భాషతో సంబంధం లేకుండా ప్రపంచమంతా కోట్లాది అభిమానులను సంపాదించుకున్న మాస్ట్రో ఇళయరాజా ఇప్పటి 5జి జనరేషన్ సంగీత ప్రియులకు సైతం ఆరాధ్యనీయులు. తెలుగులో ఎన్నో ఎవర్ గ్రీన్ ఆల్బమ్స్ ఇచ్చి ప్రేక్షకుల హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్నారు. అలాంటి లెజెండరీ మీద ఎవరైనా కామెంట్ చేస్తే కోపం రావడం సహజం.
డిటెక్టివ్, పిశాచి, సైకో లాంటి సినిమాల ద్వారా మనకూ పరిచయమున్న దర్శకుడు, నటుడు మిస్కిన్ ఈ తప్పు చేశారు. బాటిల్ రాధ అనే తమిళ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఇళయరాజా మీద చేసిన కామెంట్లు ఇంటా బయటా తీవ్ర ఆగ్రహానికి కారణమయ్యాయి.
తన ప్రసంగంలో భాగంగా ఆయన మాట్లాడుతూ రాజా సంగీతం విని మద్యానికి బానిసైన వాళ్ళు ఎందరో ఉన్నారని, ఆరోగ్యాలు పాడు చేసుకున్నారని అన్నారు. దీంతో ఒక్కసారిగా అక్కడున్న వారంతా షాక్ తిన్నారు. ఆయన ఉద్దేశం ఏదైనా అర్థం మాత్రం పూర్తి నెగటివ్ గా వచ్చేసింది.
అంటే ఇళయరాజా పాటలు వినే పబ్లిక్ బార్లకు వెళ్ళేవాళ్ళనే కోణంలో మీనింగ్ రావడంతో ఒక్కసారిగా సోషల్ మీడియా నెటిజెన్లు భగ్గుమన్నారు. జరిగిన తప్పు తెలుసుకున్న మిస్కిన్ వెంటనే క్షమాపణ చెప్పారు కానీ ఆలోగానే చాలా డ్యామేజ్ అయిపోయింది. ఈయన సైకోకి సంగీతం ఇచ్చింది ఇళయరాజానే.
హీరో విశాల్ తీవ్రంగా స్పందిస్తూ గొప్ప వ్యక్తులను కించపరిచేలా మాట్లాడ్డంలో మిస్కిన్ ఎప్పటి నుంచో ఇదే ధోరణి ప్రదర్శిస్తున్నారని దుయ్యబట్టాడు. ఇళయరాజాని అనేంత స్థాయి మిస్కిన్ కు లేదని సారీ చెప్పినంత మాత్రాన తప్పు ఒప్పుగా మారదని ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇక్కడో విషయాన్ని గుర్తు చేసుకోవాలి.
డిటెక్టివ్ 2 తీస్తున్న టైంలోనే విభేదాలు తలెత్తి ఆ ప్రాజెక్టు నుంచి మిస్కిన్ బయటికి వచ్చాడు. విశాల్ స్వయంగా దర్శకత్వం వహించాలని నిర్ణయించుకున్నాడు. అయినా మిస్కిన్ ఇలా నోరు జారడం ఇదే మొదటిసారి కాదు. కొట్టుకలి ఈవెంట్ లో ఈ సినిమా ఆడకపోతే నగ్నంగా నిలబడతానని స్టేట్ మెంట్ ఇచ్చి కాంట్రావర్సి రేపాడు.
This post was last modified on January 27, 2025 12:49 pm
ఎన్నికలు అనగానే నాయకుల్లో మార్పులు సహజం. మరీ ముఖ్యంగా ప్రధాన మంత్రినరేంద్ర మోడీ అయితే.. మరింత ఎక్కువగా శ్రద్ధ తీసుకుంటారు.…
ఒకప్పుడు టాలీవుడ్లో తిరుగులేని ఆధిపత్యం చలాయించిన కథానాయికల్లో తమన్నా ఒకరు. టీనేజీలోనే కథానాయిక అవతారం ఎత్తిన ఆమె పదేళ్లకు పైగానే టాప్…
థియేటర్, ఓటిటి మధ్య ఖచ్చితంగా ఎనిమిది వారాల గ్యాప్ ఉండాలనే నిబంధన మీద దక్షిణాది ఇండస్ట్రీ పెద్దలు చాలా సీరియస్…
అధికారంలోకి రావడానికి ముందు వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా ఫెరోషియస్గా కనిపించేవారు. అవినీతి కేసుల వ్యవహారం పక్కన పెడితే…
‘బాహుబలి’ సినిమాకు బాలీవుడ్ నుంచి అప్పట్లో ఎంత గొప్ప సహకారం అందిందో తెలిసిందే. కరణ్ జోహార్ లాంటి అగ్ర నిర్మాత ఆ…
మోనాలిసా.. గత ఏడాది సోషల్ మీడియాను ఒక ఊపు ఊపేసిన పేరిది. ఉత్తర్ప్రదేశ్లో జరిగిన మహా కుంభమేళాతో వెలుగులోకి వచ్చిన…