టాలీవుడ్ బడా నిర్మాత దగ్గుబాటి సురేశ్ బాబు కుటుంబంలో విషాదం చోటుచేసుకుంది. పశ్చిమ గోదావరి జిల్లా తణుకుకు చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త యలపర్తి నారాయణ చౌదరి, రాజేశ్వరిదేవిల కుమార్తెను సురేశ్ బాబు వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం సురేశ్ బాబు అత్త గారైన రాజేశ్వరి దేవి బుధవారం కన్నుమూశారు. దీంతో సురేశ్ ఫ్యామిలీ మొత్తం హుటాహుటీన తణుకు చేరింది. రాజేశ్వరి దేవి అంత్యక్రియల్లో పాలుపంచుకుంది.
ఈ సందర్భంగా తన అమ్మమ్మ పాడెను సురేశ్ బాబు కుమారుడు, నటుడు రానా దగ్గుబాటి తన భుజంపై మోశారు. ఇదిలా ఉంటే.. రాజేశ్వరి దేవి తనయుడు, రానా మేనమామ గారైన దివంగత వైటీ రాజా గతంలో తణుకు ఎమ్మెల్యేగా పనిచేశారు. అటు పారిశ్రామిక రంగంతో పాటుగా ఇటు రాజకీయంగానూ యలపర్తి ఫ్యామిలీ రాణించిన నేపథ్యంలో రెండు రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు తణుకు చేరుకుని రాజేశ్వరి దేవికి నివాళి అర్పించారు. వీరిలో నిడదవోలు మాజీ ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావు కూడా ఉన్నారు.
ఇంట గెలిచి రచ్చ గెలవాలి అని ఒక సామెత. కొందరు మాత్రం రచ్చ గెలిచి, తర్వాత ఇంటికి వస్తుంటారు. శోభిత…
పెద్ది ఇప్పుడు రామ్ చరణ్ కెరీర్లో మరో చాలెంజ్ లాంటి ప్రాజెక్టు. RRR తర్వాత వచ్చిన గ్లోబల్ ఇమేజ్ని నిలబెట్టుకోవాలి.…
ఇది మార్కెటింగ్ యుగం. వస్తువైనా సినిమా అయినా దాన్ని జనంలోకి తీసుకెళ్లాలంటే ప్రచారం తప్పనిసరి. కంటెంట్ ఉంటే చాలు ఇంకేం…
టాలీవుడ్ టాప్ హీరోలు వేగంగా సినిమాలు చేయాలని, ఏడాదికి ఒకట్రెండు రిలీజ్లు ఉండేలా చూసుకోవాలని ఇటు ఇండస్ట్రీ జనాలు, అటు…
ఒకప్పుడు యాక్షన్ కింగ్ గా మాస్ ప్రేక్షకులకు బాగా దగ్గరైన హీరో అర్జున్. తెలుగులో మా పల్లెలో గోపాలుడు లాంటి…
రాజస్థాన్ రాయల్స్ తరఫున బరిలోకి దిగిన 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ ఈ ఐపీఎల్ సీజన్ను పూర్తిగా తన సొంతం…