత్త సినిమా జన నాయకుడు విడుదలకు మార్గం సుగమమయ్యింది. సిఎం పదవిని చేపట్టేందుకు…
పదమూడేళ్ల క్రితం ఇండస్ట్రీకి కొత్త ట్రెండ్ తీసుకొచ్చిన దృశ్యం ఫ్రాంచైజ్ లో మూడో భాగం మే 21 విడుదల కానుంది.…
తమిళనాడు రాజకీయాల్లో చోటు చేసుకున్న అనిశ్చిత పరిస్థితి తొలిగిపోయింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అతి పెద్ద పార్టీగా అవతరించిన…
దేశ ప్రధాని నరేంద్ర మోడీ.. ఆదివారం హైదరాబాద్లో పర్యటించనున్నారు. వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు. అయితే.. ఈ పర్యటనలో మరో…