టాలీవుడ్ టాప్ రేటెడ్ సంగీత దర్శకుడిగా పీక్స్ చూస్తున్న తమన్ మేకప్ వేసుకునే ఆర్టిస్ట్ అయిపోయాడు. తమిళంలో ఆకాష్ భాస్కరన్ ని దర్శకుడిగా పరిచయం చేస్తున్న సినిమాలో ఒక కీలక పాత్ర దక్కించుకున్నాడు. ప్రస్తుతం దీని షూటింగ్ జరుగుతోంది. అథర్వ మురళి మెయిన్ హీరో. మమిత బైజు హీరోయిన్ గా చేస్తోంది. దీనికి సంబంధించిన అధికారిక వివరాలు టీమ్ బయటికి చెప్పడం లేదు కానీ గుట్టుచప్పుడు కాకుండా షూట్ కానిస్తున్నారని సమాచారం. త్వరలోనే అఫీషియల్ అనౌన్స్ మెంట్ తో పాటు మరికొన్ని కీలక వివరాలు చెప్పబోతున్నారు. తమన్ కు సంబంధించి ఈ ప్రాజెక్ట్ స్పెషల్ కానుంది.
ఎందుకంటే ఇండస్ట్రీకొచ్చిన కొత్తలో మ్యూజిక్ డైరెక్టర్స్ దగ్గర సహాయకుడిగా పని చేస్తున్నప్పుడు దర్శకుడు శంకర్ బాయ్స్ ఛాన్స్ ఇచ్చాడు. సిద్దార్థ్ తో పాటు నటించిన కుర్ర హీరోల గ్యాంగ్ లో బొద్దుగా మెప్పించాడు. యాక్టింగ్ పరంగా చెప్పుకోవడానికి మరీ ఎక్కువ లేకపోయినా క్యారెక్టర్ కు తగ్గట్టు మంచి ఛాయస్ అనిపించాడు. తర్వాత సంగీత ప్రపంచంలో బిజీ అయ్యాక తమన్ మళ్ళీ మేకప్ వేసుకునే అవకాశం రాలేదు. దేవిశ్రీ ప్రసాద్ లాగే కేవలం తెరవెనుకే పరిమితమయ్యాడు. ఇండియన్ ఐడల్ లాంటి టాలెంట్ షోలకు గెస్టుగా రావడం తప్పించి కెమెరా ముందుకు తమన్ వచ్చిన సందర్భాలు తక్కువ.
ఇప్పుడీ తమిళ చిత్రం ద్వారా కొత్త ఇన్నింగ్స్ మొదలుపెడతాడేమో చూడాలి. అన్నట్టు దీని దర్శకుడు ఆకాష్ భాస్కరన్ ప్రస్తుతం శివ కార్తికేయన్ తో పరాశక్తి చేస్తున్న సుధా కొంగర బృందంలోని సభ్యుడే. కొత్త తరహా కంటెంట్ తో అధర్వ మురళి, తమన్ పాత్రలను డిజైన్ చేసినట్టు చెబుతున్నారు. సంగీతం ఎవరు ఇస్తున్నారో వేరే చెప్పనక్కర్లేదు. గత కొన్నేళ్లుగా తమన్ డిమాండ్ బాగా పెరిగింది. అఖండ నుంచి డాకు మహారాజ్ దాకా మంచి ఫామ్ చూస్తున్నాడు. కుర్చీ మడతపెట్టి గత ఏడాది ఇండియన్ యూట్యూబ్ లో అగ్ర స్థానం సంపాదించుకుంది. మరి నటుడిగా ఎలా మెప్పిస్తాడో ఎలా కనిపిస్తాడో చూడాలి.
This post was last modified on January 29, 2025 5:39 pm
మాస్ రాజా రవితేజ నిఖార్సయిన హిట్టు కొట్టి నాలుగేళ్లయింది. ఈ నాలుగేళ్లలో ఆయన ఆరు చిత్రాలతో పలకరించాడు. వీటిలో కొన్ని…
ఏదైనా మితంగా తింటేనే అందం. మితిమీరిందా పొట్ట ఉబ్బిపోయి డాక్టర్ చుట్టూ తిరగాల్సి వస్తుంది. తిండి సామెత సినిమాలకు కూడా…
కరోనా తర్వాత థియేటర్స్ కి జనం మళ్ళీ వచ్చేలా చేసిన సినిమాల్లో జాంబీ రెడ్డి ఉంది. దర్శకుడు ప్రశాంత్ వర్మ…
ఏమైందో ఏమో కానీ ఆ దంపతులు ఒక మహిళను హత్య చేశారు. హత్య చేసి తీరిగ్గా ఆ మహిళ దేహాన్ని…
ప్రమాదంలో కలిగిన గాయం వల్ల చికిత్స చేయించుకుని విశ్రాంతిలో ఉన్న బాలకృష్ణ డాక్టర్లు చెప్పిన టైం కన్నా ముందే షూటింగ్…
దేశంలో సినీ అభిమానం పరంగా టాప్లో నిలిచే తెలుగు రాష్ట్రాల్లో ఐమాక్స్ స్క్రీన్ లేకపోవడం ఆశ్చర్యమే. గతంలో ప్రసాద్స్లో ఈ…