ఒకప్పుడు బాక్సాఫీస్ దగ్గర ఆశించిన ఫలితాలు అందుకోలేకపోయిన కొన్ని సినిమాలు దశాబ్దాల తర్వాత రీ రిలీజైతే వాటిని సెలబ్రేషన్ లా చూస్తున్న ప్రేక్షకులు లక్షలు కోట్లలో ఉంటున్నారు. నాగబాబుని నష్టాలపాలు చేసిన ఆరంజ్ గత ఏడాది హౌస్ ఫుల్ బోర్డులతో కిటకిటలాడించింది.
దర్శకుడి కెరీర్ నే తిరబెట్టిన ఓయ్ కొచ్చిన రెస్పాన్స్ చూసి ట్రేడ్ సైతం ఆశ్చర్యపోయింది. తాజాగా రవితేజ నేనింతేని నిన్న థియేటర్లకు తీసుకొచ్చారు. పూరి జగన్నాథ్ డైరెక్షన్లో సియా గౌతమ్ హీరోయిన్ గా నటించిన ఈ ఇండస్ట్రీ బ్యాక్ డ్రాప్ డ్రామాకు చక్రి పాటలు చాలా ప్లసయ్యాయి. 2008లో నేనింతే కమర్షియల్ గా సక్సెస్ కాలేదు.
దానికి ప్రధాన కారణం పరిశ్రమకు సంబంధించిన సమస్యలను నేపథ్యంగా చూపించడం మాస్ ఆడియన్స్ కి కనెక్ట్ కాలేదు. నిర్మాతల కష్టాలు, హీరోల ప్రెస్టీజ్ కోసం అభిమానులు చేసే వెర్రి చేష్టలు, ఆత్మహత్యకు దారి తీసే పరిస్థితులు ఇవన్నీ ఎంత రియలిస్టిక్ గా ఉన్నా జనాలకు ఎక్కలేదు. అందులోనూ హీరోయిన్ ఊహించినంత అందంగా లేకపోవడం మైనసయ్యింది.
కృష్ణనగరే మామ పాట మాత్రం ఓ రేంజ్ ఓ ఊపేసింది. చక్రి ట్యూన్ కి భాస్కర భట్ల సాహిత్యం చక్కగా కుదిరి సినిమా అవకాశాల కోసం కష్టపడే కుర్రాళ్ళ కష్టాలను కళ్ళకు కట్టినట్టు వినిపించాయి. ఇదంతా గతంలో దక్కిన ఫలితం.
నిన్న నేనింతేకు వచ్చిన స్పందన నెక్స్ట్ లెవెల్ లో ఉంది. విజనరీ పూరి అంటూ మూవీ లవర్స్ ప్రశంసలు గుప్పిస్తున్నారు. ఇప్పటి పరిస్థితులను అప్పట్లోనే అంచనా వేసి సహజత్వానికి దగ్గరగా ఎలా తీశారంటూ ట్వీట్లు పెడుతున్నారు. ముఖ్యంగా ఫేక్ కలెక్షన్లు, రివ్యూలు, పోస్టర్ల గోల, థియేటర్ దగ్గర పబ్లిక్ టాక్ లాంటి ఎన్నో విషయాలు కథలో అంతర్భాగంగా గొప్పగా కుదిరాయని ప్రశంసిస్తున్నారు.
పద్దెనిమిది సంవత్సరాల క్రితం నేనింతే ఎందుకు విజయం సాధించలేదనేది పక్కనపెడితే ఆనాటి వింటేజ్ పూరి జగన్నాథ్ మళ్ళీ బయటికి రావాలని సినీ ప్రియులు డిమాండ్ చేస్తున్నారు. వాళ్లే కాదు అందరి కోరిక అదేమరి.
This post was last modified on January 27, 2025 10:24 am
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…
కుప్పం.. ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం. గత 40 సంవత్సరాలుగా ఏక ఛత్రాధిపత్యంగా చంద్రబాబు ఇక్కడ విజయం దక్కించుకుంటున్నారు.…