అసలు ఏ దశలో ఉందో, ఎక్కడ జరుగుతోందో కనీసం క్లూ కూడా ఇవ్వకుండా రాజమౌళి మొదలుపెట్టిన ఎస్ఎస్ఎంబి 29 ఒక చిన్న వీడియోతో ఎంత మార్కెటింగ్ చేసుకుందో చూశాం. లీకులు కాకుండా టీమ్ తీసుకున్న జాగ్రత్తలు ఫలితాన్ని ఇస్తున్నాయి. వర్క్ షాప్స్, ఫోటో షూట్స్, ఓపెనింగ్ పూజా ఇలా ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ఏ కార్యక్రమం జరిగినా ఒక్క ఫోటో బయటికి రాలేదంటే సెక్యూరిటీ ఎంత పకడ్బందీగా ఉందో అర్థం చేసుకోవచ్చు.
అందుకే మహేష్ బాబు ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా అప్ డేట్స్ కోసం ఎంత వేడుకున్నా ఫలితం లేకుండా పోతోంది. ఇక అసలు పాయింట్ కొద్దాం.
వెయ్యి కోట్ల బడ్జెట్ అంచనాగా చెప్పబడుతున్న ఈ ప్యాన్ వరల్డ్ మూవీలో ప్రియాంకా చోప్రా ఆల్రెడీ లాకైన సంగతి తెలిసిందే. అయితే తను మహేష్ సరసన హీరోయిన్ కాదనేది లేటెస్ట్ న్యూస్. చాలా కీలకమైన పాత్ర కాబట్టే ఒప్పుకుందని వినికిడి. ఇదిలా ఉండగా మలయాళ నటుడు సలార్ ఫేమ్ పృథ్విరాజ్ సుకుమారన్ ఇందులో నటిస్తాడనే టాక్ నెలల క్రితమే బయటికి వచ్చింది.
కానీ డేట్ల సర్దుబాటు సమస్య వల్ల ఇప్పుడు తన స్థానంలో ధూమ్ విలన్ జాన్ అబ్రహం వస్తున్నట్టు సమాచారం. అధికారికంగా ఇంకా ప్రకటించలేదు కానీ ఇటీవలే చర్చలు జరిగినట్టు తెలిసింది. అఫీషియల్ న్యూస్ వచ్చేదాకా ఆగాలి.
అంటే జాన్ అబ్రహం, ప్రియాంకా చోప్రా ఒక జంటగా కనిపిస్తారన్న మాట. సో జక్కన్న ఊహకందనిది ఏదో ప్లాన్ చేస్తున్నారని అర్థమవుతోంది. అడవి నేపథ్యంలో ఇండియానా జోన్స్ తరహాలో ఒక థ్రిల్లింగ్ ఎక్స్ పీరియన్స్ ఇవ్వబోతున్న రాజమౌళి ఏడాదిన్నరలోపే పూర్తి చేసేలా టార్గెట్ పెట్టుకున్నారట.
అయితే ఆర్ఆర్ఆర్ లాగా ఒక భాగమే ఉంటుందా లేక బాహుబలి తరహాలో సీక్వెల్ ప్లాన్ చేశారా అనేది ప్రెస్ మీట్ లో ఆయనే స్వయంగా చెబితే తప్ప క్లారిటీ రాదు. ఇదంతా నిజమే అయినా పక్షంలో మహేష్ బాబు సరసన కనిపించే అదృష్టవంతురాలు ఎవరో వేచి చూడాలి. లీకులతోనే హైప్ ఎక్కడికో వెళ్ళిపోతోంది.
This post was last modified on January 29, 2025 11:58 am
చిన్న హీరోలు వేగంగా ఎక్కువ సినిమాలు చేయడం రెమ్యునరేషన్ పరంగా సంతృప్తినిస్తుందేమో కానీ కెరీర్ పరంగా ఒక్కోసారి ఇదే పెద్ద…
స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి బీఆర్ఎస్ తరఫున గత ఎన్నికల్లో గెలిచారు. ఆ తర్వాత కాంగ్రెస్కు మద్దతుగా వ్యవహరిస్తూ…
నైజాంలో చాలా ఏళ్ల నుంచి డిస్ట్రిబ్యూషన్లో దిల్ రాజే కింగ్. ఆయన ఈ ఏరియాలో నంబర్ వన్ డిస్ట్రిబ్యూటర్గా ఎదిగాక..…
వచ్చే వారం ది కేరళ స్టోరీ 2 విడుదల కానుంది. మూడేళ్ళ క్రితం వచ్చిన మొదటి భాగం ఎంత సంచలనం…
రాజకీయ పార్టీలు ఓట్ల కోసం కురిపిస్తున్న ఉచితాల ఆఫర్లపై దేశ సర్వోన్నత న్యాయస్థానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కేవలం…
ఒకప్పుడు శంకర్తో సినిమా చేయడానికి వివిధ ఇండస్ట్రీల టాప్ స్టార్లు, అగ్ర నిర్మాతలు లైన్లో ఉండేవారు. మెగాస్టార్ చిరంజీవి అంతటి…