ఆర్ఆర్ఆర్ సినిమా నుంచి మార్చి సీతారామరాజు టీజర్ రావడానికి ముందు మరీ అంచనాలేమీ లేవు. అందుకు ప్రధాన కారణం ఆ టీజర్ వస్తుందని కొన్ని రోజుల ముందు వరకు తెలియదు. దాని కోసం చాన్నాళ్ల ఎదురు చూపులేమీ లేవు. లాక్ డౌన్ వల్ల పని లేక ఖాళీ అయిపోయిన చిత్ర బృందం ఉన్నట్లుండి టీజర్ గురించి ప్రకటించింది. రామ్ చరణ్ పుట్టిన రోజు నాడు దాన్ని రిలీజ్ చేసింది.
రాజమౌళి స్థాయికి ఏమాత్రం తగ్గని విధంగా ఆ టీజర్ ఉండి ఇటు మెగా అభిమానుల్ని, అటు నందమూరి ఫ్యాన్స్ను అలరించింది. చరణ్ విజువల్స్ పరంగా వావ్ అనిపిస్తే.. తారక్ వాయిస్తో మెస్మరైజ్ చేశాడు. ఇక అప్పట్నుంచి తారక్ పోషిస్తున్న కొమరం భీమ్ పాత్ర టీజర్ కోసం ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు ఫ్యాన్స్.
సీతారామరాజు టీజర్ అదిరిపోవడం, కొమరం భీమ్ టీజర్ కోసం చాన్నాళ్లు ఎదురు చూడటం వల్ల టీజర్పై అంచనాలు పెరుగుతూ వచ్చాయి. ఈ మధ్యనే ఆర్ఆర్ఆర్ టీం మళ్లీ షూటింగ్కు వెళ్లింది. వెంటనే భీమ్ టీజర్ విజువల్స్ మీద దృష్టిపెట్టింది. ఈ నెల 22న టీజర్ రిలీజ్ చేయబోతున్నట్లు కూడా ప్రకటించింది. దీంతో అభిమానులు కౌంట్డౌన్లు మొదలుపెట్టేశారు. వారి ఉత్సాహాన్ని ఇంకా పెంచుతూ.. ఆర్ఆర్ఆర్ టీం సైతం కౌంట్ డౌన్లు నడుపుతూ.. ఇంకో ఐదు రోజుల్లో, ఇంకో నాలుగు రోజుల్లో అంటూ ఊరిస్తూ వస్తోంది.
టీజర్కు రోజులు దగ్గరపడేకొద్దీ అంచనాలు పెరిగిపోతున్నాయి. ఇటు తారక్ స్క్రీన్ ప్రెజెన్స్ విషయంలో అతడి ఫ్యాన్స్, అటు చరణ్ వాయిస్ ఓవర్ విషయంతో తన అభిమానులు భారీ అంచనాలతోనే ఉన్నారు. వాటిని రీచ్ కావడం అంత తేలిక కాదు.ఐతే తనపై ప్రేక్షకులు ఎంత అంచనాలు పెట్టుకున్నా దాన్ని బర్డెన్లాగా ఫీలవకుండా ఇంకా బాగా పని చేసి వారిని మెస్మరైజ్ చేయడం జక్కన్నకు అలవాటు. మరి భీమ్ టీజర్ విషయంలోనూ అలాగే చేస్తాడేమో చూడాలి.
This post was last modified on October 19, 2020 7:54 am
చేవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డికి పెద్ద చిక్కొచ్చి పడింది. ఈవీఎంలో ఆయన గుర్తు 2వ నెంబర్…
దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి తీసిన ఓ సినిమాలో నటించిన రోజా.. రంగుపడుద్ది అనే డైలాగుతో అలరించారు. అయితే..ఇప్పుడు ఆమెకు నిజంగానే…
జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని ఆశపడ్డ బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో ఏ చిన్న అవకాశం దొరికినా…
తన 12 మెట్ల కిన్నెర వాయిద్యంతో జాతీయస్థాయిలో గుర్తింపు పొంది రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డు అందుకున్న కిన్నెర మొగులయ్య…
ప్రతి సినిమాకు విభిన్నంగా కొత్తగా ప్రయత్నిస్తున్న సుహాస్ తాజాగా ప్రసన్నవదనంతో థియేటర్లలో అడుగు పెట్టాడు. ఈ ఏడాది అంబాజీపేట మ్యారేజీ…
దర్శకుడు శేఖర్ కమ్ముల సెన్సిటివ్ సినిమాలు తీస్తాడనే పేరే కానీ సీరియస్ సబ్జెక్టులు టచ్ చేస్తే అవుట్ ఫుట్ ఏ…