టాలీవుడ్ బడా నిర్మాత దగ్గుబాటి సురేశ్ బాబు కుటుంబంలో విషాదం చోటుచేసుకుంది. పశ్చిమ గోదావరి జిల్లా తణుకుకు చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త యలపర్తి నారాయణ చౌదరి, రాజేశ్వరిదేవిల కుమార్తెను సురేశ్ బాబు వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం సురేశ్ బాబు అత్త గారైన రాజేశ్వరి దేవి బుధవారం కన్నుమూశారు. దీంతో సురేశ్ ఫ్యామిలీ మొత్తం హుటాహుటీన తణుకు చేరింది. రాజేశ్వరి దేవి అంత్యక్రియల్లో పాలుపంచుకుంది.
ఈ సందర్భంగా తన అమ్మమ్మ పాడెను సురేశ్ బాబు కుమారుడు, నటుడు రానా దగ్గుబాటి తన భుజంపై మోశారు. ఇదిలా ఉంటే.. రాజేశ్వరి దేవి తనయుడు, రానా మేనమామ గారైన దివంగత వైటీ రాజా గతంలో తణుకు ఎమ్మెల్యేగా పనిచేశారు. అటు పారిశ్రామిక రంగంతో పాటుగా ఇటు రాజకీయంగానూ యలపర్తి ఫ్యామిలీ రాణించిన నేపథ్యంలో రెండు రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు తణుకు చేరుకుని రాజేశ్వరి దేవికి నివాళి అర్పించారు. వీరిలో నిడదవోలు మాజీ ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావు కూడా ఉన్నారు.
This post was last modified on January 30, 2025 9:47 am
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఏపీ ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ శుక్రవారం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాజకీయాల్లోకి…
తెలంగాణ అసెంబ్లీలో గురువారం చోటుచేసుకున్న రచ్చ… బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి గుండకంట్ల జగదీశ్ రెడ్డి సస్పెన్షన్ నేపథ్యంలో కలకలం…
ఖుషి తర్వాత స్క్రీన్ పై కనిపించకుండా పోయిన సమంతా తిరిగి ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. తన…
టాలీవుడ్ హీరోల్లో నానికి ఉన్న క్రెడిబిలిటీనే వేరు. ప్రతి హీరోకూ కెరీర్లో ఫ్లాపులు తప్పవు కానీ.. నాని కెరీర్ సక్సెస్…
టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు గురువారం బిజీబిజీగా గడిపారు. ఓ వైపు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు, మరోవైపు…
ఐపీఎల్ 2025 సీజన్కు ముందు ఢిల్లీ క్యాపిటల్స్ కీలక మార్పును చేపట్టింది. జట్టును ముందుండి నడిపించిన రిషభ్ పంత్ స్థానాన్ని…