ఈ రోజుల్లో ఎంత గొప్ప సినిమా వచ్చినా.. దాని గురించి సోషల్ మీడియాలో ఒక నెగెటివ్ ప్రచారం జరగడం మామూలైపోయింది. కొన్ని సినిమాలు ఈ ప్రాపగండాను తట్టుకుని నిలబడుతున్నాయి. కొన్ని దెబ్బ తింటున్నాయి. సినిమా రివ్యూలు కూడా చాలా వరకు మిక్స్డ్గా ఉంటున్నాయి. పూర్తి పాజిటివ్ టాక్ తెచ్చుకునే సినిమాలు అరుదుగానే ఉంటున్నాయి.
ఈసారి సంక్రాంతికి రిలీజైన గేమ్ చేంజర్, డాకు మహారాజ్, సంక్రాంతికి వస్తున్నాం.. ఈ మూడు కూడా యావరేజ్, ఎబోవ్ యావరేజ్ రివ్యూలే తెచ్చకున్నాయి. కానీ వీటిలో ‘సంక్రాంతికి వస్తున్నాం’ ఎవ్వరూ ఊహించని స్థాయి బ్లాక్ బస్టర్ కాగా.. ‘డాకు మహారాజ్’ కూడా హిట్ అయింది. ‘గేమ్ చేంజర్’ దెబ్బ తింది. ఈ నేపథ్యంలో రివ్యూలు, సోషల్ మీడియా నెగెటివిటీ గురించి ‘డాకు మహారాజ్’ దర్శకుడు బాబి కొల్లి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడాడు.
‘‘ఒకప్పుడు సోషల్ మీడియాలో నెగెటివ్ రివ్యూలు సరదాగా మొదలయ్యాయి. కానీ ఇప్పుడు అది సీరియస్ సమస్యగా మారింది. సినిమా మొదలవగానే థియేటర్ నుంచి ఎవరో ఒకరు రివ్యూ ఇచ్చేస్తున్నారు. ఏ ఇద్దరి అభిప్రాయం ఒకలా ఉండదు. అలాంటపుడు మన అభిప్రాయాన్ని పది మంది అంగీకరించాలని ఎందుకు అనుకోవాలి. కొన్ని రోజులు ఆగితే అసలు రివ్యూ తెలుస్తుంది అనుకోవచ్చు.
సినిమా అంటే ఒక వ్యక్తి జీవితం కాదు. వందల మంది కష్టం. నా సినిమా సెట్స్లోనే 400 మంది పని చేస్తారు. ఇంతమంది శ్రమను ఒక్క మాటతో చంపేయడం చాలా తప్పు. ప్రస్తుతం సినిమాను బలవంతంగా చంపే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ‘బాహుబలి’ లాంటి గొప్ప సినిమాను వచ్చినపుడు కూడా రాజమౌళిని ట్రోల్ చేశారు. ఆ సినిమాలో కథ లేదని రివ్యూలు రాశారు. కానీ చివరికి ఆ చిత్రం ప్రభంజనం సృష్టించింది. తెలుగు సినిమా ఖ్యాతిని పెంచింది.
అలాంటి వ్యక్తినే ట్రోల్ చేసినపుడు నేనెంత అనుకుంటాను. మన సినిమాలో దమ్ముంటే అది చరిత్ర సృష్టిస్తుంది. చిరంజీవితో నేను చేసిన ‘వాల్తేరు వీరయ్య’కు తక్కువ రేటింగ్స్ ఇచ్చారు. కానీ అది బ్లాక్ బస్టర్ అయింది’’ అని బాబీ అన్నాడు.
This post was last modified on January 29, 2025 8:52 pm
పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…
అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…
తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…