Movie News

SSMB 29 – ధూమ్ విలన్ జంజీర్ హీరోయిన్

అసలు ఏ దశలో ఉందో, ఎక్కడ జరుగుతోందో కనీసం క్లూ కూడా ఇవ్వకుండా రాజమౌళి మొదలుపెట్టిన ఎస్ఎస్ఎంబి 29 ఒక చిన్న వీడియోతో ఎంత మార్కెటింగ్ చేసుకుందో చూశాం. లీకులు కాకుండా టీమ్ తీసుకున్న జాగ్రత్తలు ఫలితాన్ని ఇస్తున్నాయి. వర్క్ షాప్స్, ఫోటో షూట్స్, ఓపెనింగ్ పూజా ఇలా ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ఏ కార్యక్రమం జరిగినా ఒక్క ఫోటో బయటికి రాలేదంటే సెక్యూరిటీ ఎంత పకడ్బందీగా ఉందో అర్థం చేసుకోవచ్చు.

అందుకే మహేష్ బాబు ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా అప్ డేట్స్ కోసం ఎంత వేడుకున్నా ఫలితం లేకుండా పోతోంది. ఇక అసలు పాయింట్ కొద్దాం.

వెయ్యి కోట్ల బడ్జెట్ అంచనాగా చెప్పబడుతున్న ఈ ప్యాన్ వరల్డ్ మూవీలో ప్రియాంకా చోప్రా ఆల్రెడీ లాకైన సంగతి తెలిసిందే. అయితే తను మహేష్ సరసన హీరోయిన్ కాదనేది లేటెస్ట్ న్యూస్. చాలా కీలకమైన పాత్ర కాబట్టే ఒప్పుకుందని వినికిడి. ఇదిలా ఉండగా మలయాళ నటుడు సలార్ ఫేమ్ పృథ్విరాజ్ సుకుమారన్ ఇందులో నటిస్తాడనే టాక్ నెలల క్రితమే బయటికి వచ్చింది.

కానీ డేట్ల సర్దుబాటు సమస్య వల్ల ఇప్పుడు తన స్థానంలో ధూమ్ విలన్ జాన్ అబ్రహం వస్తున్నట్టు సమాచారం. అధికారికంగా ఇంకా ప్రకటించలేదు కానీ ఇటీవలే చర్చలు జరిగినట్టు తెలిసింది. అఫీషియల్ న్యూస్ వచ్చేదాకా ఆగాలి.

అంటే జాన్ అబ్రహం, ప్రియాంకా చోప్రా ఒక జంటగా కనిపిస్తారన్న మాట. సో జక్కన్న ఊహకందనిది ఏదో ప్లాన్ చేస్తున్నారని అర్థమవుతోంది. అడవి నేపథ్యంలో ఇండియానా జోన్స్ తరహాలో ఒక థ్రిల్లింగ్ ఎక్స్ పీరియన్స్ ఇవ్వబోతున్న రాజమౌళి ఏడాదిన్నరలోపే పూర్తి చేసేలా టార్గెట్ పెట్టుకున్నారట.

అయితే ఆర్ఆర్ఆర్ లాగా ఒక భాగమే ఉంటుందా లేక బాహుబలి తరహాలో సీక్వెల్ ప్లాన్ చేశారా అనేది ప్రెస్ మీట్ లో ఆయనే స్వయంగా చెబితే తప్ప క్లారిటీ రాదు. ఇదంతా నిజమే అయినా పక్షంలో మహేష్ బాబు సరసన కనిపించే అదృష్టవంతురాలు ఎవరో వేచి చూడాలి. లీకులతోనే హైప్ ఎక్కడికో వెళ్ళిపోతోంది.

This post was last modified on January 29, 2025 11:58 am

Share
Show comments
Published by
Kumar

Recent Posts

మహేష్ అభిమానులకు హరీష్ సారి

సోషల్ మీడియాలో చాలా అలెర్ట్ గా ఉండాలి. ముఖ్యంగా సెలబ్రిటీలు బిజీగా షెడ్యూల్స్ లో ఏ మాత్రం ఏమరుపాటుగా ఉన్నా…

29 minutes ago

కొత్త శుక్రవారం గంగార్పణం అవుతోంది

థియేటర్లకు సరైన సినిమాలు వస్తే రావడానికి ప్రేక్షకులు సిద్ధంగా ఉన్నారు. ఎటొచ్చి వాళ్ళను కనీస స్థాయిలో మెప్పించే కంటెంట్ ఉన్నవి…

37 minutes ago

టికెట్ ఇచ్చినా పట్టించుకోలేదా?

తెలంగాణలో రెండు రాజ్య‌స‌భ స్థానాల‌కు పోటీ చేసిన కాంగ్రెస్ పార్టీ అభ్య‌ర్థులు అభిషేక్ మ‌ను సింఘ్వీ, వేం న‌రేందర్ రెడ్డిలు..…

4 hours ago

ఏపీలో హోటల్స్… ఇబ్బంది లేనట్టేనా?

వంటగ్యాస్ కొరత కారణంగా దేశవ్యాప్తంగా చిన్న హోటళ్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. హోటళ్లకు సరఫరా అయ్యే కమర్షియల్ సిలిండర్ల పంపిణీని…

7 hours ago

ఏపీలో స్పెషల్ ఆఫీసర్ల పాలన.. ఎక్కడంటే!

రాష్ట్రంలోని పలు మున్సిపల్ సంస్థల్లో పాలకవర్గాల గడువు ముగియడంతో అక్కడ స్పెషల్ ఆఫీసర్ల పాలన అమల్లోకి రానుంది. మున్సిపల్ కార్పొరేషన్లు,…

7 hours ago

డైరెక్ట‌ర్ హైప్ ఇస్తుంటే… నాగ్ ఫ్యాన్స్‌కు టెన్ష‌న్‌

టాలీవుడ్ సీనియర్ హీరో అక్కినేని నాగార్జున వ‌రుస‌గా త‌మిళ న‌టులు, టెక్నీషియ‌న్ల‌తో ప‌ని చేస్తున్నాడు. గ‌త ఏడాది ధ‌నుష్‌తో క‌లిసి…

10 hours ago