బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ ఇంట్లో ఇటీవల జరిగిన దాడి ఘటనలో ముంబై పోలీసులు కొత్త మలుపు తీసుకొచ్చారు. ఈ కేసులో పశ్చిమ బెంగాల్లోని నదియా జిల్లాకు చెందిన ఓ మహిళను అరెస్టు చేశారు. సైఫ్ అలీఖాన్పై దాడికి పాల్పడిన నిందితుడు వినియోగించిన సిమ్ కార్డు ఈ మహిళ పేరుతో ఉందని పోలీసులు గుర్తించారు. నదియా జిల్లాలోని చప్రా గ్రామానికి చెందిన ఈ మహిళకు, దాడి కేసులో ప్రధాన నిందితుడితో సంబంధం ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా భారత్లో ప్రవేశించిన నిందితుడు, అరెస్టు అయిన మహిళతో టచ్లో ఉన్నట్లు పోలీసులు ధృవీకరించారు. దీంతో ఈ కేసు మరింత సీరియస్గా మారింది. ముంబై పోలీసుల బృందం దర్యాప్తు నిమిత్తం పశ్చిమ బెంగాల్ చేరుకుంది. అక్కడ స్థానిక పోలీసుల సహకారంతో నిందితురాలిని అదుపులోకి తీసుకున్నారు. సిమ్ కార్డు సమాచారంతో పాటు, నిందితుడితో ఆమె ఫోన్ సంభాషణలు కేసులో కీలక ఆధారాలుగా మారాయి.
ఈ కేసులో నిందితుడు బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా ప్రవేశించాడని పోలీసులు అనుమానిస్తున్నారు. అతను మహిళతో కలసి పలు ప్రాంతాల్లో ఉన్నట్లు ఆధారాలు లభించాయి. ఈ ఇద్దరి మధ్య ఉన్న సంబంధం, దాడి వెనుక అసలు ఉద్దేశ్యం ఏమిటన్నది తెలుసుకునేందుకు పోలీసులు మరింత లోతుగా విచారణ కొనసాగిస్తున్నారు.
ఇక బాలీవుడ్లో ఈ ఘటనకు సంబంధించి తీవ్ర చర్చలు జరుగుతున్నాయి. సైఫ్ అలీఖాన్ కుటుంబం ఈ కేసు దర్యాప్తుపై పూర్తి నమ్మకం ఉందని తెలిపింది. నిందితుడిని పూర్తిగా గుర్తించి, కఠిన చర్యలు తీసుకుంటామని ముంబై పోలీసులు హామీ ఇచ్చారు. మరి కేసులో అసలు నిజాలు ఎప్పుడు బయటపడతాయో చూడాలి.
This post was last modified on January 28, 2025 9:09 am
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…