టాలీవుడ్ బడా నిర్మాత దగ్గుబాటి సురేశ్ బాబు కుటుంబంలో విషాదం చోటుచేసుకుంది. పశ్చిమ గోదావరి జిల్లా తణుకుకు చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త యలపర్తి నారాయణ చౌదరి, రాజేశ్వరిదేవిల కుమార్తెను సురేశ్ బాబు వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం సురేశ్ బాబు అత్త గారైన రాజేశ్వరి దేవి బుధవారం కన్నుమూశారు. దీంతో సురేశ్ ఫ్యామిలీ మొత్తం హుటాహుటీన తణుకు చేరింది. రాజేశ్వరి దేవి అంత్యక్రియల్లో పాలుపంచుకుంది.
ఈ సందర్భంగా తన అమ్మమ్మ పాడెను సురేశ్ బాబు కుమారుడు, నటుడు రానా దగ్గుబాటి తన భుజంపై మోశారు. ఇదిలా ఉంటే.. రాజేశ్వరి దేవి తనయుడు, రానా మేనమామ గారైన దివంగత వైటీ రాజా గతంలో తణుకు ఎమ్మెల్యేగా పనిచేశారు. అటు పారిశ్రామిక రంగంతో పాటుగా ఇటు రాజకీయంగానూ యలపర్తి ఫ్యామిలీ రాణించిన నేపథ్యంలో రెండు రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు తణుకు చేరుకుని రాజేశ్వరి దేవికి నివాళి అర్పించారు. వీరిలో నిడదవోలు మాజీ ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావు కూడా ఉన్నారు.
ఏపీ రాజధాని అమరావతిలో రైతుల భూములను వారి అనుమతి లేకుండానే కూటమి సర్కారు లాక్కుంటోందని శనివారం పెద్ద రచ్చే జరిగింది. రాజధాని నిర్మాణం కోసం తమ భూములను…
లెనిన్ సినిమా ప్రమోషన్లలో హీరో అఖిల్ అక్కినేని గురించి ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశాడు నిర్మాతల్లో ఒకరైన నాగవంశీ. లెనిన్…
పిల్లలు సంపద అని సీఎం చంద్రబాబు మరోసారి స్పష్టం చేశారు. తాను చెప్పిన మాటకే కట్టుబడి ఉన్నానని తెలిపారు. దీనిని…
వియత్నాంలో విహార యాత్రకు వెళ్లిన భారతీయుల కుటుంబాల్లో విషాదం నెలకొంది. ఊహించని ప్రమాదంలో చిక్కుకుని 15 మంది భారతీయులు మృతి…
తన సినిమాకు పని చేసిన టెక్నీషియన్ను ఒక నిర్మాత సైకోగా అభివర్ణించడం ఎప్పుడైనా చూశారా? సితార ఎంటర్టైన్మెంట్స్ అధినేత నాగవంశీ…
శుక్రవారం విడుదలైన లెనిన్ దూకుడు బాక్సాఫీస్ వద్ద కొనసాగుతోంది. తొలి రోజు పదమూడు కోట్లకు పైగా వసూలు చేసి శని…