భాషతో సంబంధం లేకుండా ప్రపంచమంతా కోట్లాది అభిమానులను సంపాదించుకున్న మాస్ట్రో ఇళయరాజా ఇప్పటి 5జి జనరేషన్ సంగీత ప్రియులకు సైతం ఆరాధ్యనీయులు. తెలుగులో ఎన్నో ఎవర్ గ్రీన్ ఆల్బమ్స్ ఇచ్చి ప్రేక్షకుల హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్నారు. అలాంటి లెజెండరీ మీద ఎవరైనా కామెంట్ చేస్తే కోపం రావడం సహజం.
డిటెక్టివ్, పిశాచి, సైకో లాంటి సినిమాల ద్వారా మనకూ పరిచయమున్న దర్శకుడు, నటుడు మిస్కిన్ ఈ తప్పు చేశారు. బాటిల్ రాధ అనే తమిళ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఇళయరాజా మీద చేసిన కామెంట్లు ఇంటా బయటా తీవ్ర ఆగ్రహానికి కారణమయ్యాయి.
తన ప్రసంగంలో భాగంగా ఆయన మాట్లాడుతూ రాజా సంగీతం విని మద్యానికి బానిసైన వాళ్ళు ఎందరో ఉన్నారని, ఆరోగ్యాలు పాడు చేసుకున్నారని అన్నారు. దీంతో ఒక్కసారిగా అక్కడున్న వారంతా షాక్ తిన్నారు. ఆయన ఉద్దేశం ఏదైనా అర్థం మాత్రం పూర్తి నెగటివ్ గా వచ్చేసింది.
అంటే ఇళయరాజా పాటలు వినే పబ్లిక్ బార్లకు వెళ్ళేవాళ్ళనే కోణంలో మీనింగ్ రావడంతో ఒక్కసారిగా సోషల్ మీడియా నెటిజెన్లు భగ్గుమన్నారు. జరిగిన తప్పు తెలుసుకున్న మిస్కిన్ వెంటనే క్షమాపణ చెప్పారు కానీ ఆలోగానే చాలా డ్యామేజ్ అయిపోయింది. ఈయన సైకోకి సంగీతం ఇచ్చింది ఇళయరాజానే.
హీరో విశాల్ తీవ్రంగా స్పందిస్తూ గొప్ప వ్యక్తులను కించపరిచేలా మాట్లాడ్డంలో మిస్కిన్ ఎప్పటి నుంచో ఇదే ధోరణి ప్రదర్శిస్తున్నారని దుయ్యబట్టాడు. ఇళయరాజాని అనేంత స్థాయి మిస్కిన్ కు లేదని సారీ చెప్పినంత మాత్రాన తప్పు ఒప్పుగా మారదని ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇక్కడో విషయాన్ని గుర్తు చేసుకోవాలి.
డిటెక్టివ్ 2 తీస్తున్న టైంలోనే విభేదాలు తలెత్తి ఆ ప్రాజెక్టు నుంచి మిస్కిన్ బయటికి వచ్చాడు. విశాల్ స్వయంగా దర్శకత్వం వహించాలని నిర్ణయించుకున్నాడు. అయినా మిస్కిన్ ఇలా నోరు జారడం ఇదే మొదటిసారి కాదు. కొట్టుకలి ఈవెంట్ లో ఈ సినిమా ఆడకపోతే నగ్నంగా నిలబడతానని స్టేట్ మెంట్ ఇచ్చి కాంట్రావర్సి రేపాడు.
This post was last modified on January 27, 2025 12:49 pm
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…