అసలు ఏ దశలో ఉందో, ఎక్కడ జరుగుతోందో కనీసం క్లూ కూడా ఇవ్వకుండా రాజమౌళి మొదలుపెట్టిన ఎస్ఎస్ఎంబి 29 ఒక చిన్న వీడియోతో ఎంత మార్కెటింగ్ చేసుకుందో చూశాం. లీకులు కాకుండా టీమ్ తీసుకున్న జాగ్రత్తలు ఫలితాన్ని ఇస్తున్నాయి. వర్క్ షాప్స్, ఫోటో షూట్స్, ఓపెనింగ్ పూజా ఇలా ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ఏ కార్యక్రమం జరిగినా ఒక్క ఫోటో బయటికి రాలేదంటే సెక్యూరిటీ ఎంత పకడ్బందీగా ఉందో అర్థం చేసుకోవచ్చు.
అందుకే మహేష్ బాబు ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా అప్ డేట్స్ కోసం ఎంత వేడుకున్నా ఫలితం లేకుండా పోతోంది. ఇక అసలు పాయింట్ కొద్దాం.
వెయ్యి కోట్ల బడ్జెట్ అంచనాగా చెప్పబడుతున్న ఈ ప్యాన్ వరల్డ్ మూవీలో ప్రియాంకా చోప్రా ఆల్రెడీ లాకైన సంగతి తెలిసిందే. అయితే తను మహేష్ సరసన హీరోయిన్ కాదనేది లేటెస్ట్ న్యూస్. చాలా కీలకమైన పాత్ర కాబట్టే ఒప్పుకుందని వినికిడి. ఇదిలా ఉండగా మలయాళ నటుడు సలార్ ఫేమ్ పృథ్విరాజ్ సుకుమారన్ ఇందులో నటిస్తాడనే టాక్ నెలల క్రితమే బయటికి వచ్చింది.
కానీ డేట్ల సర్దుబాటు సమస్య వల్ల ఇప్పుడు తన స్థానంలో ధూమ్ విలన్ జాన్ అబ్రహం వస్తున్నట్టు సమాచారం. అధికారికంగా ఇంకా ప్రకటించలేదు కానీ ఇటీవలే చర్చలు జరిగినట్టు తెలిసింది. అఫీషియల్ న్యూస్ వచ్చేదాకా ఆగాలి.
అంటే జాన్ అబ్రహం, ప్రియాంకా చోప్రా ఒక జంటగా కనిపిస్తారన్న మాట. సో జక్కన్న ఊహకందనిది ఏదో ప్లాన్ చేస్తున్నారని అర్థమవుతోంది. అడవి నేపథ్యంలో ఇండియానా జోన్స్ తరహాలో ఒక థ్రిల్లింగ్ ఎక్స్ పీరియన్స్ ఇవ్వబోతున్న రాజమౌళి ఏడాదిన్నరలోపే పూర్తి చేసేలా టార్గెట్ పెట్టుకున్నారట.
అయితే ఆర్ఆర్ఆర్ లాగా ఒక భాగమే ఉంటుందా లేక బాహుబలి తరహాలో సీక్వెల్ ప్లాన్ చేశారా అనేది ప్రెస్ మీట్ లో ఆయనే స్వయంగా చెబితే తప్ప క్లారిటీ రాదు. ఇదంతా నిజమే అయినా పక్షంలో మహేష్ బాబు సరసన కనిపించే అదృష్టవంతురాలు ఎవరో వేచి చూడాలి. లీకులతోనే హైప్ ఎక్కడికో వెళ్ళిపోతోంది.
This post was last modified on January 29, 2025 11:58 am
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…