టాలీవుడ్ బడా నిర్మాత దగ్గుబాటి సురేశ్ బాబు కుటుంబంలో విషాదం చోటుచేసుకుంది. పశ్చిమ గోదావరి జిల్లా తణుకుకు చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త యలపర్తి నారాయణ చౌదరి, రాజేశ్వరిదేవిల కుమార్తెను సురేశ్ బాబు వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం సురేశ్ బాబు అత్త గారైన రాజేశ్వరి దేవి బుధవారం కన్నుమూశారు. దీంతో సురేశ్ ఫ్యామిలీ మొత్తం హుటాహుటీన తణుకు చేరింది. రాజేశ్వరి దేవి అంత్యక్రియల్లో పాలుపంచుకుంది.
ఈ సందర్భంగా తన అమ్మమ్మ పాడెను సురేశ్ బాబు కుమారుడు, నటుడు రానా దగ్గుబాటి తన భుజంపై మోశారు. ఇదిలా ఉంటే.. రాజేశ్వరి దేవి తనయుడు, రానా మేనమామ గారైన దివంగత వైటీ రాజా గతంలో తణుకు ఎమ్మెల్యేగా పనిచేశారు. అటు పారిశ్రామిక రంగంతో పాటుగా ఇటు రాజకీయంగానూ యలపర్తి ఫ్యామిలీ రాణించిన నేపథ్యంలో రెండు రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు తణుకు చేరుకుని రాజేశ్వరి దేవికి నివాళి అర్పించారు. వీరిలో నిడదవోలు మాజీ ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావు కూడా ఉన్నారు.
This post was last modified on January 30, 2025 9:47 am
ఒకప్పుడు టాలీవుడ్లో తిరుగులేని ఆధిపత్యం చలాయించిన కథానాయికల్లో తమన్నా ఒకరు. టీనేజీలోనే కథానాయిక అవతారం ఎత్తిన ఆమె పదేళ్లకు పైగానే టాప్…
థియేటర్, ఓటిటి మధ్య ఖచ్చితంగా ఎనిమిది వారాల గ్యాప్ ఉండాలనే నిబంధన మీద దక్షిణాది ఇండస్ట్రీ పెద్దలు చాలా సీరియస్…
అధికారంలోకి రావడానికి ముందు వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా ఫెరోషియస్గా కనిపించేవారు. అవినీతి కేసుల వ్యవహారం పక్కన పెడితే…
‘బాహుబలి’ సినిమాకు బాలీవుడ్ నుంచి అప్పట్లో ఎంత గొప్ప సహకారం అందిందో తెలిసిందే. కరణ్ జోహార్ లాంటి అగ్ర నిర్మాత ఆ…
మోనాలిసా.. గత ఏడాది సోషల్ మీడియాను ఒక ఊపు ఊపేసిన పేరిది. ఉత్తర్ప్రదేశ్లో జరిగిన మహా కుంభమేళాతో వెలుగులోకి వచ్చిన…
తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, మాజీ మంత్రి పార్టీ కీలక…