బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ ఇంట్లో ఇటీవల జరిగిన దాడి ఘటనలో ముంబై పోలీసులు కొత్త మలుపు తీసుకొచ్చారు. ఈ కేసులో పశ్చిమ బెంగాల్లోని నదియా జిల్లాకు చెందిన ఓ మహిళను అరెస్టు చేశారు. సైఫ్ అలీఖాన్పై దాడికి పాల్పడిన నిందితుడు వినియోగించిన సిమ్ కార్డు ఈ మహిళ పేరుతో ఉందని పోలీసులు గుర్తించారు. నదియా జిల్లాలోని చప్రా గ్రామానికి చెందిన ఈ మహిళకు, దాడి కేసులో ప్రధాన నిందితుడితో సంబంధం ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా భారత్లో ప్రవేశించిన నిందితుడు, అరెస్టు అయిన మహిళతో టచ్లో ఉన్నట్లు పోలీసులు ధృవీకరించారు. దీంతో ఈ కేసు మరింత సీరియస్గా మారింది. ముంబై పోలీసుల బృందం దర్యాప్తు నిమిత్తం పశ్చిమ బెంగాల్ చేరుకుంది. అక్కడ స్థానిక పోలీసుల సహకారంతో నిందితురాలిని అదుపులోకి తీసుకున్నారు. సిమ్ కార్డు సమాచారంతో పాటు, నిందితుడితో ఆమె ఫోన్ సంభాషణలు కేసులో కీలక ఆధారాలుగా మారాయి.
ఈ కేసులో నిందితుడు బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా ప్రవేశించాడని పోలీసులు అనుమానిస్తున్నారు. అతను మహిళతో కలసి పలు ప్రాంతాల్లో ఉన్నట్లు ఆధారాలు లభించాయి. ఈ ఇద్దరి మధ్య ఉన్న సంబంధం, దాడి వెనుక అసలు ఉద్దేశ్యం ఏమిటన్నది తెలుసుకునేందుకు పోలీసులు మరింత లోతుగా విచారణ కొనసాగిస్తున్నారు.
ఇక బాలీవుడ్లో ఈ ఘటనకు సంబంధించి తీవ్ర చర్చలు జరుగుతున్నాయి. సైఫ్ అలీఖాన్ కుటుంబం ఈ కేసు దర్యాప్తుపై పూర్తి నమ్మకం ఉందని తెలిపింది. నిందితుడిని పూర్తిగా గుర్తించి, కఠిన చర్యలు తీసుకుంటామని ముంబై పోలీసులు హామీ ఇచ్చారు. మరి కేసులో అసలు నిజాలు ఎప్పుడు బయటపడతాయో చూడాలి.
This post was last modified on January 28, 2025 9:09 am
వస్తువులకే కాదు సినిమాలకు కూడా మార్కెటింగ్ చాలా అవసరం. ప్రేక్షుకులు టికెట్లు కొనేలా చేయాలంటే కేవలం పోస్టర్లతో పనయ్యే కాలం…
తమిళగ వెట్రి కళగం అధినేత జోసెఫ్ విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయడం ఖరారైంది. ఆరు రోజులుగా ట్విస్టులతో సాగిన రాజకీయ…
రాజకీయాల్లో అవకాశాలు రావడమే అరుదు. వచ్చిన వాటిని వినియోగించుకోవాల్సిన అవసరం.. వాటిని పట్టుకుని ఎదగాల్సిన అవసరం కూడా పార్టీలకు, నాయకులకు…
తమిళనాడు కొత్త ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ కొత్త సినిమా జన నాయకుడు విడుదలకు మార్గం సుగమమయ్యింది. సిఎం పదవిని చేపట్టేందుకు…
పదమూడేళ్ల క్రితం ఇండస్ట్రీకి కొత్త ట్రెండ్ తీసుకొచ్చిన దృశ్యం ఫ్రాంచైజ్ లో మూడో భాగం మే 21 విడుదల కానుంది.…
తమిళనాడు రాజకీయాల్లో చోటు చేసుకున్న అనిశ్చిత పరిస్థితి తొలిగిపోయింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అతి పెద్ద పార్టీగా అవతరించిన…