టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్సేన్ కొత్త చిత్రం ‘లైలా’లో ఆకాంక్ష శర్మ అనే కొత్తమ్మాయి కథానాయికగా నటిస్తున్న సంగతి తెలిసిందే. మోడలింగ్, మ్యూజికల్ వీడియోల ద్వారా వెలుగులోకి వచ్చిన ఈ అమ్మాయి గురించి ఇప్పుడు అందరూ ఆశ్చర్యంగా మాట్లాడుకుంటున్నారు. మామూలుగా తొలి సినిమా హిట్టయ్యాక హీరోయిన్లకు వరుసగా అవకాశాలు రావడం మామూలే. కానీ ఆకాంక్షకు మాత్రం తొలి సినిమా రిలీజ్ ముంగిటే అవకాశాలు వరుస కడుతున్నాయి.
ఇప్పటికే ఆమె నాలుగు చిత్రాల్లో నటిస్తుండడం విశేషం. ఇందులో ముందుగా రిలీజ్ కాబోయేది ‘లైలా’నే కాబట్టి అదే తన డెబ్యూ మూవీగా భావించాలి. దీని తర్వాత కొంచెం కొంచెం గ్యాప్లో ఇదే ఏడాది ఆమె సినిమాలు మరో మూడు విడుదల కాబోతుండడం విశేషం. తెలుగులో అరంగేట్రం చేయడానికి ముందే ఆకాంక్ష హిందీలో మూడు క్రేజీ ప్రాజెక్టుల్లో నటిస్తోంది.
అందులో ఒకటి సునీల్ శెట్టి, వివేక్ ఒబెరాయ్ లాంటి పెద్ద హీరోలు నటిస్తున్న ‘కేసరి వీర్’. ఇదొక పీరియడ్ మూవీ. ఇందులో ఆకాంక్షకు ముఖ్యమైన పాత్రే దక్కినట్లు సమాచారం. ఇంకోవైపు మిలప్ జవేరి రూపొందిస్తున్న ‘తేరా యార్ హూ మై’ అనే రొమాంటిక్ మూవీలోనూ ఆకాంక్ష నటిస్తోంది. ఆమె సైన్ చేసిన తొలి హిందీ చిత్రం ఇదే. ఇందులో అమన్ ఇంద్ర కుమార్ కథానాయకుడిగా నటిస్తున్నాడు.
ఈ చిత్రంలో ఆకాంక్ష నటనకు ఫిదా అయిన దర్శకుడు మిలప్ జవేరి.. తాను డైరెక్ట్ చేయనున్న మరో సినిమాలో కూడా ఛాన్స్ ఇచ్చాడు. ఈ రెండు చిత్రాలతో పాటు మూడో సినిమా కూడా ఈ ఏడాదే విడుదలవుతుందట. ఇలా ఒక్క సినిమా కూడా రిలీజ్ కాకముందే మూడు ప్రాజెక్టుల్లో అవకాశాలు దక్కించుకోవడం అరుదైన విషయమే. ఇటీవలే ‘లైలా’ నుంచి రిలీజ్ చేసిన ఓ పాటలో ఆకాంక్ష అందాల ఆరబోతతో కుర్రాళ్ల దృష్టిని బాగానే ఆకర్షించింది.
This post was last modified on January 28, 2025 6:41 pm
ఒకప్పుడు ఇంగ్లీష్ సినిమాలకు మన దేశంలో తెగ క్రేజ్ ఉండేది. జురాసిక్ పార్క్ నుంచి ఇది విపరీతంగా పెరిగిపోయింది. దానికి…
గత వారం విడుదలైన ‘చెన్నై లవ్ స్టోరీ’ సినిమా ఫుల్ పాజిటివ్ టాకేమీ తెచ్చుకోలేదు. ప్రిమియర్స్ నుంచే డివైడ్ టాక్ మొదలైంది.…
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని విష్ణుమూర్తి అవతారంగా ప్రముఖ బాలివుడ్ నటుడు సుదేష్ బెర్రీ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో…
బలమైన కంబ్యాక్ కోసం ఎదురు చూస్తున్న మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఆశలన్నీ కొరియన్ కనకరాజు మీదే ఉన్నాయి. ఆగస్ట్…
ఏపీ దశ దిశలను మార్చేసే భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం శనివారం ఉదయం లాంఛనంగా ప్రారంబమైంది. దేశ ప్రధాని నరేంద్ర మోదీ అల్లూరి సీతారామరాజు…
జంతర్ మంతర్ ఆందోళనలో ప్రధాని మోదీపై విమర్శలు చేయడం కన్నీళ్లు తెప్పించిందని, పండ్లు కాసే చెట్టుపైకి రాళ్లేస్తారని, దేశం కోసం…