భాషతో సంబంధం లేకుండా ప్రపంచమంతా కోట్లాది అభిమానులను సంపాదించుకున్న మాస్ట్రో ఇళయరాజా ఇప్పటి 5జి జనరేషన్ సంగీత ప్రియులకు సైతం ఆరాధ్యనీయులు. తెలుగులో ఎన్నో ఎవర్ గ్రీన్ ఆల్బమ్స్ ఇచ్చి ప్రేక్షకుల హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్నారు. అలాంటి లెజెండరీ మీద ఎవరైనా కామెంట్ చేస్తే కోపం రావడం సహజం.
డిటెక్టివ్, పిశాచి, సైకో లాంటి సినిమాల ద్వారా మనకూ పరిచయమున్న దర్శకుడు, నటుడు మిస్కిన్ ఈ తప్పు చేశారు. బాటిల్ రాధ అనే తమిళ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఇళయరాజా మీద చేసిన కామెంట్లు ఇంటా బయటా తీవ్ర ఆగ్రహానికి కారణమయ్యాయి.
తన ప్రసంగంలో భాగంగా ఆయన మాట్లాడుతూ రాజా సంగీతం విని మద్యానికి బానిసైన వాళ్ళు ఎందరో ఉన్నారని, ఆరోగ్యాలు పాడు చేసుకున్నారని అన్నారు. దీంతో ఒక్కసారిగా అక్కడున్న వారంతా షాక్ తిన్నారు. ఆయన ఉద్దేశం ఏదైనా అర్థం మాత్రం పూర్తి నెగటివ్ గా వచ్చేసింది.
అంటే ఇళయరాజా పాటలు వినే పబ్లిక్ బార్లకు వెళ్ళేవాళ్ళనే కోణంలో మీనింగ్ రావడంతో ఒక్కసారిగా సోషల్ మీడియా నెటిజెన్లు భగ్గుమన్నారు. జరిగిన తప్పు తెలుసుకున్న మిస్కిన్ వెంటనే క్షమాపణ చెప్పారు కానీ ఆలోగానే చాలా డ్యామేజ్ అయిపోయింది. ఈయన సైకోకి సంగీతం ఇచ్చింది ఇళయరాజానే.
హీరో విశాల్ తీవ్రంగా స్పందిస్తూ గొప్ప వ్యక్తులను కించపరిచేలా మాట్లాడ్డంలో మిస్కిన్ ఎప్పటి నుంచో ఇదే ధోరణి ప్రదర్శిస్తున్నారని దుయ్యబట్టాడు. ఇళయరాజాని అనేంత స్థాయి మిస్కిన్ కు లేదని సారీ చెప్పినంత మాత్రాన తప్పు ఒప్పుగా మారదని ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇక్కడో విషయాన్ని గుర్తు చేసుకోవాలి.
డిటెక్టివ్ 2 తీస్తున్న టైంలోనే విభేదాలు తలెత్తి ఆ ప్రాజెక్టు నుంచి మిస్కిన్ బయటికి వచ్చాడు. విశాల్ స్వయంగా దర్శకత్వం వహించాలని నిర్ణయించుకున్నాడు. అయినా మిస్కిన్ ఇలా నోరు జారడం ఇదే మొదటిసారి కాదు. కొట్టుకలి ఈవెంట్ లో ఈ సినిమా ఆడకపోతే నగ్నంగా నిలబడతానని స్టేట్ మెంట్ ఇచ్చి కాంట్రావర్సి రేపాడు.
This post was last modified on January 27, 2025 12:49 pm
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…
కుప్పం.. ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం. గత 40 సంవత్సరాలుగా ఏక ఛత్రాధిపత్యంగా చంద్రబాబు ఇక్కడ విజయం దక్కించుకుంటున్నారు.…