ఈ సంక్రాంతికి రిలీజైన మూడు చిత్రాల్లో స్టార్ కాస్ట్, బడ్జెట్, బిజినెస్.. ఇలా అన్ని రకాలుగా పెద్ద సినిమా అంటే ‘గేమ్ చేంజర్’యే. కొన్ని కారణాల వల్ల సినిమా ఆలస్యం అయినప్పటికీ.. సంక్రాంతి లాంటి క్రేజీ సీజన్లో రిలీజవుతున్న ఈ చిత్రం ఘనవిజయం సాధిస్తుందనే ఆశించారు మెగా అభిమానులు. కానీ శంకర్ చివరి చిత్రం ‘ఇండియన్-2’ కంటే బెటర్ అనే టాక్ తెచ్చుకుంది కానీ.. అంతకుమించి పాజిటివ్ టాక్ అయితే తెచ్చుకోలేదు.
కానీ సంక్రాంతి సీజన్, కాంబినేషన్ క్రేజ్ వల్ల ఓపెనింగ్స్ అయితే వచ్చాయి. కానీ తర్వాత సినిమా నిలబడలేకపోయింది. ముఖ్యంగా ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా దూకుడు మొదలయ్యాక ‘గేమ్ చేంజర్’ పూర్తిగా వెనుకబడిపోయింది. బాక్సాఫీస్ లెక్కల్లో చూస్తే ఈ సినిమా ఫ్లాప్ అనడంలో సందేహం లేదు. ఐతే సంక్రాంతి టైం కాబట్టి ఈ సినిమా ఇప్పటికీ థియేటర్లలో ఉంది. స్క్రీన్లు తగ్గాయి కానీ.. రన్ కొనసాగుతోంది.
ఈ నేపథ్యంలో ‘గేమ్ చేంజర్’ టీం వ్యూహాత్మక మౌనం పాటిస్తోంది. సినిమా థియేటర్లలో ఉండగా రిజల్ట్ గురించి ఎవ్వరూ మాట్లాడట్లేదు. కానీ ఈ చిత్రంలో ఒక కథానాయికగా నటించిన అంజలి పరోక్షంగా ‘గేమ్ చేంజర్’ రిజల్ట్ గురించి ఒప్పేసుకుంది. తమిళంలో సంక్రాంతికే రిలీజై సూపర్ హిట్ అయిన తన పాత చిత్రం ‘మదగజ రాజా’ తెలుగులోనూ విడుదల కానున్న నేపథ్యంలో ప్రెస్ మీట్లో పాల్గొన్న అంజలికి ‘గేమ్ చేంజర్’ గురించి ప్రశ్న ఎదురైంది. అక్కడ ‘మదగజ రాజా’ బాగా ఆడింది, ఇక్కడ ‘గేమ్ చేంజర్’ కూడా అలాగే ఆడి ఉంటే బాగుండేది కదా అని అడిగితే..
‘‘గేమ్ చేంజర్ నేను చాలా ఇష్టపడి చేసి సినిమా. దాని కోసం 200 శాతం ఎఫర్ట్ పెట్టాను. సినిమా చూసిన వాళ్లందరూ అది మంచి సినిమా అన్నారు. ఎవ్వరూ బాగా లేదని చెప్పలేదు. దాని ఫలితం గురించి మాట్లాడాలంటే ఇంకో ప్రెస్ మీట్, అరగంటకు పైగా సమయం అవసరం. కానీ ఆ సినిమా విషయంలో నేను బాగా హర్ట్ అయ్యాను’’ అంటూ ‘గేమ్ చేంజర్’ రిజల్ట్ తనను నిరాశకు గురి చేసినట్లు చెప్పకనే చెప్పింది అంజలి.
నిన్న విడుదలైన మా ఇంటి బంగారంకు మంచి రెస్పాన్స్ వస్తోంది. మెయిన్ సెంటర్స్ థియేటర్లు దాదాపుగా హౌస్ ఫుల్స్ నమోదు…
నిన్న విడుదలైన మా ఇంటి బంగారంలో మూడు పాత్రలు మహిళా ప్రేక్షకులకు బాగా గుర్తుండిపోయాయి. మొదటి పేరు సమంత అని…
నిన్న విడుదలైన కొత్త సినిమాల్లో అతి తక్కువ నోటీస్ తెచ్చుకున్నది మలయాళం డబ్బింగ్ బాలన్ ది బాయ్. అన్నపూర్ణ సంస్థ…
కాపుల విషయంలో ఏం చేయాలన్న అంశంపై వైసీపీ తర్జన భర్జన పడుతోందా? వారితో కలిసి ముందుకు సాగాలా? లేక.. వారిని…
ఈ ఏడాది ఫిబ్రవరి 28. ప్రపంచం కళ్లు తెరుస్తున్న సమయం. ఊహాతీతంగా.. అన్ని మీడియాల్లోనూ.. అ ప్పటికే.. ఇరాన్పై అమెరికా-ఇజ్రాయెల్…
వైసీపీ సీనియర్ నాయకుడు, ఫైర్బ్రాండ్ కొడాలి నానిపై 2021లో నమోదైన కేసు విచారణకు తాజాగా ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.…